స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా శారీరక లోపం పెట్టి మాస్ ని ఒప్పించడం చాలా కష్టం. కానీ సుకుమార్ దాన్ని సాధ్యం చేసి చూపించారు. రంగస్థలంలో రామ్ చరణ్ కు చెవుడు పెట్టడం ద్వారా అన్ని వర్గాలను మెప్పించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పుష్పలో అల్లు అర్జున్ కి ఒకవైపు భుజం పైకి లేచిన లోపాన్ని అద్భుతంగా వాడుకున్నారు. దీనికన్నా ముందు మారుతీ భలే భలే మగాడివోయ్ లో నానికి మతిమరుపు పెట్టడం ద్వారా ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఒప్పుకోవాలి. రాబోయే గేమ్ ఛేంజర్ లోనూ చరణ్ క్యారెక్టర్ కు అలాంటి ట్విస్టు ఉంది. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ కి పరిమితం చేశారట.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం సెకండాఫ్ లో పెద్ద వయసు అప్పన్నగా కనిపించే రామ్ చరణ్ నత్తితో మాట్లాడతాడు. అయితే అది ఎబ్బెట్టుగా కాకుండా కథలో ముఖ్యమైన ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక కీలకమైన ట్విస్టుకి కారణం అవుతుందని అంటున్నారు. ఈ పాయింట్ ని ప్రేక్షకులు కనక సరిగా రిసీవ్ చేసుకుంటే అప్పన్న ఎపిసోడ్ మొత్తం ఓరేంజులో పేలిపోతుందని యూనిట్ ఊరిస్తున్నారు. పెర్ఫార్మన్స్ పరంగా చరణ్ దీన్ని అద్భుతంగా పోషించాడని, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ మించి పేరు రావడం ఖాయమని షూటింగ్ టాక్. రామ్ నందన్ ఐఎఎస్ మాత్రం పూర్తి ఆరోగ్యంతో అసలు విలన్ల భరతం పడతాడు.
జనవరి 10 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న గేమ్ ఛేంజర్ లో మూడో ఆడియో సింగల్ వచ్చే వారమే విడుదల కానుంది. తమన్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడీ ఖచ్చితంగా ఛార్ట్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే నెల అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక జనవరి మొదటి వారంలో రాజమండ్రి లేదా దాని దగ్గరి పరిసరాల్లో మరో పెద్ద వేడుకకు రంగం సిద్ధమవుతోంది. ఇంకా వివరాలు రాలేదు కానీ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 హడావిడి తగ్గిపోయాక పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ మొత్తం మూడు షేడ్స్ లో కనిపిస్తాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…