ఓ మూడేళ్ళ క్రితం వరకు శాండల్ వుడ్ లో తప్ప బయట ఎవరికీ తెలియని పేరు రిషబ్ శెట్టి. కన్నడలో ఇమేజ్, మార్కెట్ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో కనీసం డబ్బింగ్ రూపంలో అయినా ఇతని సినిమాలు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ కాంతారా మొత్తం జాతకాన్ని మార్చేసింది. కేవలం పదహారు కోట్లతో తీస్తే ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేయడం చరిత్ర. తెలుగు డబ్బింగ్ రెండు వారాలు ఆలస్యంగా రిలీజైనా నలభై కోట్లకు పైగా రాబట్టడం గొప్ప మైలురాయి. అందుకే కాంతార 2 మీద మాములు అంచనాలు లేవు. వచ్చే ఏడాది అక్టోబర్ విడుదలకు ఇప్పటి నుంచే అంచనాలు పీక్స్ ఉన్నాయి.
ఇంత ఫేమ్ వచ్చిన రిషబ్ శెట్టి ఏ విషయంలోనూ తొందరపడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో టైటిల్ రోల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాక ఇండియాలోనే అతి పెద్ద గ్రాండియర్స్ లో ఒకటిగా దీన్ని తీర్చిద్దిద్దబోతున్నారనే టాక్ ఇప్పటికే ఊపందుకుంది. ఇదిలా ఉండగా మరో ప్రెస్టీజియస్ మూవీని రిషబ్ శెట్టి పట్టేశాడు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందబోయే ‘ది ప్రైడ్ అఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్’లో వీరశివాజీగా కనిపించబోతున్నాడు. 2027 జనవరి 21 విడుదల తేదీని ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించారు.
ఒకరకంగా చెప్పాలంటే రిషబ్ శెట్టికి డ్రీం ప్రాజెక్టులు పడుతున్నాయి. వాటి నేపధ్యాలు ప్యాన్ ఇండియా స్థాయిని దాటేలా ఉన్నాయి. కేవలం ఒక జానర్ కు పరిమితం కాకుండా, యష్ లాగా ఒక సినిమాకే ఏళ్ళ తరబడి ఖర్చు పెట్టకుండా చేసుకుంటున్న ప్లానింగ్ ఇతన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా లేదు. శివాజీ మీద ఇప్పటికే బోలెడు సినిమాలొచ్చినప్పటికీ ఇప్పుడు తీయబోయేది మాత్రం నెవర్ బిఫోర్ తరహాలో ఉంటుందని ముంబై రిపోర్ట్. క్యాస్టింగ్, ఇతర సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడి చేయబోతున్నారు. 2025లో కాంతార 2, 2026లో జై హనుమాన్, 2027లో శివాజీ మహారాజ్ రిలీజవుతాయి. ఇది ప్లానింగ్ అంటే.
This post was last modified on December 3, 2024 12:05 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…