ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే ఉంది. రేపు అతడుని మళ్ళీ విడుదల చేస్తున్నారు. బుకింగ్స్ ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఇవాళ రాత్రి హైదరాబాద్ లో నాలుగు స్పెషల్ ప్రీమియర్లు వేస్తే ఇప్పటిదాకా ఒక్కటి హౌస్ ఫుల్ కాలేదు.
షో టైంకి నిండితే చెప్పలేం కానీ ఆన్ లైన్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. రేపు ఉదయం రెండు మూడు సింగల్ స్క్రీన్లలో మినహాయించి మిగిలినవన్నీ సోసోనే ఉన్నాయి. సహజంగా మహేష్ బాబు అభిమానుల్లో కనిపించే ఎగ్జైట్ మెంట్ ఈసారి తక్కువగా ఉన్న మాట వాస్తవం.
దీనికి కారణం ఒకటే. మరీ తక్కువ గ్యాప్ లో అదే పాత సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయడమే. అతడు మొన్న ఆగస్ట్ లోనే మహేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. బాగానే చూశారు కానీ మరీ రికార్డులు బద్దలు కాలేదు. ఏదో టైమింగ్ మిస్సయ్యిందనుకున్నారో ఏమో తిరిగి ఇంతలోపే మరోసారి తీసుకొచ్చారు.
శాటిలైట్ ఛానల్ లో కొన్ని వందలసార్లు ప్రసారమై యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతున్న సినిమాని ఇన్నేసిసార్లు రుద్దడం వల్ల దాని స్టామినా వృథా అయిపోతోంది. రాబోయే రోజుల్లో ఇంకోసారి అంటే స్వంత ఫ్యాన్సే లైట్ తీసుకునే ప్రమాదముంది. ఇది నిర్మాతలు గుర్తించాలి.
అసలు కొత్త సినిమాలకే థియేటర్లలో జనం లేరు. సంక్రాంతి హడావిడి అయిపోయి జనవరి చివరి వారం నుంచి జనం లేక హాళ్లు లబోదిబోమంటున్నాయి. రెండు మూడు ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకున్నా హౌస్ ఫుల్స్ చేయించిన బొమ్మ ఒక్కటీ రాలేదు.
వారం వారం ఎదురుచూసే కొద్దీ నిరాశే మిగులుతోంది కానీ ఊరట కలిగించే సూపర్ హిట్ రాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంత డ్రై సిచువేషన్ లో ఏదో నాలుగు డబ్బులు చేసుకుందామని ఆశపడిన అతడుకి నిరాశే మిగిలేలా ఉంది. అరగదీస్తే జరిగేది ఇదే మరి.
This post was last modified on February 27, 2026 11:33 pm
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…
ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం విషయంలో అభిమానులు ఎంత మాత్రం హ్యాపీగా లేరన్నది వాస్తవం. వింటేజ్ పవన్…