లాల్ సింగ్ చడ్డా డిజాస్టరని తేలిపోయినా అమీర్ ఖాన్ ని మాత్రం నెటిజెన్లు వదలడం లేదు. గతంలో చేసిన కామెంట్లను అపార్థం చేసుకోకండి దయచేసి సినిమా చూడమని ఎంతగా అభ్యర్థించినా లాభం లేకపోయింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలే దిశగా పరుగులు పెడుతున్న లాల్ సింగ్ ఇక రికవర్ కావడం కష్టమే.
సరే సినిమాలో కంటెంట్ కూడా వీక్ గా ఉంది కాబట్టి కేవలం బాయ్ కాట్ వివాదాన్ని నెపంగా చూపలేం అనుకుంటున్న తరుణంలో ఈ విలక్షణ నటుడి మెడకు మరో తలనెప్పి వచ్చి చేరింది. ఇటీవలే అమీర్ ఖాన్ కొత్త సిరీస్ మొదలుపెట్టిన కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొన్నాడు.
అఫ్కోర్స్ తన మూవీ ప్రమోషన్ కోసమే లెండి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా చేసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ కు దేశం కోసం పోరాడిన నిజమైన సైనికులను ఆర్మీ ఆఫీసర్లను తీసుకొచ్చారు. వాళ్ళతో మాటామంతి, వార్ ఫీల్డ్ లో వాళ్ళు ఎదురుకున్న వీరోచితంగా సందర్భాలు అన్ని వినే అవకాశం దక్కింది. సరే తను కూడా ఆ పాత్ర చేశా కదా పబ్లిసిటీకి ఉపయోగపడుతుందన్నది అమీర్ ఆలోచన. దానికి తగ్గట్టే హుషారుగా విచ్చేశాడు.
అంతా బాగానే ఉంది కానీ ప్రోగ్రాంలో భాగంగా జవాన్లకు గౌరవ సూచకంగా అమితాబ్ తో సహా అక్కడికి వచ్చిన వాళ్ళు సెల్యూట్ చేశారు. కానీ అమీర్ మాత్రం చేతులు కిందే ఉంచాడు. ఈ వీడియో కాస్తా బయటికి వచ్చేసి వైరల్ అయిపోయింది. మీడియా ఈ ప్రస్తావన తెస్తే దాన్ని కవర్ చేసుకోలేక లాల్ సింగ్ పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. అవునా సెల్యూట్ చేయలేదా నేను చేశా అనుకున్నా అయినా అలా చేయాలని తట్టలేదని ఏదేదో చెప్పబోయి మొత్తానికి నాలుక తడబడింది. దెబ్బకు అమీర్ మీద ఆల్రెడీ ఉన్న వ్యతిరేకత ఇంకాస్త ఎక్కువయ్యింది
This post was last modified on August 15, 2022 10:38 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…