Movie News

నాగచైతన్యకు ఎంతమంది పిల్లలు కావాలి?

అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. అందుక్కారణం.. తన పెళ్లే. సమంత నుంచి విడిపోయాక రెండేళ్ల పైగా ఖాళీగా ఉన్న అతను.. ఆ తర్వాత నటి శోభిత ధూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు. కొంత కాలం జర్నీ చేశాక ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. ఈ నెల 4న వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి జరిగిన టైంలోనే రానా దగ్గుబాటి హోస్ట్‌గా అమేజాన్ ప్రైమ్ కోసం చేస్తున్న టాక్ షోలో నాగచైతన్య ఎపిసోడ్ ప్రసారానికి సిద్ధమైంది.

పెళ్లికి కొన్ని రోజుల ముందే ఈ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయినట్లుంది. ఇప్పుడు స్ట్రీమింగ్‌కు వచ్చింది. రానా భార్య మిహిక బజాజ్‌.. చైతూ కజిన్ సుమంత్‌తో పాటు మరికొందరు అక్కినేని-దగ్గుబాటి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ ఎపిసోడ్ ఎంతో హుషారుగా సాగింది. ఇందులో చైతూ చాలా వరకు వ్యక్తిగత విషయాల మీద ఎన్నో ఆసక్తికర కబుర్లు చెప్పాడు. తనకు ఇద్దరు పిల్లలు కావాలని.. వాళ్లతో సమయం గడపాలని ఉందని చైతూ ఈ షోలో చెప్పడం విశేషం.

‘‘50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా సమయం గడపాలని ఉంది’’ అని చైతూ చెప్పగా.. మీ వెంకీ మామలా నీకు పెద్ద ఫ్యామిలీ కావాలా అని రానా అన్నాడు. అందుకు చైతూ బదులిస్తూ.. ‘‘వెంకీ మామది పెద్ద ఫ్యామిలీ. నాకు ఒకరిద్దరు పిల్లలు చాలు. కొడుకు పుడితే అతణ్ని రేస్ కోర్సుకు తీసుకెళ్తా. అమ్మాయి పుడితే తన హాబీస్, ఇష్టాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏదైనా చేస్తా. మనం చిన్నతనాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాం. మళ్లీ నా పిల్లలతో సమయం గడిపి ఆ రోజుల్లోకి వెళ్లాలనుకుంటున్నా.

కుటుంబమే నా జీవితం. అది లేకుండా లైఫ్‌ను ఊహించుకోలేను’’ అని చైతూ చెప్పాడు. ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. సినిమాలతో పోలిస్తే ‘దూత’ వెబ్ సిరీస్ చేసినపుడు ఎంతగానో ఆస్వాదించానని.. సినిమా రిలీజైనపుడు టాక్ ఏంటి, వసూళ్లెలా ఉన్నాయి అనే టెన్షన్ ఉంటుందని.. కానీ ‘దూత’ రిలీజైనపుడు ఈ టెన్షన్ ఏం లేకుండా సక్సెస్‌ను ఎంజాయ్ చేశానని చైతూ చెప్పాడు. సాయిపల్లవితో చాలా కష్టమని, తనతో ఒక సీన్ చేసినా.. ఒక డ్యాన్స్ మూమెంట్ చేసినా చాలా టెన్షన్ వచ్చేస్తుందని ఈ సందర్భంగా చైతూ అన్నాడు.

This post was last modified on December 7, 2024 4:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

44 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

47 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago