చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపుతో సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్లలోనే తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించి తిరుగులేని స్టార్గా ఎదిగాడు పవన్ కళ్యాణ్. ‘తొలి ప్రేమ’ నుంచి పవన్ రూటు మారిపోగా.. ఆ తర్వాత ‘ఖుషి’తో పవన్ ఇమేజ్ ఆకాశానికి చేరింది. ఆ సమయానికి అది ఇండస్ట్రీ హిట్ కావడం విశేషం.
రూ.24 కోట్ల షేర్తో అప్పటికి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ సినీ వార పత్రిక పవన్తో చేసిన ఇంటర్వ్యూ తాలూకు విశేషాలు ఇప్పుడు ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్నాయి.
‘ఖుషి’ సినిమాకు 19 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఇంటర్వ్యూ విశేషాల్ని అభిమానులు ట్విట్టర్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో పవన్ కొత్తగా ఏమీ ఆదర్శ భావాలు తెచ్చుకోలేదని.. ముందు నుంచి అతడి ఆలోచనలు వేరని.. అందుకు ఈ ఇంటర్వ్యూలోని విషయాలే నిదర్శనమని అంటున్నారు.
ఈ ఇంటర్వ్యూలో పవన్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు సొంతంగా స్టూడియో పెట్టడానికి స్థలం కొంటున్నారని వార్తలొస్తున్నాయి కదా అని పవన్ను అడిగితే.. ‘‘నేనా స్టూడియోనా.. అలాంటి బిజినెస్ మైండ్ నాకు ఉంటే వేరేలా ఉండేది. స్టూడియో అంటే బిజినెస్. పెద్ద ఆర్గనైజేషన్. అలా బిజినెస్ లైన్లోకి వెళ్లాలంటే ఫ్రాంక్గా ఉండలేను. ఆర్టిఫిషియల్గా తయారవడం నాకు ఇష్టం లేదు. సినిమాలు చేస్తూ చేస్తూనే ఫట్ మని అన్నీ వదిలేసుకుని వెళ్లిపోయే తత్వం నాది. నన్ను నమ్మి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పెడితే ఇంత అంతే సంగతి. నేను చెయ్యలేనని కాదు కానీ సినిమా మీద పెట్టే ఇంట్రెస్ట్ నేను బిజినెస్ మీద పెట్టలేను. అయితే వ్యవసాయం చేయడానికి పొలం కోసం చూస్తున్నాను. కానీ లక్షలు లక్షలు రేటు చెబుతున్నారు. చూద్దాం’’ అని పవన్ అన్నాడు.
ఈ ఇంటర్వ్యూలో అన్నట్లే ఉన్నట్లుండి సినిమాలు వదిలేసుకుని రాజకీయాల్లోకి వెళ్లిన పవన్.. రెండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. అలాగే అప్పుడు అన్నట్లే కొన్నేళ్లకు పొలం కొని ఫాం హౌస్ కట్టుకుని అక్కడ పంటలు పండిస్తున్నాడు.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…