దేశమంతా లాక్డౌన్ విధించడంతో ఆన్లైన్ గేమ్స్కు డిమాండ్ బాగా పెరిగింది. అందులో ముఖ్యంగా లూడో గేమ్ ఆడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలు ఈ ఆటకు ఎక్కువగా కనెక్ట్ కావడంతో ఈ నెల రోజుల్లో లూడో గేమ్ డౌన్లోడ్స్ మిలియన్లలో పెరిగాయి. అయితే భర్తతో కలిసి లూడో గేమ్ ఆడిన ఓ మహిళ, తన ప్రాణం మీదికి తెచ్చుకుంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన గుజరాత్లోని వడోదర నగరంలో వెలుగుచూసింది.
వడోదరలోని వెమలి ఏరియాలో భర్తతో కలిసి నివాసం ఉంటున్న 24 ఏళ్ల మహిళ, ట్యూషన్ టీచర్గా పనిచేస్తూ ఉండేది. లాక్డౌన్లో భర్త బయటికి వెళ్లడం ఇష్టం లేని ఆమె, లూడో గేమ్ ఆడదామని అతన్ని ఒప్పించింది. అయితే భార్య చేతిలో వరుసగా నాలుగు, ఐదు గేమ్స్ ఓడిపోయాడు భర్త. ఆడదాని చేతిలో మళ్లీ మళ్లీ ఓడిపోతున్నానని టెంపర్ కోల్పోయి, తీవ్రమైన అసహనానికి గురైన అతను, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
కోపం చల్లారిన తర్వాత బాధతో ఏడుస్తున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ట్యూషన్ టీచర్ను పరీక్షించిన డాక్టర్లు… వెన్నెముకపై దాడి చేయడం వల్ల, ఆమె వెన్నుపూస రెండు చోట్ల విరిగిందని తెలిపారు. చికిత్స తర్వాత భర్తతో కాపురానికి వెళ్లేందుకు నిరాకరించిన ఆమె, పుట్టింటికి వెళ్తానని పోలీసులకు తెలిపింది. అయితే భర్త క్షమాపణలు చెప్పడంతో కాంప్రమైజ్ అయి, కేసు వెనక్కి తీసుకుని, కొన్నిరోజుల తర్వాత కాపురానికి వస్తానని చెప్పింది.
ఇకపోతే కాలక్షేపం ఇవ్వాల్సిన వీడియో గేమ్స్ కూడా జనాల్లో ఫ్రస్టేషన్ను పెంచుతున్నాయని ఈ సంఘటన రుజువు చేసింది. ఆదాయం లేక, అప్పులు ఎలా కట్టాలో తెలియక సతమతమవుతున్న కొందరు, అతిగా వీడియో గేమ్స్ ఆడడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని చెబుతున్నారు సైకాలజిస్టులు.
This post was last modified on April 29, 2020 8:30 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…