Movie News

ఎవ్వరూ నోరు తెరవొద్దు.. ‘మా’ సభ్యులతో విష్ణు

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ గొడవ.. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఎంతగా మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయో తెలిసిందే. అల్లు అర్జున్ వ్యవహారంతో ఇండస్ట్రీ ఇరుకున పడే పరిస్థితి వచ్చిందని కొందరి అభిప్రాయం.

పెద్ద సినిమాలకు ఇకపై బెనిఫిట్ షోలు, అధిక రేట్లకు అనుమతులు రావని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో టాలీవుడ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ఈ పరిణామాలతో ఫిలిం ఇండస్ట్రీ వెర్సస్ ప్రభుత్వం అన్నట్లుగా తయారైంది. సున్నితంగా మారిన ఈ పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. సున్నితమైన అంశాలపై ‘మా’ సభ్యులు ఎవరూ స్పందించవద్దని ఆయన కోరారు.

‘‘మన కళాకారులు ఎప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. సృజనాత్మకత, సహకారం మీద ఆధార పడి నడుస్తుంది మన పరిశ్రమ. గతంలో ప్రభుత్వాల మద్దతుతో మన ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడడానకి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం ఎంతో ముఖ్యమైంది. దాంతో మొదలుకుని ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి.

ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సభ్యులంతా సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం, వివాదాస్పద అంశాలపై ఒక వైపే మాట్లాడడం మానుకోవాలి. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, కొన్ని విషాదకరమైనవి. అలాంటి అంశాలపై మాట్లాడ్డం వల్ల సమస్యలను పరిష్కరించడానికి బదులు.. మరింత నష్టం చేకూరుస్తుంది. ఇలాంటి సమయంలో మనకు సహనం, సానుభూతి, ఐకమత్యం అవసరం. మా ఒక పెద్ద కుటుంబం అన్న సంగతి గుర్తుంచుకుందాం. ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం’’ అని మంచు విష్ణు పేర్కొన్నాడు.

This post was last modified on December 25, 2024 4:52 pm

Share

Recent Posts

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

40 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

45 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago