తెలంగాణలో బీర్లకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో గత నెల నుంచి ఇదే కొనసాగుతోంది. మందు బాబులకు ఎంతో ప్రియమైన బ్రాండ్స్ అయితే.. అసలు అందుబాటులో కూడా లేక పోవడం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త బ్రాండ్లు గతంలో ఎన్నడూ రుచిచూడని కావడం విశేషం. మరోవైపు బీర్లకు కొరత ఏర్పడడంతో బ్లాక్ మార్కెట్ కూడా భారీగా పుంజుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
వాస్తవానికి సమ్మర్ సీజన్లో తెలంగాణ ప్రాంతంలో బీర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం కూడా.. అదే పరిస్థితి నెలకొనడంతో బీర్లకు కొరత ఏర్పడిందని చెబుతున్నారు. అయితే.. ఇది సర్కారు ఖజానాపైనా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సామ్ డిస్టిలరీలకు బీర్లను వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో సంస్థ.. సరికొత్త బీర్లను మార్కెట్లోకి తసుకువచ్చి.. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఉంచింది.
ఈ పరిణామం.. రేవంత్ రెడ్డి సర్కారుపైనా.. ముఖ్యంగా సీఎంపైనా విమర్శలు వచ్చేలా చేసింది. కొత్త బ్రాండ్లకు అనుమతించడం ఏంటని పలువురు తప్పుబడుతున్నారు. 2019లో ఏపీ సీఎం జగన్ ఇలానే చేశారంటూ.. దుయ్యబడుతున్నారు. అయితే.. ఏపీకి , తెలంగాణకు తేడా ఏంటంటే.. అక్కడ కొత్తగా బ్రాండ్లను తయారు చేసి విక్రయించారు. కానీ, తెలంగాణలో మాత్రం ఉన్న బ్రాండ్లను కొత్తగా మార్కెట్లో కి తీసుకువచ్చారు.
అంతేకాదు.. ఏపీలో ఉన్న మాదిరిగా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ వంటివి తెలంగాణలో లేకపోవడం గమనార్హం. అవి కేవలం ఏపీకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బ్రాండ్లు మాత్రం ఇప్పటికే కొన్న రాష్ట్రాల్లోని హోటళ్లలో అందుబాటులో ఉన్నాయి. పైగా అవి అక్కడవిరవిగా వినియోగిస్తున్న బ్రాండ్లు కావడం గమనార్హం.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…