వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లో మార్పు రావాలంటూ.. పెద్ద ఎత్తున సొంత పార్టీ నాయకులే కోరుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక మంది నాయకులు బయటకు చెబుతున్న, అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్న విషయం కూడా.. ఇదే! జగన్ మారాలి.. మా పార్టీ మారాలి! అనే!! కానీ, జగన్ మాత్రం మారడం లేదు. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తను నవరత్నాలు ఇచ్చి.. ప్రజలకు మేలు చేసినా.. తనకు ఓట్లేయలేదని.. ప్రజా సమస్యలను కూడా వదిలేశారు.
ఇక,తనపై విమర్శలు చేస్తున్నారంటూ.. సొంత సోదరి షర్మిల, తల్లి విజయమ్మలను కూడా వదులుకున్నారు. తాను వదులుకున్నవే కాకుండా.. తనను వదులుకున్న వారిని కూడా జగన్ పట్టించుకోవడం లేదు. అయితే.. ఈ అన్ని అంశాలకూ కారణం.. జగన్ ఒంటెత్తు పోకడలేనని అంటున్నారు సొంత నాయకులు. ఇక, సాధారణ ప్రజానీకంలోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇక, విపక్షాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది.? అంటే.. మొత్తంగా జగన్ తన పంథాను మార్చుకోవాల్సి ఉంది.
అందరూ కోరుతున్నది జగన్ లో మార్పు అయితే.. జగన్ మాత్రం.. ఈ సమస్యలన్నింటికీ.. తన తాడేపల్లి ప్యాలెస్సే కారణమని భావిస్తున్నారట. అంటే వాస్తు లోపాలు! ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. నిత్యం బైబిల్ చదివే జగన్ హిందూ వాస్తును నమ్మడమేంటనే సందేహం కూడా రావొచ్చు. కానీ, ఇది నిజమేనని చెబుతున్నారు పరిశీలకులు. తాజాగా తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు మార్పులు జోరుగా సాగుతున్నాయని తెలిసింది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్యుడు, వాస్తు సిద్ధాంతి సూచనల మేరకు ఇలా చేస్తున్నారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఏం మార్పులు చేస్తున్నారు?
This post was last modified on December 10, 2024 3:44 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…