Trends

ఆన్‌లైన్ గేమ్‌లో ఓడించిందని, నడుం విరగ్గొట్టాడు

దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో ఆన్‌లైన్ గేమ్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. అందులో ముఖ్యంగా లూడో గేమ్ ఆడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలు ఈ ఆటకు ఎక్కువగా కనెక్ట్ కావడంతో ఈ నెల రోజుల్లో లూడో గేమ్ డౌన్‌లోడ్స్ మిలియన్లలో పెరిగాయి. అయితే భర్తతో కలిసి లూడో గేమ్ ఆడిన ఓ మహిళ, తన ప్రాణం మీదికి తెచ్చుకుంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదర నగరంలో వెలుగుచూసింది.

వడోదరలోని వెమలి ఏరియాలో భర్తతో కలిసి నివాసం ఉంటున్న 24 ఏళ్ల మహిళ, ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తూ ఉండేది. లాక్‌డౌన్‌లో భర్త బయటికి వెళ్లడం ఇష్టం లేని ఆమె, లూడో గేమ్ ఆడదామని అతన్ని ఒప్పించింది. అయితే భార్య చేతిలో వరుసగా నాలుగు, ఐదు గేమ్స్ ఓడిపోయాడు భర్త. ఆడదాని చేతిలో మళ్లీ మళ్లీ ఓడిపోతున్నానని టెంపర్ కోల్పోయి, తీవ్రమైన అసహనానికి గురైన అతను, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

కోపం చల్లారిన తర్వాత బాధతో ఏడుస్తున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ట్యూషన్ టీచర్‌ను పరీక్షించిన డాక్టర్లు… వెన్నెముకపై దాడి చేయడం వల్ల, ఆమె వెన్నుపూస‌ రెండు చోట్ల విరిగిందని తెలిపారు. చికిత్స తర్వాత భర్తతో కాపురానికి వెళ్లేందుకు నిరాకరించిన ఆమె, పుట్టింటికి వెళ్తానని పోలీసులకు తెలిపింది. అయితే భర్త క్షమాపణలు చెప్పడంతో కాంప్రమైజ్ అయి, కేసు వెనక్కి తీసుకుని, కొన్నిరోజుల తర్వాత కాపురానికి వస్తానని చెప్పింది.

ఇకపోతే కాలక్షేపం ఇవ్వాల్సిన వీడియో గేమ్స్ కూడా జనాల్లో ఫ్రస్టేషన్‌ను పెంచుతున్నాయని ఈ సంఘటన రుజువు చేసింది. ఆదాయం లేక, అప్పులు ఎలా కట్టాలో తెలియక సతమతమవుతున్న కొందరు, అతిగా వీడియో గేమ్స్ ఆడడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని చెబుతున్నారు సైకాలజిస్టులు.

This post was last modified on April 29, 2020 8:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

25 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

39 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago