Political News

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి, జ‌య‌ల‌లితకు అత్యంత విధేయుడిగా పేరొందిన ఒ. ప‌న్నీర్ సెల్వం.. తాజాగా క‌మ‌లం పార్టీకి షాకిచ్చారు. అధికార పార్టీ డీఎంకేలో చేరిపోయారు. ముఖ్య‌మంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఆయ‌న కండువా క‌ప్పుకొన్నారు. ఈ ప‌రిణామం రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను కీల‌క మ‌లుపు తిప్ప‌నుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ప‌న్నీర్ సెల్వం సామాజిక వ‌ర్గం ప‌రంగానేకాకుండా.. పాల‌న ప‌రంగా కూడా.. తమిళ‌నాడు ప్ర‌జ‌ల‌పై బ‌లమైన ముద్ర వేశారు. తొలినాళ్ల‌లో ఆయ‌న అన్నాడీఎంకేకు అనుబంధంగానే ప‌నిచేశారు. జయ‌ల‌లిత‌కు అత్యంత న‌మ్మ‌కస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆమెకు ఎప్పుడు అవ‌స‌రం అయినా.. ముఖ్య‌మంత్రి పీఠంపై ఆయ‌న కూర్చున్నారు. అంత‌టి విధేయ‌త‌ను ప్ర‌జ‌ల‌పై కూడా చూపించారు. దీంతో ప‌న్నీర్ సెల్వం ప‌ట్ల త‌మిళుల‌కు ఎన‌లేని అభిమానం ఉంది.

ఇప్పుడు ఎన్నిక‌ల వేళ‌.. ఆయ‌న బీజేపీ త‌ర‌పున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, బీజేపీ ఈ విష‌యంలో తాత్సారం చేయ‌డంతోపాటు.. అన్నాడీఎంకే అధినేత‌గా ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామిని త‌మ‌కు అనుబంధ కూట‌మిలో చేర్చుకుంది. దీంతో స్టాలిన్ పిలుపు మేర‌కు ప‌న్నీరు సెల్వం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది.. కీల‌కమైన ద్ర‌విడ ఓటు బ్యాంకును స్టాలిన్‌కు మ‌రింత చేరువ చేస్తుంద‌న్న చర్చ సాగుతోంది.

2022 నుంచి..

వాస్త‌వానికి 2022లోనే అన్నాడీఎంకే పార్టీ నుంచి సెల్వం బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న బీజేపీ ప‌గ్గాల కోసం ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అవ‌కాశం చిక్క‌లేదు. అయినా వేచి ఉన్నారు. ఇక‌, త‌న‌కు అవ‌కాశం రాద‌ని భావించి.. తాజాగా త‌న‌కుమారుడు, మాజీ ఎంపీ ర‌వీంద్ర‌తో పాటు.. ప‌లువురు ఎమ్మెల్యేల‌తో డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ ప‌రిణామంతో జ‌య‌ల‌లిత అభిమానులు సంబంరాలు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 27, 2026 3:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

1 hour ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

3 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

4 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

4 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

5 hours ago