సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి 28 రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంత ఆలస్యంగానా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ దేశంలో ఇతర బాషా చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చాలా తతంగంతో పాటు స్క్రీన్ల అందుబాటు, సెన్సార్ నిబంధనలు తదితర వ్యవహారాలు చూసుకోవాలి. దానికి సరిపడా ప్లానింగ్ ని కనీసం మూడు నాలుగు నెలల ముందు నుంచే చేసుకోవాలి. దేవర నిర్మాతలు దాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవిని టార్గెట్ గా చేసుకున్నారు. వేలాది స్క్రీన్లలో జపాన్ ఆడియన్స్ దేవర దర్శనం చేసుకోబోతున్నారు.
ఇంట గెలిచిన దేవర రచ్చ గెలుస్తాడా అనేది ఆసక్తికరం. ఇప్పటిదాకా జపాన్ లో హయ్యెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన వాటిలో ఆర్ఆర్ఆర్, ముత్తు, బాహుబలి 2, త్రీ ఇడియట్స్, దంగల్, కెజిఎఫ్ 2 ఉన్నాయి. ఇటీవలే వెళ్లిన కల్కి 2898 ఏడి ఏమంత అద్భుతాలు చేయలేకపోయిందని ట్రేడ్ టాక్. ఇంకా ఫిగర్స్ రావాల్సి ఉంది. జపాన్ ప్రేక్షకులు సాధారణంగా ఎమోషన్లతో కూడిన హీరోయిజం ఎలివేషన్ కథలను బాగా ఇష్టపడతారు. పాటలు బాగుంటే అదొక బోనస్. ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ అయినవన్నీ మ్యూజికల్ హిట్సే. దేవరకి అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సంగీతం వాళ్ళను మెప్పించే ఛాన్స్ లేకపోలేదు.
ఇంకా చాలా టైం ఉంది కాబట్టి జపాన్ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు ప్లాన్ చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ హీరోల్లో ఒకడిగా జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడ ఇమేజ్ ఉంది. ఇది దేవరకు ప్లస్ అవుతుంది. దాన్ని సరిగ్గా వాడుకుంటే కనక ఓపెనింగ్స్ బాగుంటాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు మొదలుపెడతారనేది తెలియదు కానీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. వార్ 2 పూర్తయ్యాక తారక్ వెంటనే ప్రశాంత్ నీల్ సెట్స్ లో అడుగు పెడతాడు. ఆ తర్వాత కానీ దేవర 2 ఉండే ఛాన్స్ లేదు. చూడాలి మరి ఏం నిర్ణయం తీసుకుంటారో.
This post was last modified on December 26, 2024 6:42 pm
రాజా సింగ్... ఈ పేరు వింటేనే ఒక రకమైన భావన కలుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా…
రెండు నెలల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్లో స్లంప్ నడిచాక.. మార్చి మూడో వారంలో దురంధర్-2, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల…
తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలోకి మరో పార్టీ ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చే నెలలో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ సూపర్…
ఇరాన్పై అమెరికా+ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం ప్రారంభించి 29వ తేదీకి నెల పూర్తవుతుంది. గత నెల 28న తెలతెల వారుతూనే ప్రారంభించిన…
ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’తో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు బాక్సాఫీస్ స్టామినా…
సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్టులో హీరోయిన్గా నయనతార పేరు గట్టిగా వినిపిస్తోంది. దిల్ రాజు…