భారతీయ ఇంటర్నెట్ రంగంలో జియో తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంబీల్లో డేటాను కూడా వందల రూపాయలు పెట్టి కొంటున్న రోజుల్లో అదే వందల రూపాయలకు రోజూ ఒక జీబీ ఇంటర్నెట్ అందించిన ఘనత జియోకే చెందుతుంది. మొదట్లో ఉచిత ఆఫర్లు, చీప్ రేట్లతో జియో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా దేశంలో పదుల కోట్ల మంది జియో వైపు మళ్లారు. మొబైల్ ఇంటర్నెట్ వాడే వాళ్లలో చాలామంది వేరే నెట్వర్క్ వదిలిపెట్టి జియోకు మళ్లగా.. వేరే నెట్వర్క్ వాడుతూ కూడా అదనంగా జియో సిమ్ తీసుకున్న వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఈ దెబ్బకు మిగతా నెట్వర్క్స్ అన్నీ కూడా డేటా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తంగా దేశంలో ఇంటర్నెట్ ఎక్కువమందికి అందుబాటులోకి రావడంలో, చౌకగా మారడంలో జియో కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.
ఐతే అంబానీల వ్యాపార సూత్రం ఏంటంటే.. వినియోగదారులకు ముందు ఏదైనా చౌకగా అందించి దానికి బాగా అలవాటు చేస్తారని.. అలా అలవాటు పడ్డాక ధరలు పెంచి సొమ్ము చేసుకుంటారని పేరుంది. జియో విషయంలో కూడా ఇదే జరుగుతుందని వ్యాపార వర్గాలు ముందే అంచనా వేశాయి. ఆ అంచనా ప్రకారమే తర్వాత పరిణామాలు జరిగాయి. క్రమ క్రమంగా డేటా ధరలు పెంచుతూ వచ్చిన జియో.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. వార్షిక ప్లాన్లో ఒకేసారి 600 ధర పెంచింది. మిగతా ప్లాన్లకూ ధరలు మారాయి. ఈ మేరకు ప్రకటన రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో మీమ్స్ మోత మోగింది.
ముకేశ్ అంబానీ ముందు ఎలా ఆఫర్లు ఇస్తాడు.. తర్వాత ఎలా డబ్బులు లాగేస్తాడో చూపిస్తూ పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి. తన కొడుకు నిశ్చితార్థం సందర్భంగా అంబానీ తినుబండారాలు వడ్డించిన వీడియోలో దృశ్యాలను రివర్స్ చేసి చూపిస్తూ.. జనాలకు చౌకగా జియోను అందించి దానికి అలవాటు చేశాక ఎలా రేట్లు పెంచి డబ్బులు లాగుతున్నాడో వివరిస్తూ రెడీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి మరెన్నో మీమ్స్, జోక్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
This post was last modified on June 28, 2024 2:51 pm
భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా…
కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం…
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…