మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు రాడ్డుతో పార్క్ చేసి ఉన్న రెండు కార్ల అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నారద నీలాద్రిగా గుర్తించారు. అతనికి మానసిక స్థితి సరిగా లేదనే సమాచారం ఉన్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యపై అర్జీ ఇవ్వడానికి ఇచ్ఛాపురం నుంచి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఆగ్రహానికి కారణాలు ఏమిటి? ముందస్తు ప్రణాళిక ఏదైనా ఉందా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన తీవ్రత దృష్ట్యా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టారు.
అత్యంత భద్రత కలిగిన పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ఓ వ్యక్తి రాడ్డుతో ఎలా ప్రవేశించగలిగాడు? గేటు వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఎందుకు గమనించలేకపోయారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది భద్రతా వైఫల్యమా? లేక దీని వెనుక రాజకీయ కోణమా? అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనగా, అదనపు బలగాలను మోహరించారు. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
This post was last modified on February 27, 2026 3:58 pm
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…
నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…