వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లో మార్పు రావాలంటూ.. పెద్ద ఎత్తున సొంత పార్టీ నాయకులే కోరుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక మంది నాయకులు బయటకు చెబుతున్న, అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్న విషయం కూడా.. ఇదే! జగన్ మారాలి.. మా పార్టీ మారాలి! అనే!! కానీ, జగన్ మాత్రం మారడం లేదు. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తను నవరత్నాలు ఇచ్చి.. ప్రజలకు మేలు చేసినా.. తనకు ఓట్లేయలేదని.. ప్రజా సమస్యలను కూడా వదిలేశారు.
ఇక,తనపై విమర్శలు చేస్తున్నారంటూ.. సొంత సోదరి షర్మిల, తల్లి విజయమ్మలను కూడా వదులుకున్నారు. తాను వదులుకున్నవే కాకుండా.. తనను వదులుకున్న వారిని కూడా జగన్ పట్టించుకోవడం లేదు. అయితే.. ఈ అన్ని అంశాలకూ కారణం.. జగన్ ఒంటెత్తు పోకడలేనని అంటున్నారు సొంత నాయకులు. ఇక, సాధారణ ప్రజానీకంలోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇక, విపక్షాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది.? అంటే.. మొత్తంగా జగన్ తన పంథాను మార్చుకోవాల్సి ఉంది.
అందరూ కోరుతున్నది జగన్ లో మార్పు అయితే.. జగన్ మాత్రం.. ఈ సమస్యలన్నింటికీ.. తన తాడేపల్లి ప్యాలెస్సే కారణమని భావిస్తున్నారట. అంటే వాస్తు లోపాలు! ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. నిత్యం బైబిల్ చదివే జగన్ హిందూ వాస్తును నమ్మడమేంటనే సందేహం కూడా రావొచ్చు. కానీ, ఇది నిజమేనని చెబుతున్నారు పరిశీలకులు. తాజాగా తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు మార్పులు జోరుగా సాగుతున్నాయని తెలిసింది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్యుడు, వాస్తు సిద్ధాంతి సూచనల మేరకు ఇలా చేస్తున్నారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఏం మార్పులు చేస్తున్నారు?
This post was last modified on December 10, 2024 3:44 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…