చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపుతో సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్లలోనే తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించి తిరుగులేని స్టార్గా ఎదిగాడు పవన్ కళ్యాణ్. ‘తొలి ప్రేమ’ నుంచి పవన్ రూటు మారిపోగా.. ఆ తర్వాత ‘ఖుషి’తో పవన్ ఇమేజ్ ఆకాశానికి చేరింది. ఆ సమయానికి అది ఇండస్ట్రీ హిట్ కావడం విశేషం.
రూ.24 కోట్ల షేర్తో అప్పటికి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ సినీ వార పత్రిక పవన్తో చేసిన ఇంటర్వ్యూ తాలూకు విశేషాలు ఇప్పుడు ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్నాయి.
‘ఖుషి’ సినిమాకు 19 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఇంటర్వ్యూ విశేషాల్ని అభిమానులు ట్విట్టర్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో పవన్ కొత్తగా ఏమీ ఆదర్శ భావాలు తెచ్చుకోలేదని.. ముందు నుంచి అతడి ఆలోచనలు వేరని.. అందుకు ఈ ఇంటర్వ్యూలోని విషయాలే నిదర్శనమని అంటున్నారు.
ఈ ఇంటర్వ్యూలో పవన్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు సొంతంగా స్టూడియో పెట్టడానికి స్థలం కొంటున్నారని వార్తలొస్తున్నాయి కదా అని పవన్ను అడిగితే.. ‘‘నేనా స్టూడియోనా.. అలాంటి బిజినెస్ మైండ్ నాకు ఉంటే వేరేలా ఉండేది. స్టూడియో అంటే బిజినెస్. పెద్ద ఆర్గనైజేషన్. అలా బిజినెస్ లైన్లోకి వెళ్లాలంటే ఫ్రాంక్గా ఉండలేను. ఆర్టిఫిషియల్గా తయారవడం నాకు ఇష్టం లేదు. సినిమాలు చేస్తూ చేస్తూనే ఫట్ మని అన్నీ వదిలేసుకుని వెళ్లిపోయే తత్వం నాది. నన్ను నమ్మి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పెడితే ఇంత అంతే సంగతి. నేను చెయ్యలేనని కాదు కానీ సినిమా మీద పెట్టే ఇంట్రెస్ట్ నేను బిజినెస్ మీద పెట్టలేను. అయితే వ్యవసాయం చేయడానికి పొలం కోసం చూస్తున్నాను. కానీ లక్షలు లక్షలు రేటు చెబుతున్నారు. చూద్దాం’’ అని పవన్ అన్నాడు.
ఈ ఇంటర్వ్యూలో అన్నట్లే ఉన్నట్లుండి సినిమాలు వదిలేసుకుని రాజకీయాల్లోకి వెళ్లిన పవన్.. రెండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. అలాగే అప్పుడు అన్నట్లే కొన్నేళ్లకు పొలం కొని ఫాం హౌస్ కట్టుకుని అక్కడ పంటలు పండిస్తున్నాడు.
This post was last modified on April 28, 2020 6:01 pm
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…
టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల…
బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కొత్తగా వచ్చిన హీరోలకు పరిపక్వత, పరిణితి చాలా అవసరం. ఎక్కువ అవసరం లేదు కానీ…
గత కొన్నేళ్లలో భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన సినిమా అంటే ‘ఆదిపురుష్’ అనే చెప్పాలి. ఇండియన్ ఫిలిం…