దర్శకుడిగా రణం మినహా మిగతా అన్నిటితోనూ అమ్మ రాజశేఖర్ అమ్మో అనిపించాడు. కొంతకాలంగా దర్శకుడిగా అవకాశాలు లేక, డాన్స్ మాస్టర్గాను ఛాన్స్ లు రాక ఖాళీగా వున్న ఈ తమిళ టెక్నీషియన్కు బిగ్బాస్ సీజన్ 4లో చోటిచ్చారు. ప్రతి ఏటా ఒక కొరియోగ్రాఫర్ వుండేలా చూసుకుంటోన్న స్టార్ మా యాజమాన్యం ఈసారి ఆ కోటాలో అమ్మ రాజశేఖర్ని పంపించారు.
మొదట్లో కుళ్లు జోకులు అవీ వేసి కాస్త నవ్వించినా కానీ తర్వాత్తర్వాత అమ్మ రాజశేఖర్ స్వభావం బిగ్బాస్ వీక్షకులను విసిగిస్తోంది. తనను జీరో అంటూ దేవి, లాస్య ట్యాగ్ చేసినపుడు రాజశేఖర్ ఉడుకుమోతుతనం దాచుకోలేక ఏడ్చేసాడు. దివితో ఫిజికల్ అవుతున్నాడని లాస్య చెప్పడంతో అతని దుఃఖం కట్టలు తెంచుకుంది.
లాస్య అనడం కాదు కానీ నిజంగానే దివి గురించి పలుమార్లు రాజశేఖర్ ‘నా ఫిగరు’ అనడం ప్రేక్షకులు విన్నారు. ఆమెని స్వంతంగా ఆట ఆడనివ్వకుండా పలుమార్లు ప్రభావితం చేయడం కూడా ప్రేక్షకులు గమనించారు. జీరో అనడంతో రాజశేఖర్ ఏడుపు లంగించుకోవడంతో అతడిని హౌస్మేట్స్ నామినేట్ చేయడం కూడా మానేసారు. ఇక బిగ్బాస్ టాస్కులలో కూడా రాజశేఖర్ తన జోలికి ఎవరూ రాకూడదు అనే ధోరణి కనబరుస్తున్నాడు. ఎవరైనా తెలివిగా గేమ్ ఆడితే తట్టుకోలేక వారి మీద కస్సుబుస్సులాడుతున్నాడు. గత వారం, ఈవారం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.
ఇక మోనల్ గజ్జర్ అయితే ఓడిపోతే తట్టుకోలేక ఏడుపు అందుకుంటోంది. నిన్న గేమ్లోనుంచి అవుట్ అయ్యాక ఆమె బాత్రూమ్లోకి వెళ్లి బిగ్గరగా ఏడవడం ప్రేక్షకులను చిరాకు పెట్టింది. ఈమె కూడా అఖిల్, అభిజీత్ లాంటి వాళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతుండడంతో మోనల్కి కూడా వ్యతిరేకత తారాస్థాయిలో వుంది. వీరు నామినేషన్లలోకి వస్తే త్వరగా ఎగ్జిట్ అవడం ఖాయమనేది సోషల్ మీడియా టాక్.
This post was last modified on October 2, 2020 9:23 am
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…