Movie News

టాలీవుడ్లో 20 శాతం పారితోష‌కాల‌ కోత‌?

క‌రోనాతో తీవ్రంగా న‌ష్ట‌పోయిన రంగాల్లో సినీ ప‌రిశ్ర‌మ ఒక‌టి. ఆరు నెల‌ల‌కు పైగా షూటింగుల్లేవు. థియేట‌ర్ల‌లో కొత్త చిత్రాల విడుద‌ల లేదు. ఓటీటీల్లో ఏవో కొన్ని సినిమాలు రిలీజ‌య్యాయి కానీ.. వాటి వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన లాభం త‌క్కువే. మామూలుగానే సినిమాల్లో స‌క్సెస్ రేట్ త‌క్కువ‌. నిర్మాత‌ల ప‌రిస్థితి ఏమంత బాగుండ‌దు. క‌రోనా ధాటికి వారి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది.

ఈ ప్ర‌భావం ఇక ముందు తెర‌కెక్క‌బోయే చిత్రాల మీద క‌చ్చితంగా ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ ప‌రిస్థితుల్లో బ‌డ్జెట్లు త‌గ్గించాలి. పారితోష‌కాలు త‌గ్గాలి. అది అనివార్యం. ఈ విష‌యంలో యాక్టివ్ తెలుగు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఒక ముఖ్య స‌మావేశం నిర్వ‌హించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌ పై తెర‌కెక్క‌బోయే చిత్రాల్లో ప‌ని చేసే ఆర్టిస్టులు పారితోష‌కాలు త‌గ్గించుకోవాల్సిందే. రోజుకు 20 వేల‌కు మించి పారితోష‌కం అందుకునే ప్ర‌తి ఆర్టిస్టూ 20 శాతం పారితోష‌కం త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అంత‌కంటే లోపు రెమ్యూన‌రేష‌న్ తీసుకునేవాళ్ల‌కు ఈ ష‌ర‌తు వ‌ర్తించ‌దు. అలాగే సినిమాకు 5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ పారితోష‌కం తీసుకునే టెక్నీషియ‌న్ల‌కు కూడా 20 శాతం త‌గ్గింపు వ‌ర్తిస్తుంది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌తో సంప్ర‌దించాకే, వారి అంగీకారంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. క‌రోనా నేప‌థ్యంలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన సినీ ప‌రిశ్ర‌మ ముందుకు సాగాలంటే పారితోష‌కాలు త‌గ్గించుకోక త‌ప్ప‌ద‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ పేర్కొంది. ఐతే ఈ పారితోష‌కాల త‌గ్గింపు ఎప్ప‌టిదాకా అన్న‌ది వెల్ల‌డించ‌లేదు.

This post was last modified on October 4, 2020 10:50 pm

Share
Show comments
Published by
Satya
Tags: Tollywood

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

23 minutes ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

5 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

6 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

7 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

7 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

8 hours ago