Trends

ప్రముఖ నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

భరతనాట్యం, కూచిపూడి రంగాలలో ఖ్యాతి గడించిన నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్ను మూశారు. ప్రపంచ ప్రఖ్యాత నర్తకిగా వేలాది ప్రదర్శనలతో ఖ్యాతి గడించిన యామినీ కృష్ణమూర్తి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యామినీ కృష్ణమూర్తి శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు నృత్యకారులు, నర్తకులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

1940లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో జన్మించిన యామినీ కృష్ణమూర్తి చిన్నప్పటి నుంచి కూచిపూడి, భరతనాట్యం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి సుప్రసిద్ధ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే 1968లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించింది. యామినీ కృష్ణమూర్తి నాట్య రంగంలో  సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా కూడా యామినీ కృష్ణమూర్తి గతంలో సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ స్థాపించి నృత్యరంగంలో వేలాది మందికి శిక్షణనిచ్చారు. ప్యాషన్ ఫర్ డాన్స్ పేరుతో ఆమె రాసిన పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతో యామినీ కృష్ణమూర్తి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. యామినీ కృష్ణమూర్తి ఇకలేరు అన్న వార్తతో ఆమె అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తున్నారు.

This post was last modified on August 3, 2024 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

21 minutes ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

1 hour ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

2 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

4 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

6 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

7 hours ago