తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, జయలలితకు అత్యంత విధేయుడిగా పేరొందిన ఒ. పన్నీర్ సెల్వం.. తాజాగా కమలం పార్టీకి షాకిచ్చారు. అధికార పార్టీ డీఎంకేలో చేరిపోయారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఆయన కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో రాజకీయాలను కీలక మలుపు తిప్పనుందని పరిశీలకులు చెబుతున్నారు.
పన్నీర్ సెల్వం సామాజిక వర్గం పరంగానేకాకుండా.. పాలన పరంగా కూడా.. తమిళనాడు ప్రజలపై బలమైన ముద్ర వేశారు. తొలినాళ్లలో ఆయన అన్నాడీఎంకేకు అనుబంధంగానే పనిచేశారు. జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆమెకు ఎప్పుడు అవసరం అయినా.. ముఖ్యమంత్రి పీఠంపై ఆయన కూర్చున్నారు. అంతటి విధేయతను ప్రజలపై కూడా చూపించారు. దీంతో పన్నీర్ సెల్వం పట్ల తమిళులకు ఎనలేని అభిమానం ఉంది.
ఇప్పుడు ఎన్నికల వేళ.. ఆయన బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ప్రయత్నించారు. కానీ, బీజేపీ ఈ విషయంలో తాత్సారం చేయడంతోపాటు.. అన్నాడీఎంకే అధినేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి పళని స్వామిని తమకు అనుబంధ కూటమిలో చేర్చుకుంది. దీంతో స్టాలిన్ పిలుపు మేరకు పన్నీరు సెల్వం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది.. కీలకమైన ద్రవిడ ఓటు బ్యాంకును స్టాలిన్కు మరింత చేరువ చేస్తుందన్న చర్చ సాగుతోంది.
2022 నుంచి..
వాస్తవానికి 2022లోనే అన్నాడీఎంకే పార్టీ నుంచి సెల్వం బయటకు వచ్చారు. ఆ సమయంలోనే ఆయన బీజేపీ పగ్గాల కోసం ప్రయత్నం చేశారు. కానీ, అవకాశం చిక్కలేదు. అయినా వేచి ఉన్నారు. ఇక, తనకు అవకాశం రాదని భావించి.. తాజాగా తనకుమారుడు, మాజీ ఎంపీ రవీంద్రతో పాటు.. పలువురు ఎమ్మెల్యేలతో డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంతో జయలలిత అభిమానులు సంబంరాలు చేసుకోవడం గమనార్హం.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…