ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మంగళవారం రోజు రోజంతా కార్యకలాపాలన్నీ.. తెలుగులోనే సాగాయి. ముఖ్యంగా శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పూర్తిగా సభను తెలుగులోనే నడిపించారు. ముందుగా ఎలాంటి ప్రకటనా చేయకున్నప్పటికీ.. అనూహ్యంగా ఆయన తన నుంచే తెలుగును అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం సభ కొలువు దీరగానే.. ‘అందరికీ శుభోదయం’ అంటూ ఆయన కార్యకలాపాలను ప్రారంభించారు. తర్వాత `ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చట్టాన్ని రెవెన్యూ మంత్రి ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా కూడా.. తెలుగులోనే మాట్లాడిన శాసన సభాపతి.. “భూ వివాదాల పరిష్కారం చట్టం”గా పేర్కొన్నారు. ఇలా మొత్తం సభలో మంగళవారం తెలుగుకు పెద్ద పీట వేశారు. అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించారు. దీంతో తెలుగు భాష పట్ల అయ్యన్న తీసుకున్న నిర్ణయానికి మంత్రులు, శాసన సభ్యులు పొగడ్తలతో ఆయనను ముంచెత్తారు. తమ మాతృభాషకు గౌరవం ఇచ్చే ఈ ప్రయత్నం అనేకమందికి స్ఫూర్తిదాయకమైందని తెలిపారు.
అలాగే, ప్రభుత్వ పనుల్లో తెలుగు భాషా వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నామని మంత్రులు తెలిపారు. శాసన సభాపతి నిర్ణయం తరువాత.. ఇతర నాయకులు, సభ్యులు కూడా తమ ప్రసంగాల్లో తెలుగు వాడాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. ఈ ఒరవడి వల్ల భవిష్యత్తులో తెలుగుకు మరింత ప్రాధాన్యం కలిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. దీనిని ఎంత వరకు కొనసాగిస్తారో చూడాలి.
అయితే.. ఇప్పటి వరకు జరగని ప్రయత్నం అయితే తొలిసారి జరగడం మాత్రం గొప్ప విషయమేనని చెప్పాలి. తర్వాత.. మాట్లాడిన మంత్రులు కొందరు దీనిని కొనసాగించారు. మరికొందరు తెలుగు మాట్లాడే ప్రయత్నం చేసి.. తడబడ్డారు. అయితే.. ఇప్పటికిప్పుడు మార్పు రాదని.. ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం మున్ముందు అలవాటుగా మారాలని ఆయన సూచించారు.
This post was last modified on July 23, 2024 8:42 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…