వినోద్ కాంబ్లి.. 80, 90 దశకాల్లో ఇండియన్ క్రికెట్ను ఫాలో అయిన ఏ అభిమానీ ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. సచిన్తో కలిసే క్రికెట్ సాధన ఆరంభించి.. చాలా ఏళ్ల పాటు అతడితో కలిసే సాగాడు ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్. సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి తన లాగే మెరుపులు మెరిపించాడు.
సచిన్ లాంటి క్రమశిక్షణ, పట్టుదల ఉంటే.. అతడి లాగే ఒక దిగ్గజ క్రికెటర్ అయ్యేవాడేమో. కానీ కెరీర్లో కొన్నేళ్ల పాటు మెరుపులు మెరిపించాక ఫామ్ కోల్పోవడంతో కెరీర్ గాడి తప్పింది. తర్వాత మళ్లీ పుంజుకోలేకపోయాడు. చూస్తుండగానే కనుమరుగైపోయేవాడు. మంచి వయసులో ఉండగానే ఆటకు దూరమైపోయాడు. కొన్నేళ్లకే గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. చాలా ఏళ్లుగా కాంబ్లి పేరే ఎక్కడా వినిపించడం లేదు.
ఇప్పుడు ముంబయిలో కాంబ్లి దయనీయ స్థితిలో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తిగా బలహీన పడిపోయి, ముసలివాడిలా తయారైన కాంబ్లి.. నడవలేని స్థితిలో కనిపించాడు. కాళ్లు వంకర పోయి నడవలేకపోతుంటే ఇద్దరు ముగ్గురు సాయపడి ఆయన్ని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. ఎలాంటి కాంబ్లి ఎలా అయిపోయాడంటూ నిన్నటితరం క్రికెట్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కెరీర్ దెబ్బ తినడంతో కాంబ్లి తాగుడుకు బానిస అయినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆటను, ఆరోగ్యాన్ని పట్టించుకోక పూర్తిగా గాడి తప్పాడు.
ఆటగాడిగా కెరీర్ ఆగిపోయిన వాళ్లు కూడా కోచింగ్ కెరీర్లోకి వెళ్లి మంచి స్థాయిని అందుకున్నారు. ఐపీఎల్ వల్ల మాజీ క్రికెటర్లందరికీ మంచి ఉపాధి దొరికింది. కానీ కాంబ్లికి క్రమశిక్షణ లేక, తాగుడుకు బానిసై పూర్తిగా దెబ్బ తిన్నాడు. అతను ఆర్థికంగా కూడా దివాళా తీసినట్లు తెలుస్తోంది. సచిన్ తర్వాత అంతటి స్థాయి అందుకుంటాడనుకున్న క్రికెటర్ ఇప్పుడీ స్థితికి చేరడం విచారకరం. ప్రతిభ ఉంటే సరిపోదు, మనిషికి క్రమశిక్షణ ఎంత అవసరం అనడానికి ఇది రుజువు.
This post was last modified on August 6, 2024 9:48 pm
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…