ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న కుట్రలపై విచారణకు ఆదేశించాలని నిర్ణయించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్ర లపై సీఎం చంద్రబాబు మంత్రివర్గంతో చర్చించారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దీనికి తాను రేయింబవళ్లు కష్టపడుతున్నానని చెప్పారు. అయితే.. ఇంత కష్టపడి కంపెనీలను ఒప్పిస్తే.. పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందన్నారు. వీటినిఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు.
“మీరు కానీ.. మీడియా కానీ.. నన్ను పైపైనే చూస్తున్నారు. నేను చాలా కష్టపడుతున్నా. రేయింబవళ్లు పనిచేస్తున్నా. ఒక్క సంస్థను ఒప్పించేందుకు తల ప్రాణం తోకకు వస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని చూసిన పెట్టుబడి దారులు రాష్ట్రానికి వచ్చేందుకు భయపడుతున్నారు. వారిని చాలా ఓర్పుగా ఒప్పిస్తున్నా. ఈ క్రమంలోనే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. కానీ.. వీటిని ఏదో ఒక రకంగా.. చెడగొట్టి పబ్బంగడుపుకోవాలని.. వైసీపీ ప్రయత్నిస్తోంది. దీనిని సహించేది లేదు. విచారణకు ఆదేశిద్దాం. తప్పుడు ప్రచారం చేసిన వారిని జైలుకు పంపాల్సిందే” అని చంద్రబాబు సీరియస్గా వ్యాఖ్యానించారు.
తాజాగా గనుల శాఖకు సంబంధించి 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆహ్వానించారు. ఓ అంతర్జాతీయ సంస్థ పెట్టుబడు లు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సానుభూతిపరుడు భాస్కర్ అనే వ్యక్తి విదేశాల్లో ఉండి చంద్రబాబుకు వ్యతిరేకంగా 200 ఈ మెయిళ్లను సృష్టించి.. సదరు కంపెనీకి పంపించారని రాష్ట్ర సర్కారు గుర్తించింది. దీంతో ఆ పెట్టుబడి నిలిచిపోయింది. మరోవైపు.. పెట్టుబడులపై కూడా న్యాయ పోరాటానికి వైసీపీ నాయకులు రెడీ అయ్యారు. దీంతో పెట్టుబడులు రావడం లేదని సర్కారు భావిస్తోంది.
అదేవిధంగా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటోందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై చర్చించిన చంద్రబాబు.. కూటమిపై వైసీపీ చేస్తున్న కుట్రలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని.. ఆ 200 ఈ మెయిళ్ల వ్యవహారం వెనుక ఎవరు న్నారో.. తేల్చేందుకు విచారణకు ఆదేశించాలని నిర్ణయించారు. దీనికి గాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడమా.. లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు బాధ్యతలు అప్పగించడమా .. అనేది త్వరలోనే నిర్ణయిస్తామని చంద్రబాబు తెలిపారు.
This post was last modified on July 10, 2025 3:28 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…