Movie News

ఛత్రపతి శివాజీగా కాంతార హీరో…. ప్లానింగ్ అంటే ఇది !

ఓ మూడేళ్ళ క్రితం వరకు శాండల్ వుడ్ లో తప్ప బయట ఎవరికీ తెలియని పేరు రిషబ్ శెట్టి. కన్నడలో ఇమేజ్, మార్కెట్ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో కనీసం డబ్బింగ్ రూపంలో అయినా ఇతని సినిమాలు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ కాంతారా మొత్తం జాతకాన్ని మార్చేసింది. కేవలం పదహారు కోట్లతో తీస్తే ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేయడం చరిత్ర. తెలుగు డబ్బింగ్ రెండు వారాలు ఆలస్యంగా రిలీజైనా నలభై కోట్లకు పైగా రాబట్టడం గొప్ప మైలురాయి. అందుకే కాంతార 2 మీద మాములు అంచనాలు లేవు. వచ్చే ఏడాది అక్టోబర్ విడుదలకు ఇప్పటి నుంచే అంచనాలు పీక్స్ ఉన్నాయి.

ఇంత ఫేమ్ వచ్చిన రిషబ్ శెట్టి ఏ విషయంలోనూ తొందరపడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో టైటిల్ రోల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాక ఇండియాలోనే అతి పెద్ద గ్రాండియర్స్ లో ఒకటిగా దీన్ని తీర్చిద్దిద్దబోతున్నారనే టాక్ ఇప్పటికే ఊపందుకుంది. ఇదిలా ఉండగా మరో ప్రెస్టీజియస్ మూవీని రిషబ్ శెట్టి పట్టేశాడు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందబోయే ‘ది ప్రైడ్ అఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్’లో వీరశివాజీగా కనిపించబోతున్నాడు. 2027 జనవరి 21 విడుదల తేదీని ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించారు.

ఒకరకంగా చెప్పాలంటే రిషబ్ శెట్టికి డ్రీం ప్రాజెక్టులు పడుతున్నాయి. వాటి నేపధ్యాలు ప్యాన్ ఇండియా స్థాయిని దాటేలా ఉన్నాయి. కేవలం ఒక జానర్ కు పరిమితం కాకుండా, యష్ లాగా ఒక సినిమాకే ఏళ్ళ తరబడి ఖర్చు పెట్టకుండా చేసుకుంటున్న ప్లానింగ్ ఇతన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా లేదు. శివాజీ మీద ఇప్పటికే బోలెడు సినిమాలొచ్చినప్పటికీ ఇప్పుడు తీయబోయేది మాత్రం నెవర్ బిఫోర్ తరహాలో ఉంటుందని ముంబై రిపోర్ట్. క్యాస్టింగ్, ఇతర సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడి చేయబోతున్నారు. 2025లో కాంతార 2, 2026లో జై హనుమాన్, 2027లో శివాజీ మహారాజ్ రిలీజవుతాయి. ఇది ప్లానింగ్ అంటే.

This post was last modified on December 3, 2024 12:05 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

2 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

3 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

6 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

7 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

7 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

8 hours ago