Bhakti

గురు పూర్ణిమ 2025: ఈశా లో సద్గురు సత్సంగం

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకులకు, ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. ఆదియోగి మొదట ఆదిగురువుగా మారి తన ఏడుగురు శిష్యులైన సప్తరుషులకు యోగ శాస్త్రాలను అందించిన పవిత్రమైన రోజు, ఇది భారతదేశంలో పవిత్రమైన గురు శిష్య పరంపర ప్రారంభాన్ని సూచిస్తుంది. అప్పటి నుండి, గురు పూర్ణిమ మన గురువులకు కృతజ్ఞతలు తెలియజేసే ఒక గొప్ప అవకాశంగా ఉంటూ వస్తోంది. దీన్ని భారతదేశమంతటా చాలా ఆనందంతో ఇంకా భక్తితో జరుపుకుంటారు.

కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌, సద్గురు ఆశ్రమంలో, మెడిటేటర్లు మరియు ఆశ్రమవాసులు ఈ సంవత్సరం జూలై 10న గురు పూర్ణిమని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం కార్యక్రమాలు మరియు సంబరాల విశేషాలను ఇక్కడ చూద్దాం.

సద్గురు అర్పణం – గురు పూర్ణిమ రోజు ఉద్యాపన

ఈ సంవత్సరం, మొదటిసారిగా, సద్గురు అర్పణం అనే ఏడు రోజుల ఆన్‌లైన్ సాధనని అందిస్తున్నారు, ఇది పవిత్రమైన గురు పూర్ణిమ రోజున ముగుస్తుంది. ఇందులో పాల్గొనేవారు ప్రత్యేకమైన గురు పూర్ణిమ మంత్రం మరియు ధ్యానలింగానికి పవిత్రమైన సమర్పణతో సాధనని ముగిస్తారు.

ధ్యానలింగం వద్ద పూర్ణిమ సమర్పణలు

భక్తులు ధ్యానలింగంలో క్షీరార్పణం (పాల అర్పణమరియు జలార్పణం (నీటి అర్పణ) సమర్పించవచ్చు. క్షీరార్పణం సాధారణంగా ఉదయం (6 AM నుండి 1 PM వరకు) అందిస్తారు, జలార్పణం మధ్యాహ్నం ఇంకా సాయంత్రం (1 PM నుండి 8 PM వరకు) అందిస్తారు.

ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజు ధ్యానలింగానికి క్షీరార్పణం మరియు జలార్పణం అర్పించి, దాని శక్తితో అనుసంధానమై ధ్యానలింగ అనుగ్రహాన్ని పొందే శక్తివంతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇది గురు పూర్ణిమన రోజున – భక్తులు గురువుతో తమ అనుబంధాన్ని మరింత గాఢతరం చేసుకోవడానికి ఇదొక అరుదైన అలాగే పవిత్రమైన అవకాశం.

గురు పూర్ణిమ సాయంత్రం

ఈసారి కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో జరుగుతున్న గురు పూర్ణిమ సంబరాలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, చాలా కాలంగా ఎదురుచూస్తున్న సద్గురుతో ప్రత్యేక సత్సంగం. సాయంత్రం గంటల నుండి ప్రారంభమైయ్యే ఈ సత్సంగంలో సద్గురుచే  శక్తివంతమైన గైడెడ్ ధ్యానం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో ఈశా సంగీత బృందం సౌండ్స్ ఆఫ్ ఈశాతో కలిసి ప్రసిద్ధ కళాకారుల అద్భుతమైన ప్రదర్శనలు, మోహిత్ చౌహాన్రామ్ మిర్యాలపార్థివ్ గోహిల్మరియు స్వగత్ రాథోడ్ వంటి ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయి. ఉత్సాహభరితమైన ప్రపంచ స్థాయి ప్రదర్శన అందిచేందుకు త్రినిదాదియన్ సోకా కింగ్ మాచెల్ మాంటానో కూడా ఇందులో పాల్గొంటున్నారు.

సద్గురు సత్సంగం లైవ్స్ట్రీమ్

వ్యక్తిగతంగా హాజరు కాలేని వారు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానల్స్ లేదా ఎంపిక చేసిన ఈశా స్థానిక కేంద్రాలలో గురు పూర్ణిమ సత్సంగం లైవ్‌స్ట్రీమ్‌లో చేరవచ్చు.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ, ఒడియా, నేపాలీ మరియు ఇతర ప్రపంచ భాషలలో కూడా లైవ్‌స్ట్రీమ్ అందుబాటులో ఉంటుంది.

This post was last modified on July 10, 2025 1:55 pm

Share

Recent Posts

అన్ని స‌ర్వేల‌దీ అదే దారి.. వైసీపీ మౌనం అందుకేనా?

రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవ‌రికి ద‌క్కుతుంది? అనే…

2 hours ago

నాడు చెల్లి.. నేడు మిత్రుడు.. జ‌గ‌న్‌కు సెగ పెంచేస్తున్నారు!

ఏపీ విప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీలో అంత‌ర్గ‌త పోరు ఎక్కువ‌గా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా…

3 hours ago

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ల‌క్ష‌ల మంది వీధిపాలు.. కార‌ణాలేంటి?

ఒక‌టి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. ల‌క్ష‌ల్లోనే ఉద్యోగాలకు ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు మంగ‌ళం పాడుతున్నాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫోక్స్…

6 hours ago

బుల్లితెరపైనే కాదు… వెండితెరపైనా సంచలనమే

ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…

7 hours ago

జీవితంలో ఈటీవీ చూడ‌ననుకున్న విజ‌య్…

తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన టీవీ ఛానెళ్ల‌లో ఈటీవీ ఒక‌టి. 90వ ద‌శ‌కంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…

7 hours ago

హై హై నాయకా… అది ఏం నాలుక?

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…

8 hours ago