ఇటీవల వరుస సినిమాలు నిరాశపరచడంతో గోపీచంద్ మార్కెట్ చాలా వరకు డౌన్ అయ్యింది. ‘భీమా’తో కొంత ఊరట పొందినప్పటికీ, ‘విశ్వం’తో తిరిగి ఫ్లాప్ బాట పట్టాడు. ఈ నేపథ్యంలో గోపీచంద్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గోపీచంద్ ఒక యువ దర్శకుడితో కలిసి కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొన్నటివరకు మాస్ కమర్షియల్ దర్శకులను నమ్మిన గోపి ఈసారి కంప్లీట్ గా అలాంటి దర్శకులను దూరం పెట్టాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణతో ఒక సినిమా అనుకున్నప్పటికి అది ఇంకా సెట్స్ పైకి రాలేదు.
ఇక ఇప్పుడు ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డిని లైన్ లోకి తెచ్చాడు. సంకల్ప్ రెడ్డి ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేస్తుంటాడు. ‘ఘాజీ’తో దేశానికి సంబంధించిన గొప్ప ఘట్టాన్ని హైలైట్ చేస్తూ ప్రశంసలు అందుకున్న సంకల్ప్, ‘అంతరిక్షం’తో మరో ప్రయోగం చేయగా అది షాక్ ఇచ్చింది. ‘ఐబీ-71’ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ సంకల్ప్ కథల విషయంలో ఎప్పుడూ కొత్తదనం చూపిస్తారనే పేరుంది.
ఇప్పుడు గోపీచంద్కు వినిపించిన కథ కూడా కొత్త కాన్సెప్ట్తో రూపొందిందని తెలుస్తోంది. సంకల్ప్ రెడ్డి మాస్ కమర్షియల్ కథలను ఎప్పుడూ టచ్ చేయలేదు. అతని సినిమాలు ఎక్కువగా వాస్తవ సంఘటనల ఆధారంగా ఉంటాయి. ఇక గోపీచంద్ తో కూడా రియల్ స్టోరీతోనే మెప్పించినట్లు తెలుస్తోంది. గోపి మాస్ ఆడియన్స్లో బలమైన ఫాలోయింగ్ కలిగి ఉండగా, ఈసారి ఈ కాంబినేషన్ ఏవిధంగా వర్క్ అవుట్ అవుతుందనే ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాకు చిట్టూరి శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘విశ్వం’ తర్వాత గోపీచంద్ చేయబోయే సినిమా ఇదే అని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
This post was last modified on December 10, 2024 3:09 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…