భారత్ కు మిత్ర దేశం, పొరుగు దేశం కూడా అయిన నేపాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని ఖాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ విమానం కుప్ప కూలిపోయింది. కళ్లు మూసి తెరిచే లోగా జరిగిన ఈ విషాద ఘటనలో సిబ్బంది సహా 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఖాఠ్మండు నుంచి పొఖారాకు బయల్దేరిన బాంబార్డియర్ సీఆర్జే 200 విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. ఉన్నట్టుండి మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది. శౌర్య ఎయిర్ లైన్స్కు చెందిన విమానం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో టేకాఫ్ అయింది. కానీ, ఇంతలోనే కుప్పకూలింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడిన పైలట్ను విమానం నుంచి బయటకు తీసి.. ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమేంటి?
నేపాల్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం ‘టేబుల్ టాప్’ గా పేర్కొనే రన్వే నే కారణమని తెలుస్తోంది. ఇలాంటి రన్వేలపై టేకాఫ్.. సంక్లిష్టంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. టేబుల్ టాప్.. అని పేరులో ఉన్నట్టుగానే.. భూభాగం కంటేఎత్తులో ఈ రన్వేలు ఏర్పాటు చేస్తారు. ఒకవైపు లేదా రెండు వైపులా లోయ మాదిరిగా ఉంటుంది. దీంతో విమానాలను టేకాఫ్ చేసేప్పుడు.. ల్యాండింగ్ చేసేప్పుడు కూడా.. పైలట్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
టేబుల్ టాప్ రన్ వేలపై నిర్ణీత ప్రాంతంలోనే విమానాలు ప్రయాణించాలి. ఒక్క అడుగు ముందుకు వెళ్లినా.. వెనక్కి వెళ్లినా.. అదుపు తప్పుతాయి. తాజా ఘటనలో విమానం టేకాఫ్ అయినప్పుడు.. నిర్ణీత మార్కింగ్ను దాటి ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అందుకే.. కింద సరైన ఎత్తులేక పోవడంతో విమానం కూలిపోయి ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
This post was last modified on July 24, 2024 3:46 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…