సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు వారాంతాల్లో సందడి ఉంటుంది. సెలబ్రేషన్ మూడ్లో ఉండే జనాలు థియేటర్లకు బాగానే వస్తారు. ఈ టైంలో బాక్సాఫీస్ దగ్గర పోటీ కూడా బాగానే ఉంటుంది. ఈసారి కూడా రిలీజైన సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ వాటిలో భారీ అంచనాలున్న సినిమాలేవీ లేవు. తండేల్, రాబిన్ హుడ్ లాంటి క్రేజీ సినిమాలు క్రిస్మస్ రేసు నుంచి తప్పుకోవడంతో ఈ సీజన్ కళ తప్పింది.
రిలీజైన మిగతా సినిమాలేవీ ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన తెచ్చుకోలేకపోయాయి. గత వీకెండ్లో నాలుగు సినిమాలు రిలీజైనా.. ఒక్కటీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. గత వారం రిలీజైన నాలుగు చిత్రాల్లో అల్లరి నరేష్ సినిమా ‘బచ్చలమల్లి’ ఒక్కటే స్ట్రెయిట్ మూవీ. దానిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. కొన్ని ఎపిసోడ్లు బాగున్నప్పటికీ సినిమా ఓవరాల్గా మెప్పించలేకపోయింది.
అల్లరి నరేష్ నటన మినహాయిస్తే సినిమాలో స్టాండౌట్గా నిలిచే విషయాలు లేవు. సీరియస్ సినిమా కావడం వల్ల ఈ సినిమాకు సరైన వసూళ్లు కూడా రావట్లేదు. ఇక తమిళ అనువాద చిత్రం ‘విడుదల-2’.. విడుదల-1 తరహాలో మెప్పించలేకపోయింది. ఉపేంద్ర సినిమా ‘యుఐ’ ప్రేక్షకుల మెదడుకు చాలా పరీక్షలు పెడుతూ పర్లేదు అనే స్ధాయిలో వసూలు చేస్తుంది. హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘ముఫాసా’లో మహేష్ వాయిస్ ఓవర్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు.
ఈ నాలుగు చిత్రాల్లో ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడలేకపోయింది. ఇంతలో ఈ వారం మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర పోషించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’కు పెద్దగా బజ్ లేదు. డబ్బింగ్ సినిమాలు బరోజ్, మ్యాక్స్లకు కూడా హైప్ కనిపించడం లేదు. వీటి టాక్ను బట్టి థియేటర్లకు జనం వస్తారేమో చూడాలి. మొత్తంగా చూస్తే క్రిస్మస్ లాంటి క్రేజీ సీజన్ వేస్టయిపోతున్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on December 24, 2024 7:59 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…