అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. అందుక్కారణం.. తన పెళ్లే. సమంత నుంచి విడిపోయాక రెండేళ్ల పైగా ఖాళీగా ఉన్న అతను.. ఆ తర్వాత నటి శోభిత ధూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు. కొంత కాలం జర్నీ చేశాక ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. ఈ నెల 4న వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి జరిగిన టైంలోనే రానా దగ్గుబాటి హోస్ట్గా అమేజాన్ ప్రైమ్ కోసం చేస్తున్న టాక్ షోలో నాగచైతన్య ఎపిసోడ్ ప్రసారానికి సిద్ధమైంది.
పెళ్లికి కొన్ని రోజుల ముందే ఈ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయినట్లుంది. ఇప్పుడు స్ట్రీమింగ్కు వచ్చింది. రానా భార్య మిహిక బజాజ్.. చైతూ కజిన్ సుమంత్తో పాటు మరికొందరు అక్కినేని-దగ్గుబాటి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ ఎపిసోడ్ ఎంతో హుషారుగా సాగింది. ఇందులో చైతూ చాలా వరకు వ్యక్తిగత విషయాల మీద ఎన్నో ఆసక్తికర కబుర్లు చెప్పాడు. తనకు ఇద్దరు పిల్లలు కావాలని.. వాళ్లతో సమయం గడపాలని ఉందని చైతూ ఈ షోలో చెప్పడం విశేషం.
‘‘50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా సమయం గడపాలని ఉంది’’ అని చైతూ చెప్పగా.. మీ వెంకీ మామలా నీకు పెద్ద ఫ్యామిలీ కావాలా అని రానా అన్నాడు. అందుకు చైతూ బదులిస్తూ.. ‘‘వెంకీ మామది పెద్ద ఫ్యామిలీ. నాకు ఒకరిద్దరు పిల్లలు చాలు. కొడుకు పుడితే అతణ్ని రేస్ కోర్సుకు తీసుకెళ్తా. అమ్మాయి పుడితే తన హాబీస్, ఇష్టాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏదైనా చేస్తా. మనం చిన్నతనాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాం. మళ్లీ నా పిల్లలతో సమయం గడిపి ఆ రోజుల్లోకి వెళ్లాలనుకుంటున్నా.
కుటుంబమే నా జీవితం. అది లేకుండా లైఫ్ను ఊహించుకోలేను’’ అని చైతూ చెప్పాడు. ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. సినిమాలతో పోలిస్తే ‘దూత’ వెబ్ సిరీస్ చేసినపుడు ఎంతగానో ఆస్వాదించానని.. సినిమా రిలీజైనపుడు టాక్ ఏంటి, వసూళ్లెలా ఉన్నాయి అనే టెన్షన్ ఉంటుందని.. కానీ ‘దూత’ రిలీజైనపుడు ఈ టెన్షన్ ఏం లేకుండా సక్సెస్ను ఎంజాయ్ చేశానని చైతూ చెప్పాడు. సాయిపల్లవితో చాలా కష్టమని, తనతో ఒక సీన్ చేసినా.. ఒక డ్యాన్స్ మూమెంట్ చేసినా చాలా టెన్షన్ వచ్చేస్తుందని ఈ సందర్భంగా చైతూ అన్నాడు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…