భరతనాట్యం, కూచిపూడి రంగాలలో ఖ్యాతి గడించిన నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్ను మూశారు. ప్రపంచ ప్రఖ్యాత నర్తకిగా వేలాది ప్రదర్శనలతో ఖ్యాతి గడించిన యామినీ కృష్ణమూర్తి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యామినీ కృష్ణమూర్తి శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు నృత్యకారులు, నర్తకులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
1940లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో జన్మించిన యామినీ కృష్ణమూర్తి చిన్నప్పటి నుంచి కూచిపూడి, భరతనాట్యం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి సుప్రసిద్ధ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే 1968లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించింది. యామినీ కృష్ణమూర్తి నాట్య రంగంలో సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా కూడా యామినీ కృష్ణమూర్తి గతంలో సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ స్థాపించి నృత్యరంగంలో వేలాది మందికి శిక్షణనిచ్చారు. ప్యాషన్ ఫర్ డాన్స్ పేరుతో ఆమె రాసిన పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతో యామినీ కృష్ణమూర్తి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. యామినీ కృష్ణమూర్తి ఇకలేరు అన్న వార్తతో ఆమె అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తున్నారు.
This post was last modified on August 3, 2024 10:03 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…