కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఆరు నెలలకు పైగా షూటింగుల్లేవు. థియేటర్లలో కొత్త చిత్రాల విడుదల లేదు. ఓటీటీల్లో ఏవో కొన్ని సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటి వల్ల పరిశ్రమకు వచ్చిన లాభం తక్కువే. మామూలుగానే సినిమాల్లో సక్సెస్ రేట్ తక్కువ. నిర్మాతల పరిస్థితి ఏమంత బాగుండదు. కరోనా ధాటికి వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
ఈ ప్రభావం ఇక ముందు తెరకెక్కబోయే చిత్రాల మీద కచ్చితంగా పడుతుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్లు తగ్గించాలి. పారితోషకాలు తగ్గాలి. అది అనివార్యం. ఈ విషయంలో యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ముఖ్య సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక పై తెరకెక్కబోయే చిత్రాల్లో పని చేసే ఆర్టిస్టులు పారితోషకాలు తగ్గించుకోవాల్సిందే. రోజుకు 20 వేలకు మించి పారితోషకం అందుకునే ప్రతి ఆర్టిస్టూ 20 శాతం పారితోషకం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంతకంటే లోపు రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్లకు ఈ షరతు వర్తించదు. అలాగే సినిమాకు 5 లక్షల కంటే ఎక్కువ పారితోషకం తీసుకునే టెక్నీషియన్లకు కూడా 20 శాతం తగ్గింపు వర్తిస్తుంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్తో సంప్రదించాకే, వారి అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ ముందుకు సాగాలంటే పారితోషకాలు తగ్గించుకోక తప్పదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది. ఐతే ఈ పారితోషకాల తగ్గింపు ఎప్పటిదాకా అన్నది వెల్లడించలేదు.
This post was last modified on October 4, 2020 10:50 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…