బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం. బిజినెస్ పరంగా కూడా అంతే. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న ప్రమోషన్లు, చేయించుకున్న పాటలు చాలా స్మార్ట్ గా ఉంటూ పెద్దగా ఖర్చు లేకుండా పని కానిస్తున్నాయి. తాజాగా వెంకటేష్ తో నేను పాడతా అంటూ స్వాతిముత్యంలో ఇళయరాజా బీజీఎమ్ వాడుకుంటూ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్ మాములు కామెడీగా లేదు. కమల్ హాసన్ ని అనుకరిస్తూ వెంకీ ఇచ్చిన టైమింగ్ ఓ రేంజ్ లో పేలింది. మూడో సాంగ్ ఆయనే స్వయంగా పాడిటం విశేషం.
ఇంతకు ముందు ఒక గుంపు షూటింగ్ స్పాట్ కు వచ్చినట్టు చూపించి వాళ్ళు చరణ్ ఫ్యాన్సా లేక బాలయ్య అభిమానులా అని చెప్పించి కట్ చేసిన వీడియో బైట్ బాగా పేలింది. ఇలా పబ్లిసిటీ పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు క్రమంగా హైప్ పెంచుతున్నాయి. రెండు పాటలు అల్రెడీ ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. మూడోది వాటిని మించి ఉంటుందని ఊరిస్తున్నారు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ కాంపిటీషన్ తట్టుకుంటూ తన సినిమాకు ఎక్కువ బజ్ వచ్చేలా చేసుకోవడంలో రావిపూడి తన క్రియేటివిటీని బయటికి తీస్తున్నాడు. అందులో భాగంగా వదులుతున్న ప్రోమోలు బాగా వర్కౌట్ అవుతున్నాయి.
జనవరి 14 విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ, యాక్షన్ రెండూ మిక్స్ చేసి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తీర్చిదిద్దారని టాక్. ఎఫ్2 తరహాలో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా హిట్టు కొట్టడం ఖాయమని వెంకీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత జనవరిలో రేగిన ఫ్లాప్ గాయం ఈసారి మాయమవుతుందని కోరుకుంటున్నారు. భీమ్స్ ఆశ్చర్యకరంగా సూపర్ హిట్ ఆల్బమ్ కంపోజ్ చేయడం హైప్ పరంగా ఉపయోగపడుతోంది. రెండు సినిమాలు నిర్మించడంతో పాటు మూడోది డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు మీద ఒత్తిడి తగ్గేలా అనిల్ రావిపూడి చేసుకుంటున్న సెల్ఫ్ ప్లానింగ్ మంచి ఫలితాలే ఇచ్చేలా ఉంది.
This post was last modified on December 26, 2024 6:33 pm
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…