ఏ ముహూర్తంలో బాహుబలి జాతీయ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిందో అప్పటి నుంచి తెలుగు సినిమా జెండా అంతర్జాతీయంగా ఎగరడం మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చాక ప్రపంచమంతా రాజమౌళి గొప్పదనం గురించి మాట్లాడుకున్నారు. తాజాగా పుష్ప 2 ది రూల్ ఉత్తరాది రాష్ట్రాల్లో సృష్టిస్తున్న సంచలనం చూస్తూ నార్త్ బయ్యర్లకు నోట మాట రావడం లేదు. బిసి సెంటర్లలో ఒక టాలీవుడ్ డబ్బింగ్ మూవీ టికెట్ల కోసం జనం కొట్టుకోవడం, బారులు తీరడం చూసి ఇదెక్కడి మాసయ్యా అంటూ షాక్ తో కలెక్షన్లు లెక్కబెట్టుకున్నారు. ఇప్పుడీ సెగలు బాలీవుడ్ లో ఎందరికో తగులుతున్న మాట వాస్తవం.
తాజాగా జరిగిన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బోనీ కపూర్ కు నిర్మాత నాగవంశీ ఇచ్చిన వివరణ వీడియో రూపంలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ మేకర్స్ బాంద్రా, జుహు ప్రాంతాల్లో నివసించే ఖరీదైన ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తున్నారని, కానీ బాహుబలితో మొదలుపెట్టి పుష్ప 2 దాకా క్లాసు మాసుని మెప్పించేలా ఫిలిం మేకింగ్ లో కొత్త ప్రమాణాలు నిర్దేశించింది టాలీవుడ్డేనని లాజికల్ గా చెప్పడంతో అక్కడున్న వారికి నోటమాట రాకుండా చేసింది. ఒక్క హిందీలోనే పుష్ప 2 మొదటి రోజు 85 కోట్లకు పైగా వసూలు చేయడం చూసి బాలీవుడ్ లో ఆ రోజు రాత్రి చాలా మంది నిద్రపోయి ఉండరని చెప్పడం మాములుగా పేలలేదు.
ఇవన్నీ కాదనలేని వాస్తవం. బోనీ కపూర్ తనవంతుగా ఏదో సమర్ధించుకునే ప్రయత్నం చేశారు కానీ మొఘల్ ఏ అజమ్ తర్వాత బాహుబలినే ఉదాహారణగా ప్రస్తావించడం దగ్గర దొరికిపోయారు. ఒకప్పుడు హిందీలో ఎన్నో మాస్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా ముఖ్యంగా ఓటిటి ఎరా వచ్చాక ఎందరో ప్రొడ్యూసర్లు కేవలం అర్బన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు. వీటిని చూడలేకే జనాలు నవ్వించి భయపెట్టే హారర్ కామెడీలను నెత్తిన బెట్టుకున్నారు. మార్కోలో అంత వయొలెన్స్ ఉన్నా ఎగబడి చూస్తున్న దానికి కారణం మాస్ కంటెంటే. నాగవంశీ కౌంటర్లకు నెటిజెన్ల నుంచి మంచి మద్దతు దక్కుతోంది.
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…