తెలంగాణలో బీర్లకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో గత నెల నుంచి ఇదే కొనసాగుతోంది. మందు బాబులకు ఎంతో ప్రియమైన బ్రాండ్స్ అయితే.. అసలు అందుబాటులో కూడా లేక పోవడం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త బ్రాండ్లు గతంలో ఎన్నడూ రుచిచూడని కావడం విశేషం. మరోవైపు బీర్లకు కొరత ఏర్పడడంతో బ్లాక్ మార్కెట్ కూడా భారీగా పుంజుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
వాస్తవానికి సమ్మర్ సీజన్లో తెలంగాణ ప్రాంతంలో బీర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం కూడా.. అదే పరిస్థితి నెలకొనడంతో బీర్లకు కొరత ఏర్పడిందని చెబుతున్నారు. అయితే.. ఇది సర్కారు ఖజానాపైనా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సామ్ డిస్టిలరీలకు బీర్లను వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో సంస్థ.. సరికొత్త బీర్లను మార్కెట్లోకి తసుకువచ్చి.. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఉంచింది.
ఈ పరిణామం.. రేవంత్ రెడ్డి సర్కారుపైనా.. ముఖ్యంగా సీఎంపైనా విమర్శలు వచ్చేలా చేసింది. కొత్త బ్రాండ్లకు అనుమతించడం ఏంటని పలువురు తప్పుబడుతున్నారు. 2019లో ఏపీ సీఎం జగన్ ఇలానే చేశారంటూ.. దుయ్యబడుతున్నారు. అయితే.. ఏపీకి , తెలంగాణకు తేడా ఏంటంటే.. అక్కడ కొత్తగా బ్రాండ్లను తయారు చేసి విక్రయించారు. కానీ, తెలంగాణలో మాత్రం ఉన్న బ్రాండ్లను కొత్తగా మార్కెట్లో కి తీసుకువచ్చారు.
అంతేకాదు.. ఏపీలో ఉన్న మాదిరిగా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ వంటివి తెలంగాణలో లేకపోవడం గమనార్హం. అవి కేవలం ఏపీకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బ్రాండ్లు మాత్రం ఇప్పటికే కొన్న రాష్ట్రాల్లోని హోటళ్లలో అందుబాటులో ఉన్నాయి. పైగా అవి అక్కడవిరవిగా వినియోగిస్తున్న బ్రాండ్లు కావడం గమనార్హం.
This post was last modified on May 27, 2024 9:28 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…