ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన కేబినెట్లోని మాజీ మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసు నమోదైనప్పుడే.. తనకు ఎలాంటి సంబంధం లేదని.. అసలు ఇది కేసే కాదని.. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని.. దీనిలో ఎవరికీ మేలు జరిగేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పానని.. కానీ, ఆనాడు తన మాటను ఎవరూ పట్టించుకోలేదని కేజ్రీవాల్ అన్నారు.
అంతేకాదు.. తనను అక్రమార్కుడిగా, అవినీతిపరుడిగా చిత్రీకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా, బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. “నిజం ఇప్పటికి బయటకు వచ్చింది. కానీ, జరగాల్సిన అన్యాయం మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు మాకు సమాధానం చెబుతారు? ప్రజలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి.“ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు వెలువరించిన తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఊరేగింపుగా కేజ్రీవాల్ను తన నివాసానికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియా ముందు మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేసేందుకు కుట్రలు చేశారని వ్యాఖ్యానించారు. ప్రజల్లోనూ తమ పరువు పోయేలా వ్యవహరించారని తెలిపారు. తనతోపాటు.. ఐదుగురు మంత్రులను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారని అన్నారు. కానీ, నిజాలు ఎప్పుడూ బయటకు వస్తాయని.. కాకపోతే తమ విషయంలో మరింత ఆలస్యమైందని అన్నారు. ఇప్పటికైనా కోర్టు తమను నిర్దోషులుగా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు.
దర్యాప్తు సంస్థలకు తమకు నచ్చినట్టుగా.. తమ ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీల పరువు ఇప్పుడు పోయిందని.. ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. రాజకీయ వేధింపులకు.. సంస్థలను వినియోగించుకుంటున్న మోడీ, షాలు కళ్లు తెరవాలని, రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొనాలని.. దొడ్డిదారిలో కేసులు పెట్టడం సరికాదని అన్నారు.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…