నిన్నా మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల ఏదంటే అధికారికంగా ఖరారైన పేరు హరిహర వీరమల్లు ఒక్కటే. మార్చి 28 రిలీజ్ చేస్తామని అఫీషియల్ పోస్టర్ తో పాటు ప్రకటించారు. కానీ ఇప్పుడు దీని స్థానంలో ఓజిని తీసుకొచ్చేలా ప్లానింగ్ జరుగుతోందని లేటెస్ట్ అప్డేట్. ఇలా ఆలోచించడం వెనుక పెద్ద కహానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఓజి మీద విపరీతమైన హైప్ నెలకొంది. బయ్యర్లు రాజమౌళి రేంజ్ లో ఏరియాల వారీగా భారీ రేట్లు ఇచ్చి సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కొన్ని సెంటర్లు అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి. ఓపెనింగ్స్ తోనే రికార్డులు బద్దలు కావడం ఖాయంగా ఉంది.
కానీ ఇంత బజ్ హరిహర వీరమల్లుకి లేదు. నిర్మాత ఏఎం రత్నం మూడేళ్ళకు పైగా వందల కోట్ల రూపాయల బడ్జెట్ దీని మీద ఖర్చు పెట్టారు. అంతకంతా వెనక్కు రావాలంటే ఓజిని మించి హైప్ సృష్టించాలి. టీజర్లు, పోస్టర్లు ఆ పనిని పూర్తి స్థాయిలో చేయలేకపోయాయి. ఒకవేళ రత్నం ఒక అడుగు వెనక్కు వేసి ఓజికి దారి ఇస్తే ఆయనకే ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఓజి కనక బ్లాక్ బస్టర్ అయితే వీరమల్లుకి డిమాండ్ పెరుగుతుంది. ప్యాన్ ఇండియా భాషల్లో ఎగబడి కొంటారు. ఎలాగూ పీరియాడిక్ గ్రాండియర్ కాబట్టి ప్రాంతీయత సమస్యలు రావు. అందుకే ఏదైనా అనూహ్య నిర్ణయం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఓజి, హరిహర వీరమల్లు రెండు సినిమాలను డిసెంబర్ లోగా పూర్తి చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. కానీ డిప్యూటీ సిఎంగా వరస పనులు, అసెంబ్లీ సమావేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఇలా అనుకున్నవి, అనుకోనివి ఎన్నో వచ్చి పడుతున్నాయి. సో ఒక ప్లాన్ ప్రకారం డేట్లు ఇవ్వడం సాధ్యపడటం లేదు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ని ఇంకొంచెం వాయిదా వేశారు. అభిమానుల జ్వరం చూస్తుంటే ఓజి తప్ప ఏదీ ఎక్కించుకునేలా లేరు. సో వాళ్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం పవన్ తర్వాతి సినిమాలకు ప్లస్ అవుతుంది.
This post was last modified on November 24, 2024 7:51 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…