వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లో మార్పు రావాలంటూ.. పెద్ద ఎత్తున సొంత పార్టీ నాయకులే కోరుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక మంది నాయకులు బయటకు చెబుతున్న, అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్న విషయం కూడా.. ఇదే! జగన్ మారాలి.. మా పార్టీ మారాలి! అనే!! కానీ, జగన్ మాత్రం మారడం లేదు. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తను నవరత్నాలు ఇచ్చి.. ప్రజలకు మేలు చేసినా.. తనకు ఓట్లేయలేదని.. ప్రజా సమస్యలను కూడా వదిలేశారు.
ఇక,తనపై విమర్శలు చేస్తున్నారంటూ.. సొంత సోదరి షర్మిల, తల్లి విజయమ్మలను కూడా వదులుకున్నారు. తాను వదులుకున్నవే కాకుండా.. తనను వదులుకున్న వారిని కూడా జగన్ పట్టించుకోవడం లేదు. అయితే.. ఈ అన్ని అంశాలకూ కారణం.. జగన్ ఒంటెత్తు పోకడలేనని అంటున్నారు సొంత నాయకులు. ఇక, సాధారణ ప్రజానీకంలోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇక, విపక్షాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది.? అంటే.. మొత్తంగా జగన్ తన పంథాను మార్చుకోవాల్సి ఉంది.
అందరూ కోరుతున్నది జగన్ లో మార్పు అయితే.. జగన్ మాత్రం.. ఈ సమస్యలన్నింటికీ.. తన తాడేపల్లి ప్యాలెస్సే కారణమని భావిస్తున్నారట. అంటే వాస్తు లోపాలు! ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. నిత్యం బైబిల్ చదివే జగన్ హిందూ వాస్తును నమ్మడమేంటనే సందేహం కూడా రావొచ్చు. కానీ, ఇది నిజమేనని చెబుతున్నారు పరిశీలకులు. తాజాగా తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు మార్పులు జోరుగా సాగుతున్నాయని తెలిసింది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్యుడు, వాస్తు సిద్ధాంతి సూచనల మేరకు ఇలా చేస్తున్నారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఏం మార్పులు చేస్తున్నారు?
This post was last modified on December 10, 2024 3:44 pm
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…