కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఆరు నెలలకు పైగా షూటింగుల్లేవు. థియేటర్లలో కొత్త చిత్రాల విడుదల లేదు. ఓటీటీల్లో ఏవో కొన్ని సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటి వల్ల పరిశ్రమకు వచ్చిన లాభం తక్కువే. మామూలుగానే సినిమాల్లో సక్సెస్ రేట్ తక్కువ. నిర్మాతల పరిస్థితి ఏమంత బాగుండదు. కరోనా ధాటికి వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
ఈ ప్రభావం ఇక ముందు తెరకెక్కబోయే చిత్రాల మీద కచ్చితంగా పడుతుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్లు తగ్గించాలి. పారితోషకాలు తగ్గాలి. అది అనివార్యం. ఈ విషయంలో యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ముఖ్య సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక పై తెరకెక్కబోయే చిత్రాల్లో పని చేసే ఆర్టిస్టులు పారితోషకాలు తగ్గించుకోవాల్సిందే. రోజుకు 20 వేలకు మించి పారితోషకం అందుకునే ప్రతి ఆర్టిస్టూ 20 శాతం పారితోషకం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంతకంటే లోపు రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్లకు ఈ షరతు వర్తించదు. అలాగే సినిమాకు 5 లక్షల కంటే ఎక్కువ పారితోషకం తీసుకునే టెక్నీషియన్లకు కూడా 20 శాతం తగ్గింపు వర్తిస్తుంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్తో సంప్రదించాకే, వారి అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ ముందుకు సాగాలంటే పారితోషకాలు తగ్గించుకోక తప్పదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది. ఐతే ఈ పారితోషకాల తగ్గింపు ఎప్పటిదాకా అన్నది వెల్లడించలేదు.
This post was last modified on October 4, 2020 10:50 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…