Trends

జియో కొత్త ప్లాన్స్.. మీమ్స్ మోత

భారతీయ ఇంటర్నెట్ రంగంలో జియో తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంబీల్లో డేటాను కూడా వందల రూపాయలు పెట్టి కొంటున్న రోజుల్లో అదే వందల రూపాయలకు రోజూ ఒక జీబీ ఇంటర్నెట్ అందించిన ఘనత జియోకే చెందుతుంది. మొదట్లో ఉచిత ఆఫర్లు, చీప్ రేట్లతో జియో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా దేశంలో పదుల కోట్ల మంది జియో వైపు మళ్లారు. మొబైల్ ఇంటర్నెట్ వాడే వాళ్లలో చాలామంది వేరే నెట్‌వర్క్ వదిలిపెట్టి జియోకు మళ్లగా.. వేరే నెట్‌వర్క్ వాడుతూ కూడా అదనంగా జియో సిమ్ తీసుకున్న వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఈ దెబ్బకు మిగతా నెట్‌వర్క్స్ అన్నీ కూడా డేటా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తంగా దేశంలో ఇంటర్నెట్ ఎక్కువమందికి అందుబాటులోకి రావడంలో, చౌకగా మారడంలో జియో కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.

ఐతే అంబానీల వ్యాపార సూత్రం ఏంటంటే.. వినియోగదారులకు ముందు ఏదైనా చౌకగా అందించి దానికి బాగా అలవాటు చేస్తారని.. అలా అలవాటు పడ్డాక ధరలు పెంచి సొమ్ము చేసుకుంటారని పేరుంది. జియో విషయంలో కూడా ఇదే జరుగుతుందని వ్యాపార వర్గాలు ముందే అంచనా వేశాయి. ఆ అంచనా ప్రకారమే తర్వాత పరిణామాలు జరిగాయి. క్రమ క్రమంగా డేటా ధరలు పెంచుతూ వచ్చిన జియో.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. వార్షిక ప్లాన్‌లో ఒకేసారి 600 ధర పెంచింది. మిగతా ప్లాన్లకూ ధరలు మారాయి. ఈ మేరకు ప్రకటన రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో మీమ్స్ మోత మోగింది.

ముకేశ్ అంబానీ ముందు ఎలా ఆఫర్లు ఇస్తాడు.. తర్వాత ఎలా డబ్బులు లాగేస్తాడో చూపిస్తూ పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి. తన కొడుకు నిశ్చితార్థం సందర్భంగా అంబానీ తినుబండారాలు వడ్డించిన వీడియోలో దృశ్యాలను రివర్స్ చేసి చూపిస్తూ.. జనాలకు చౌకగా జియోను అందించి దానికి అలవాటు చేశాక ఎలా రేట్లు పెంచి డబ్బులు లాగుతున్నాడో వివరిస్తూ రెడీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి మరెన్నో మీమ్స్, జోక్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

This post was last modified on June 28, 2024 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.…

2 hours ago

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…

2 hours ago

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

3 hours ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

4 hours ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

5 hours ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

6 hours ago