దేశమంతా లాక్డౌన్ విధించడంతో ఆన్లైన్ గేమ్స్కు డిమాండ్ బాగా పెరిగింది. అందులో ముఖ్యంగా లూడో గేమ్ ఆడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలు ఈ ఆటకు ఎక్కువగా కనెక్ట్ కావడంతో ఈ నెల రోజుల్లో లూడో గేమ్ డౌన్లోడ్స్ మిలియన్లలో పెరిగాయి. అయితే భర్తతో కలిసి లూడో గేమ్ ఆడిన ఓ మహిళ, తన ప్రాణం మీదికి తెచ్చుకుంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన గుజరాత్లోని వడోదర నగరంలో వెలుగుచూసింది.
వడోదరలోని వెమలి ఏరియాలో భర్తతో కలిసి నివాసం ఉంటున్న 24 ఏళ్ల మహిళ, ట్యూషన్ టీచర్గా పనిచేస్తూ ఉండేది. లాక్డౌన్లో భర్త బయటికి వెళ్లడం ఇష్టం లేని ఆమె, లూడో గేమ్ ఆడదామని అతన్ని ఒప్పించింది. అయితే భార్య చేతిలో వరుసగా నాలుగు, ఐదు గేమ్స్ ఓడిపోయాడు భర్త. ఆడదాని చేతిలో మళ్లీ మళ్లీ ఓడిపోతున్నానని టెంపర్ కోల్పోయి, తీవ్రమైన అసహనానికి గురైన అతను, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
కోపం చల్లారిన తర్వాత బాధతో ఏడుస్తున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ట్యూషన్ టీచర్ను పరీక్షించిన డాక్టర్లు… వెన్నెముకపై దాడి చేయడం వల్ల, ఆమె వెన్నుపూస రెండు చోట్ల విరిగిందని తెలిపారు. చికిత్స తర్వాత భర్తతో కాపురానికి వెళ్లేందుకు నిరాకరించిన ఆమె, పుట్టింటికి వెళ్తానని పోలీసులకు తెలిపింది. అయితే భర్త క్షమాపణలు చెప్పడంతో కాంప్రమైజ్ అయి, కేసు వెనక్కి తీసుకుని, కొన్నిరోజుల తర్వాత కాపురానికి వస్తానని చెప్పింది.
ఇకపోతే కాలక్షేపం ఇవ్వాల్సిన వీడియో గేమ్స్ కూడా జనాల్లో ఫ్రస్టేషన్ను పెంచుతున్నాయని ఈ సంఘటన రుజువు చేసింది. ఆదాయం లేక, అప్పులు ఎలా కట్టాలో తెలియక సతమతమవుతున్న కొందరు, అతిగా వీడియో గేమ్స్ ఆడడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని చెబుతున్నారు సైకాలజిస్టులు.
This post was last modified on April 29, 2020 8:30 am
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…