మనలో చాలామందికి పొద్దున నిద్రలేచిందే టీ లేక కాఫీ ఏదో ఒకటి తాగకపోతే రోజు ప్రారంభమైనట్లు ఉండదు. అయితే చాలాకాలంగా ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి మంచిది కాదు అన్న వాదన వింటూ వస్తున్నాం. ఆరోగ్యం కోసం ఈ అలవాట్లు మానుకోలేక.. అలాగని తాగాలనిపించినప్పుడు కాఫీ, టీ తాగలేక మనలో చాలామంది సతమతమవుతున్నారు. అలాంటి వారికి తాజాగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఓ శుభవార్త అందించింది.. మీకు టి, కాఫీ తాగే అలవాటు ఉంటే ఇక నిరభ్యంతరంగా తాగొచ్చు.
తాజాగా, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిర్వహించిన అధ్యయనంలో టీ, కాఫీ తాగడం వల్ల తల, మెడ క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం ఉందని నిర్ధారించారు. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ కన్సార్టియం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో 14 వివిధ రీసెర్చ్లకు సంబంధించిన డేటాను పరిశీలించారు. ఇందులో 9,500 క్యాన్సర్ బాధితులు, 15,700 మందికిపైగా ఆరోగ్యకరమైన వ్యక్తుల డేటాను పరిశీలించారు.
ఈ పరిశోధనలో, ప్రతి రోజూ కాఫీ తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని వెల్లడైంది. ముఖ్యంగా నోరు, గొంతు, స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్ల ముప్పు తగ్గుదల కనిపించిందని అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యాన్సర్ వ్యాధిన పడే వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా మనం తీసుకునే కాఫీ టీ కాన్సర్ని తగ్గిస్తుంది అనడం నిజంగా శుభవార్త కాక మరేమిటి.
రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 17 శాతం తగ్గడంతో పాటు ప్రతి రోజూ కాఫీ తాగేవారిలో ఓరల్ కేవిటీ క్యాన్సర్ ముప్పు 30 శాతం తగ్గుతుందని, గొంతు క్యాన్సర్ ముప్పు 22 శాతం తగ్గుతుందని తేలింది. అంతేకాదు, రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగడం ద్వారా హైపోఫారింజియల్ క్యాన్సర్ ముప్పు 41 శాతం తగ్గుతుందట.
ఇక టీ తాగడం కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో ప్రభావవంతమని ఈ అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ ఒక కప్పు టీ తాగడం వల్ల తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9 శాతం తగ్గుతుందని వెల్లడించారు. ముఖ్యంగా హైపోఫారింజియల్ క్యాన్సర్ ముప్పు 27 శాతం తగ్గుతుందని అధ్యయన ఫలితాలు స్పష్టం చేశాయి.
ఇలా టీ, కాఫీతో క్యాన్సర్ ముప్పును కొంతమేర తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచించారు. అయితే, మితంగా తాగడమే మేలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కేవలం టీ లేక కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గిపోదు.. మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు మంచి జీవన శైలిని కూడా అలవాటు చేసుకోవాలి.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…