స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా శారీరక లోపం పెట్టి మాస్ ని ఒప్పించడం చాలా కష్టం. కానీ సుకుమార్ దాన్ని సాధ్యం చేసి చూపించారు. రంగస్థలంలో రామ్ చరణ్ కు చెవుడు పెట్టడం ద్వారా అన్ని వర్గాలను మెప్పించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పుష్పలో అల్లు అర్జున్ కి ఒకవైపు భుజం పైకి లేచిన లోపాన్ని అద్భుతంగా వాడుకున్నారు. దీనికన్నా ముందు మారుతీ భలే భలే మగాడివోయ్ లో నానికి మతిమరుపు పెట్టడం ద్వారా ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఒప్పుకోవాలి. రాబోయే గేమ్ ఛేంజర్ లోనూ చరణ్ క్యారెక్టర్ కు అలాంటి ట్విస్టు ఉంది. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ కి పరిమితం చేశారట.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం సెకండాఫ్ లో పెద్ద వయసు అప్పన్నగా కనిపించే రామ్ చరణ్ నత్తితో మాట్లాడతాడు. అయితే అది ఎబ్బెట్టుగా కాకుండా కథలో ముఖ్యమైన ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక కీలకమైన ట్విస్టుకి కారణం అవుతుందని అంటున్నారు. ఈ పాయింట్ ని ప్రేక్షకులు కనక సరిగా రిసీవ్ చేసుకుంటే అప్పన్న ఎపిసోడ్ మొత్తం ఓరేంజులో పేలిపోతుందని యూనిట్ ఊరిస్తున్నారు. పెర్ఫార్మన్స్ పరంగా చరణ్ దీన్ని అద్భుతంగా పోషించాడని, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ మించి పేరు రావడం ఖాయమని షూటింగ్ టాక్. రామ్ నందన్ ఐఎఎస్ మాత్రం పూర్తి ఆరోగ్యంతో అసలు విలన్ల భరతం పడతాడు.
జనవరి 10 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న గేమ్ ఛేంజర్ లో మూడో ఆడియో సింగల్ వచ్చే వారమే విడుదల కానుంది. తమన్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడీ ఖచ్చితంగా ఛార్ట్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే నెల అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక జనవరి మొదటి వారంలో రాజమండ్రి లేదా దాని దగ్గరి పరిసరాల్లో మరో పెద్ద వేడుకకు రంగం సిద్ధమవుతోంది. ఇంకా వివరాలు రాలేదు కానీ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 హడావిడి తగ్గిపోయాక పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ మొత్తం మూడు షేడ్స్ లో కనిపిస్తాడు.
This post was last modified on November 25, 2024 6:13 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…