Political News

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు రాడ్డుతో పార్క్ చేసి ఉన్న రెండు కార్ల అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నారద నీలాద్రిగా గుర్తించారు. అతనికి మానసిక స్థితి సరిగా లేదనే సమాచారం ఉన్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యపై అర్జీ ఇవ్వడానికి ఇచ్ఛాపురం నుంచి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఆగ్రహానికి కారణాలు ఏమిటి? ముందస్తు ప్రణాళిక ఏదైనా ఉందా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన తీవ్రత దృష్ట్యా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విచారణ చేపట్టారు.

అత్యంత భద్రత కలిగిన పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ఓ వ్యక్తి రాడ్డుతో ఎలా ప్రవేశించగలిగాడు? గేటు వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఎందుకు గమనించలేకపోయారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది భద్రతా వైఫల్యమా? లేక దీని వెనుక రాజకీయ కోణమా? అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనగా, అదనపు బలగాలను మోహరించారు. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

This post was last modified on February 27, 2026 3:58 pm

Share

Recent Posts

సౌండ్ సరిపోతుందా శ్రీనివాసా

వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…

17 minutes ago

బెజవాడ నడిబొడ్డున ముద్రగడ విగ్రహం

కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…

2 hours ago

కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…

2 hours ago

యువత తిరగబడింది… రాజ్యం ఉలికిపడింది!

నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…

3 hours ago

శ్రీగౌరి నేర్చుకోవాల్సిన బేబీ పాఠాలు

మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి  అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…

4 hours ago

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…

5 hours ago