సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ బృందంలోని 10-15 మంది మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీరంతా నిద్రపోతు న్నారా?” అంటూ..వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఈ విషయంలో మంత్రులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. “మన ఎమ్మెల్యేను అంతంత మాటలంటే.. మీరు గట్టిగా ఖండించాల్సింది. నేను కూడా ఖండిస్తారనే అనుకున్నా. కానీ.. ఒకరిద్దరు తప్ప.. అందరూ నిద్రావస్థలో ఉన్నట్టుగా అనిపించింది.” అని అన్నారు.
అంతేకాదు.. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు.. ఖచ్చితంగా ఎదురు దాడి చేయాలని.. మహిళల విషయంలో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదని.. లేకపోతే..రాంగ్ సింప్టమ్స్ ప్రజల్లోకి వెళ్తామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేదని సమాజంలో ప్రచారం జరిగితే.. ఎలా? అని ప్రశ్నించారు. మంత్రులు ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల్లో గట్టిగా స్పందించాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీకి ఛాన్స్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. అంతేకాదు.. వైసీపీ చేస్తున్న విష ప్రచారం ముందు.. టీడీపీ చేస్తున్న సానుకూల ప్రచారం కూడా తేలిపోతోందని చంద్రబాబు చెప్పారు.
వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు.. అవసరమైతే.. మంత్రులు ఇతర పనులు పక్కన పెట్టి.. ప్రజల మధ్యకు పదే పదే వెళ్లాలని సూచించారు. వైసీపీ వ్యతిరేక అజెండాను ప్రజలకు వివరించి.. కూటమి చేస్తున్న మంచి పనులనువివరించాలని సూచించారు. “ఎవరికి వారు నాపై బారం వేసి ఊరుకుంటే.. మళ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు నా నిర్ణయం చూసి మీరు ఇబ్బంది పడొద్దు. ఇప్పటికైనా.. బలంగా పోరాడండి. క్షేత్రస్థాయిలో వైసీపీ చేస్తున్న కుట్రలను ఎండగట్టండి. ఇదే మీకు మరోసారి చెబుతన్నా.” అని చంద్రబాబు తీవ్రంగానే హెచ్చరించారు.
This post was last modified on July 10, 2025 3:26 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…