Political News

తాను మారాల్సింది పోయి.. ఇల్లు మారుస్తున్న జ‌గ‌న్‌!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌లో మార్పు రావాలంటూ.. పెద్ద ఎత్తున సొంత పార్టీ నాయ‌కులే కోరుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వ‌ర‌కు అనేక మంది నాయ‌కులు బ‌య‌ట‌కు చెబుతున్న, అంత‌ర్గతంగా వ్యాఖ్యానిస్తున్న విష‌యం కూడా.. ఇదే! జ‌గ‌న్ మారాలి.. మా పార్టీ మారాలి! అనే!! కానీ, జ‌గ‌న్ మాత్రం మార‌డం లేదు. త‌న‌కు ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం లేద‌ని అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. త‌ను న‌వ‌ర‌త్నాలు ఇచ్చి.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసినా.. త‌న‌కు ఓట్లేయ‌లేద‌ని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను కూడా వ‌దిలేశారు.

ఇక‌,త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ.. సొంత సోద‌రి ష‌ర్మిల‌, త‌ల్లి విజ‌య‌మ్మ‌ల‌ను కూడా వ‌దులుకున్నారు. తాను వ‌దులుకున్న‌వే కాకుండా.. త‌న‌ను వ‌దులుకున్న వారిని కూడా జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే.. ఈ అన్ని అంశాల‌కూ కార‌ణం.. జ‌గ‌న్ ఒంటెత్తు పోక‌డ‌లేన‌ని అంటున్నారు సొంత నాయ‌కులు. ఇక‌, సాధార‌ణ ప్ర‌జానీకంలోనూ ఇలాంటి చ‌ర్చే జ‌రుగుతోంది. ఇక‌, విప‌క్షాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది.? అంటే.. మొత్తంగా జ‌గ‌న్ త‌న పంథాను మార్చుకోవాల్సి ఉంది.

అందరూ కోరుతున్న‌ది జ‌గ‌న్ లో మార్పు అయితే.. జ‌గ‌న్ మాత్రం.. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ.. త‌న తాడేప‌ల్లి ప్యాలెస్సే కార‌ణ‌మ‌ని భావిస్తున్నార‌ట‌. అంటే వాస్తు లోపాలు! ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. నిజం. నిత్యం బైబిల్ చ‌దివే జ‌గ‌న్ హిందూ వాస్తును న‌మ్మ‌డ‌మేంట‌నే సందేహం కూడా రావొచ్చు. కానీ, ఇది నిజ‌మేన‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా తాడేప‌ల్లి ప్యాలెస్‌లో వాస్తు మార్పులు జోరుగా సాగుతున్నాయ‌ని తెలిసింది. హైద‌రాబాద్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ జ్యోతిష్యుడు, వాస్తు సిద్ధాంతి సూచ‌న‌ల మేర‌కు ఇలా చేస్తున్నార‌ని వైసీపీ ముఖ్య నేత‌లు చెబుతున్నారు.

ఏం మార్పులు చేస్తున్నారు?

  • త‌న అధికారం పోవ‌డానికి కార‌ణ‌మ‌ని భావిస్తున్న నైరుతి మూల ప‌ల్లం త‌గ్గించి.. హైట్ లేపుతున్నారు.
  • ప‌శ్చిమ ఎంట్ర‌న్స్‌ను పూర్తిగా మూసివేయించ‌నున్నారు. నాయ‌కులు ఎవ‌రు వ‌చ్చినా.. ఈ మార్గం నుంచే లోప‌లికి ప్ర‌వేశించేవారు. ఇప్పుడుదీనిని మూసివేసి.. ప్ర‌త్యామ్నాయంగా ఉత్త‌రం వైపు పెద్ద గేటును నిల‌బెట్ట‌నున్నారు.
  • పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు, కుటుంబ స‌భ్యుల‌తో వివాదాల‌కు కార‌ణం.. వాయువ్య భాగం దెబ్బ‌తిన‌డ‌మేన‌ని సిద్ధాంతులు చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం ఇక్క‌డ ఉన్న పార్కింగ్‌ను మార్చి.. దానిని స‌రిచేయ‌డం ద్వారా పార్టీ స‌హా.. కుటుంబ వివాదాలు స‌మ‌సి పోతాయ‌ని లెక్కలు వేసుకుంటున్నారు.
  • ఇక‌, కీల‌క‌మైన తూర్పులో మెర‌క ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇక్క‌డ కూడా మార్పులు చేసి.. ప‌ల్లం చేయ‌నున్నారు. మొత్తానికి ఈ వాస్తు మార్పులు బాగానే ఉన్నా.. అస‌లు మారాల్సింది.. జ‌గ‌నే క‌దా! అంటున్నారు నెటిజ‌న్లు.
Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago