టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మోహన్ బాబు, మంచు మనోజ్ లు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మనోజ్ చొక్కాను బౌన్సర్లు చింపివేయడం, మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం వంటి ఘటనలు సంచలనం రేపాయి. ఆ తర్వాత మోహన్ బాబు, ఆయన సతీమణి ఆసుపత్రిలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు.
మీడియాపై దాడి చేసినందుకు తన తండ్రి మోహన్ బాబు తరఫున మీడియాకు మనోజ్ క్షమాపణలు చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మనోజన తన భార్య 7 నెలల గర్భవతిగా ఉన్నపుడు ఎన్నో బాధలు అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి గతంలో అలా ఉండేవారు కాదని అన్నారు. తన తండ్రి తనకు దేవుడు అని, అయితే, ఈరోజు కనిపిస్తున్న మా నాన్న మా నాన్న కాదని షాకింగ్ కామెంట్లు చేశారు.
తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పుడూ ఎవరినీ ఆస్తులు అడగలేదని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి నాన్నగారికి లేనిపోనివి చెప్పారని, ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో నాన్నతో తనకు విభేదాలు సృష్టించారని వాపోయారు. ఈ గొడవలోకి తన భార్య, 7 నెలల కూతురి పేరును లాగుతున్నారని అన్నారు. తన సొంత కాళ్ల మీద నిలబడేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందని, క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలను బయటపెడతానని మనోజ్ మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు.
This post was last modified on December 11, 2024 1:04 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…