అది సంగీత విభావరి జరుగుతున్న సమయం. గాయకులు తన్మయత్వంతో గీతాలను ఆలపిస్తున్నారు. వీక్షకులు.. మంత్ర ముగ్ధులై.. గాయకుల సంభ్రమలో మునిగి.. సంగీతంలో ఓలలాడుతున్నారు. ఇలా.. సాగుతున్న సంగీత కచేరీలో అకస్మాత్తుగా.. బాంబుల వర్షం… మారణ కాండ.. రక్తపుటేరులు. ఎటు చూసినా.. పదుల సంఖ్యలో మృతదేహాలు కన్నుమూసి తెరిచేలోగా.. ఏం జరిగిందో కూడా తెలియనంతగా భీతావహ దృశ్యాలు.. ఇవీ.. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన మారణకాండ తాలూకు పరిస్థితి.
రష్యా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి పగ్గాలు చేపట్టిన పుతిన్.. రెండు రోజులు కూడా గడవకముందే.. భయంకరమైన పరిస్థితిని చవి చూడాల్సి వచ్చింది. దేశంలో ఇప్పటి వరకు జరగని రీతిలో దారుణ మారణకాండ చోటు చేసుకుంది. ఒక్క పెట్టున వచ్చిన ఉగ్రవాదులు క్రాకస్ సిటీ కన్సర్ట్(సంగీత విభావరి)లో మారణకాండను సృష్టించారు. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 60 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ధ్రువీకరించింది.
ఏం జరిగింది?
ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ ఏటా నిర్వహించే వార్షిక సంగీత విభావరిని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఇది మంచి రసపట్టులో ఉంది. గాయకుల గీతాలకు వీక్షకులు.. మంత్రుముగ్ధులై ఓలలాడుతు న్నారు. ఇంతలో హఠాత్తుగా భవనంలోనికి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సాయుధులు కాల్పులు జరపడం, పలువురు భయాందోళనలతో ఘటనాస్థలం నుంచి పారిపోతుండడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఉగ్రవాదుల దాడితో భవనంపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నల్లటి పొగలు వ్యాపించాయి. ఐదుగురు సాయుధులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడి తామే చేసినట్లు ‘ఇస్లామిక్ స్టేట్’ ప్రకటించుకుంది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు. 2002లో చెచెన్ మిలిటెంట్లు మాస్కో థియేటర్లో సుమారు 800 మందిని బందీలుగా చేసుకున్నారు.
This post was last modified on March 23, 2024 10:55 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…