Political News

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న కేబినెట్లోని మాజీ మంత్రులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ కేసు న‌మోదైన‌ప్పుడే.. త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. అస‌లు ఇది కేసే కాద‌ని.. ప్ర‌భుత్వ విధాన ప‌ర‌మైన నిర్ణ‌య‌మ‌ని.. దీనిలో ఎవ‌రికీ మేలు జ‌రిగేలా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పాన‌ని.. కానీ, ఆనాడు త‌న మాట‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని కేజ్రీవాల్ అన్నారు.

అంతేకాదు.. త‌న‌ను అక్ర‌మార్కుడిగా, అవినీతిప‌రుడిగా చిత్రీక‌రించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ నాయ‌కులు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. “నిజం ఇప్ప‌టికి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ, జ‌ర‌గాల్సిన అన్యాయం మాత్రం జ‌రిగిపోయింది. ఇప్పుడు ఎవ‌రు మాకు స‌మాధానం చెబుతారు? ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా నిజాలు తెలుసుకోవాలి.“ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ కోర్టు ఉత్త‌ర్వులు వెలువ‌రించిన త‌ర్వాత‌.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కులు ఊరేగింపుగా కేజ్రీవాల్‌ను త‌న నివాసానికి తీసుకువెళ్లారు.

ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ మీడియా ముందు మాట్లాడుతూ.. క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేసేందుకు కుట్ర‌లు చేశార‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల్లోనూ త‌మ ప‌రువు పోయేలా వ్య‌వ‌హ‌రించార‌ని తెలిపారు. త‌న‌తోపాటు.. ఐదుగురు మంత్రుల‌ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందార‌ని అన్నారు. కానీ, నిజాలు ఎప్పుడూ బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని.. కాక‌పోతే త‌మ విష‌యంలో మ‌రింత ఆల‌స్య‌మైంద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా కోర్టు త‌మను నిర్దోషులుగా పేర్కొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా.. త‌మ ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నార‌ని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీల ప‌రువు ఇప్పుడు పోయింద‌ని.. ఇప్ప‌టికైనా ద‌ర్యాప్తు సంస్థ‌లు నిష్ప‌క్ష‌పాతంగా ప‌నిచేయాల‌న్నారు. రాజ‌కీయ వేధింపుల‌కు.. సంస్థ‌ల‌ను వినియోగించుకుంటున్న మోడీ, షాలు క‌ళ్లు తెర‌వాల‌ని, రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగానే ఎదుర్కొనాల‌ని.. దొడ్డిదారిలో కేసులు పెట్ట‌డం స‌రికాద‌ని అన్నారు.

This post was last modified on February 27, 2026 3:21 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Kejriwal

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

3 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

5 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

13 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago