దర్శకుడిగా రణం మినహా మిగతా అన్నిటితోనూ అమ్మ రాజశేఖర్ అమ్మో అనిపించాడు. కొంతకాలంగా దర్శకుడిగా అవకాశాలు లేక, డాన్స్ మాస్టర్గాను ఛాన్స్ లు రాక ఖాళీగా వున్న ఈ తమిళ టెక్నీషియన్కు బిగ్బాస్ సీజన్ 4లో చోటిచ్చారు. ప్రతి ఏటా ఒక కొరియోగ్రాఫర్ వుండేలా చూసుకుంటోన్న స్టార్ మా యాజమాన్యం ఈసారి ఆ కోటాలో అమ్మ రాజశేఖర్ని పంపించారు.
మొదట్లో కుళ్లు జోకులు అవీ వేసి కాస్త నవ్వించినా కానీ తర్వాత్తర్వాత అమ్మ రాజశేఖర్ స్వభావం బిగ్బాస్ వీక్షకులను విసిగిస్తోంది. తనను జీరో అంటూ దేవి, లాస్య ట్యాగ్ చేసినపుడు రాజశేఖర్ ఉడుకుమోతుతనం దాచుకోలేక ఏడ్చేసాడు. దివితో ఫిజికల్ అవుతున్నాడని లాస్య చెప్పడంతో అతని దుఃఖం కట్టలు తెంచుకుంది.
లాస్య అనడం కాదు కానీ నిజంగానే దివి గురించి పలుమార్లు రాజశేఖర్ ‘నా ఫిగరు’ అనడం ప్రేక్షకులు విన్నారు. ఆమెని స్వంతంగా ఆట ఆడనివ్వకుండా పలుమార్లు ప్రభావితం చేయడం కూడా ప్రేక్షకులు గమనించారు. జీరో అనడంతో రాజశేఖర్ ఏడుపు లంగించుకోవడంతో అతడిని హౌస్మేట్స్ నామినేట్ చేయడం కూడా మానేసారు. ఇక బిగ్బాస్ టాస్కులలో కూడా రాజశేఖర్ తన జోలికి ఎవరూ రాకూడదు అనే ధోరణి కనబరుస్తున్నాడు. ఎవరైనా తెలివిగా గేమ్ ఆడితే తట్టుకోలేక వారి మీద కస్సుబుస్సులాడుతున్నాడు. గత వారం, ఈవారం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.
ఇక మోనల్ గజ్జర్ అయితే ఓడిపోతే తట్టుకోలేక ఏడుపు అందుకుంటోంది. నిన్న గేమ్లోనుంచి అవుట్ అయ్యాక ఆమె బాత్రూమ్లోకి వెళ్లి బిగ్గరగా ఏడవడం ప్రేక్షకులను చిరాకు పెట్టింది. ఈమె కూడా అఖిల్, అభిజీత్ లాంటి వాళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతుండడంతో మోనల్కి కూడా వ్యతిరేకత తారాస్థాయిలో వుంది. వీరు నామినేషన్లలోకి వస్తే త్వరగా ఎగ్జిట్ అవడం ఖాయమనేది సోషల్ మీడియా టాక్.
This post was last modified on October 2, 2020 9:23 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…