Trends

జియో కొత్త ప్లాన్స్.. మీమ్స్ మోత

భారతీయ ఇంటర్నెట్ రంగంలో జియో తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంబీల్లో డేటాను కూడా వందల రూపాయలు పెట్టి కొంటున్న రోజుల్లో అదే వందల రూపాయలకు రోజూ ఒక జీబీ ఇంటర్నెట్ అందించిన ఘనత జియోకే చెందుతుంది. మొదట్లో ఉచిత ఆఫర్లు, చీప్ రేట్లతో జియో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా దేశంలో పదుల కోట్ల మంది జియో వైపు మళ్లారు. మొబైల్ ఇంటర్నెట్ వాడే వాళ్లలో చాలామంది వేరే నెట్‌వర్క్ వదిలిపెట్టి జియోకు మళ్లగా.. వేరే నెట్‌వర్క్ వాడుతూ కూడా అదనంగా జియో సిమ్ తీసుకున్న వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఈ దెబ్బకు మిగతా నెట్‌వర్క్స్ అన్నీ కూడా డేటా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తంగా దేశంలో ఇంటర్నెట్ ఎక్కువమందికి అందుబాటులోకి రావడంలో, చౌకగా మారడంలో జియో కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.

ఐతే అంబానీల వ్యాపార సూత్రం ఏంటంటే.. వినియోగదారులకు ముందు ఏదైనా చౌకగా అందించి దానికి బాగా అలవాటు చేస్తారని.. అలా అలవాటు పడ్డాక ధరలు పెంచి సొమ్ము చేసుకుంటారని పేరుంది. జియో విషయంలో కూడా ఇదే జరుగుతుందని వ్యాపార వర్గాలు ముందే అంచనా వేశాయి. ఆ అంచనా ప్రకారమే తర్వాత పరిణామాలు జరిగాయి. క్రమ క్రమంగా డేటా ధరలు పెంచుతూ వచ్చిన జియో.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. వార్షిక ప్లాన్‌లో ఒకేసారి 600 ధర పెంచింది. మిగతా ప్లాన్లకూ ధరలు మారాయి. ఈ మేరకు ప్రకటన రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో మీమ్స్ మోత మోగింది.

ముకేశ్ అంబానీ ముందు ఎలా ఆఫర్లు ఇస్తాడు.. తర్వాత ఎలా డబ్బులు లాగేస్తాడో చూపిస్తూ పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి. తన కొడుకు నిశ్చితార్థం సందర్భంగా అంబానీ తినుబండారాలు వడ్డించిన వీడియోలో దృశ్యాలను రివర్స్ చేసి చూపిస్తూ.. జనాలకు చౌకగా జియోను అందించి దానికి అలవాటు చేశాక ఎలా రేట్లు పెంచి డబ్బులు లాగుతున్నాడో వివరిస్తూ రెడీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి మరెన్నో మీమ్స్, జోక్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

This post was last modified on June 28, 2024 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

23 minutes ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

5 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

10 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

11 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

11 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

11 hours ago