భారత్ కు మిత్ర దేశం, పొరుగు దేశం కూడా అయిన నేపాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని ఖాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ విమానం కుప్ప కూలిపోయింది. కళ్లు మూసి తెరిచే లోగా జరిగిన ఈ విషాద ఘటనలో సిబ్బంది సహా 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఖాఠ్మండు నుంచి పొఖారాకు బయల్దేరిన బాంబార్డియర్ సీఆర్జే 200 విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. ఉన్నట్టుండి మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది. శౌర్య ఎయిర్ లైన్స్కు చెందిన విమానం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో టేకాఫ్ అయింది. కానీ, ఇంతలోనే కుప్పకూలింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడిన పైలట్ను విమానం నుంచి బయటకు తీసి.. ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమేంటి?
నేపాల్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం ‘టేబుల్ టాప్’ గా పేర్కొనే రన్వే నే కారణమని తెలుస్తోంది. ఇలాంటి రన్వేలపై టేకాఫ్.. సంక్లిష్టంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. టేబుల్ టాప్.. అని పేరులో ఉన్నట్టుగానే.. భూభాగం కంటేఎత్తులో ఈ రన్వేలు ఏర్పాటు చేస్తారు. ఒకవైపు లేదా రెండు వైపులా లోయ మాదిరిగా ఉంటుంది. దీంతో విమానాలను టేకాఫ్ చేసేప్పుడు.. ల్యాండింగ్ చేసేప్పుడు కూడా.. పైలట్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
టేబుల్ టాప్ రన్ వేలపై నిర్ణీత ప్రాంతంలోనే విమానాలు ప్రయాణించాలి. ఒక్క అడుగు ముందుకు వెళ్లినా.. వెనక్కి వెళ్లినా.. అదుపు తప్పుతాయి. తాజా ఘటనలో విమానం టేకాఫ్ అయినప్పుడు.. నిర్ణీత మార్కింగ్ను దాటి ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అందుకే.. కింద సరైన ఎత్తులేక పోవడంతో విమానం కూలిపోయి ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…