Trends

ప్రముఖ నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

భరతనాట్యం, కూచిపూడి రంగాలలో ఖ్యాతి గడించిన నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్ను మూశారు. ప్రపంచ ప్రఖ్యాత నర్తకిగా వేలాది ప్రదర్శనలతో ఖ్యాతి గడించిన యామినీ కృష్ణమూర్తి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యామినీ కృష్ణమూర్తి శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు నృత్యకారులు, నర్తకులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

1940లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో జన్మించిన యామినీ కృష్ణమూర్తి చిన్నప్పటి నుంచి కూచిపూడి, భరతనాట్యం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి సుప్రసిద్ధ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే 1968లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించింది. యామినీ కృష్ణమూర్తి నాట్య రంగంలో  సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా కూడా యామినీ కృష్ణమూర్తి గతంలో సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ స్థాపించి నృత్యరంగంలో వేలాది మందికి శిక్షణనిచ్చారు. ప్యాషన్ ఫర్ డాన్స్ పేరుతో ఆమె రాసిన పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతో యామినీ కృష్ణమూర్తి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. యామినీ కృష్ణమూర్తి ఇకలేరు అన్న వార్తతో ఆమె అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తున్నారు.

This post was last modified on August 3, 2024 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

35 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago