ఏ ముహూర్తంలో బాహుబలి జాతీయ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిందో అప్పటి నుంచి తెలుగు సినిమా జెండా అంతర్జాతీయంగా ఎగరడం మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చాక ప్రపంచమంతా రాజమౌళి గొప్పదనం గురించి మాట్లాడుకున్నారు. తాజాగా పుష్ప 2 ది రూల్ ఉత్తరాది రాష్ట్రాల్లో సృష్టిస్తున్న సంచలనం చూస్తూ నార్త్ బయ్యర్లకు నోట మాట రావడం లేదు. బిసి సెంటర్లలో ఒక టాలీవుడ్ డబ్బింగ్ మూవీ టికెట్ల కోసం జనం కొట్టుకోవడం, బారులు తీరడం చూసి ఇదెక్కడి మాసయ్యా అంటూ షాక్ తో కలెక్షన్లు లెక్కబెట్టుకున్నారు. ఇప్పుడీ సెగలు బాలీవుడ్ లో ఎందరికో తగులుతున్న మాట వాస్తవం.
తాజాగా జరిగిన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బోనీ కపూర్ కు నిర్మాత నాగవంశీ ఇచ్చిన వివరణ వీడియో రూపంలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ మేకర్స్ బాంద్రా, జుహు ప్రాంతాల్లో నివసించే ఖరీదైన ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తున్నారని, కానీ బాహుబలితో మొదలుపెట్టి పుష్ప 2 దాకా క్లాసు మాసుని మెప్పించేలా ఫిలిం మేకింగ్ లో కొత్త ప్రమాణాలు నిర్దేశించింది టాలీవుడ్డేనని లాజికల్ గా చెప్పడంతో అక్కడున్న వారికి నోటమాట రాకుండా చేసింది. ఒక్క హిందీలోనే పుష్ప 2 మొదటి రోజు 85 కోట్లకు పైగా వసూలు చేయడం చూసి బాలీవుడ్ లో ఆ రోజు రాత్రి చాలా మంది నిద్రపోయి ఉండరని చెప్పడం మాములుగా పేలలేదు.
ఇవన్నీ కాదనలేని వాస్తవం. బోనీ కపూర్ తనవంతుగా ఏదో సమర్ధించుకునే ప్రయత్నం చేశారు కానీ మొఘల్ ఏ అజమ్ తర్వాత బాహుబలినే ఉదాహారణగా ప్రస్తావించడం దగ్గర దొరికిపోయారు. ఒకప్పుడు హిందీలో ఎన్నో మాస్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా ముఖ్యంగా ఓటిటి ఎరా వచ్చాక ఎందరో ప్రొడ్యూసర్లు కేవలం అర్బన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు. వీటిని చూడలేకే జనాలు నవ్వించి భయపెట్టే హారర్ కామెడీలను నెత్తిన బెట్టుకున్నారు. మార్కోలో అంత వయొలెన్స్ ఉన్నా ఎగబడి చూస్తున్న దానికి కారణం మాస్ కంటెంటే. నాగవంశీ కౌంటర్లకు నెటిజెన్ల నుంచి మంచి మద్దతు దక్కుతోంది.
This post was last modified on December 31, 2024 9:12 am
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…