వినోద్ కాంబ్లి.. 80, 90 దశకాల్లో ఇండియన్ క్రికెట్ను ఫాలో అయిన ఏ అభిమానీ ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. సచిన్తో కలిసే క్రికెట్ సాధన ఆరంభించి.. చాలా ఏళ్ల పాటు అతడితో కలిసే సాగాడు ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్. సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి తన లాగే మెరుపులు మెరిపించాడు.
సచిన్ లాంటి క్రమశిక్షణ, పట్టుదల ఉంటే.. అతడి లాగే ఒక దిగ్గజ క్రికెటర్ అయ్యేవాడేమో. కానీ కెరీర్లో కొన్నేళ్ల పాటు మెరుపులు మెరిపించాక ఫామ్ కోల్పోవడంతో కెరీర్ గాడి తప్పింది. తర్వాత మళ్లీ పుంజుకోలేకపోయాడు. చూస్తుండగానే కనుమరుగైపోయేవాడు. మంచి వయసులో ఉండగానే ఆటకు దూరమైపోయాడు. కొన్నేళ్లకే గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. చాలా ఏళ్లుగా కాంబ్లి పేరే ఎక్కడా వినిపించడం లేదు.
ఇప్పుడు ముంబయిలో కాంబ్లి దయనీయ స్థితిలో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తిగా బలహీన పడిపోయి, ముసలివాడిలా తయారైన కాంబ్లి.. నడవలేని స్థితిలో కనిపించాడు. కాళ్లు వంకర పోయి నడవలేకపోతుంటే ఇద్దరు ముగ్గురు సాయపడి ఆయన్ని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. ఎలాంటి కాంబ్లి ఎలా అయిపోయాడంటూ నిన్నటితరం క్రికెట్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కెరీర్ దెబ్బ తినడంతో కాంబ్లి తాగుడుకు బానిస అయినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆటను, ఆరోగ్యాన్ని పట్టించుకోక పూర్తిగా గాడి తప్పాడు.
ఆటగాడిగా కెరీర్ ఆగిపోయిన వాళ్లు కూడా కోచింగ్ కెరీర్లోకి వెళ్లి మంచి స్థాయిని అందుకున్నారు. ఐపీఎల్ వల్ల మాజీ క్రికెటర్లందరికీ మంచి ఉపాధి దొరికింది. కానీ కాంబ్లికి క్రమశిక్షణ లేక, తాగుడుకు బానిసై పూర్తిగా దెబ్బ తిన్నాడు. అతను ఆర్థికంగా కూడా దివాళా తీసినట్లు తెలుస్తోంది. సచిన్ తర్వాత అంతటి స్థాయి అందుకుంటాడనుకున్న క్రికెటర్ ఇప్పుడీ స్థితికి చేరడం విచారకరం. ప్రతిభ ఉంటే సరిపోదు, మనిషికి క్రమశిక్షణ ఎంత అవసరం అనడానికి ఇది రుజువు.
This post was last modified on August 6, 2024 9:48 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…