టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ఉంచగా…కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు టాలీవుడ్ పెద్దలు ఉంచారు. సమావేశంలో హీరో అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చినపుడు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ పై తనకు కోపం లేదని, తనకు చిన్నప్పటి నుంచి బన్నీ, చెర్రీ తెలుసని, వారితో కలిసి తిరిగారని రేవంత్ అన్నారు.
అయితే, వ్యక్తిగతంగా అల్లు అర్జున్ తో ఉన్న పరిచయం వేరని, చట్ట ప్రకారం ఆ ఘటన నేపథ్యంలో వ్యవహరించామని రేవంత్ చెప్పారు. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చామని, అయితే, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తీవ్రత నేపథ్యంలోనే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని రేవత్ అన్నారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండేందుకే దిల్ రాజును టీఎఫ్డీసీ ఛైర్మన్గా నియమించామని తెలిపారు. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, సినీ ప్రముఖులు లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఆ కమిటీ కృషి చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నో చేశాయని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని అన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సాహించడమే తమ ముఖ్య ఉద్దేశమని, పరిశ్రమను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లే దిశగా ముందుకు పోతున్నామని చెప్పారు. ముంబైలో మంచి వాతావరణం ఉండడం వల్లే బాలీవుడ్ అక్కడ డెవలప్ అయిందని, బాలీవుడ్ ను కూడా షూటింగుల కోసం హైదరాబాద్ వచ్చేలా చేయాలని అన్నారు.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…