Political News

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న కేబినెట్లోని మాజీ మంత్రులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ కేసు న‌మోదైన‌ప్పుడే.. త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. అస‌లు ఇది కేసే కాద‌ని.. ప్ర‌భుత్వ విధాన ప‌ర‌మైన నిర్ణ‌య‌మ‌ని.. దీనిలో ఎవ‌రికీ మేలు జ‌రిగేలా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పాన‌ని.. కానీ, ఆనాడు త‌న మాట‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని కేజ్రీవాల్ అన్నారు.

అంతేకాదు.. త‌న‌ను అక్ర‌మార్కుడిగా, అవినీతిప‌రుడిగా చిత్రీక‌రించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ నాయ‌కులు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. “నిజం ఇప్ప‌టికి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ, జ‌ర‌గాల్సిన అన్యాయం మాత్రం జ‌రిగిపోయింది. ఇప్పుడు ఎవ‌రు మాకు స‌మాధానం చెబుతారు? ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా నిజాలు తెలుసుకోవాలి.“ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ కోర్టు ఉత్త‌ర్వులు వెలువ‌రించిన త‌ర్వాత‌.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కులు ఊరేగింపుగా కేజ్రీవాల్‌ను త‌న నివాసానికి తీసుకువెళ్లారు.

ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ మీడియా ముందు మాట్లాడుతూ.. క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేసేందుకు కుట్ర‌లు చేశార‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల్లోనూ త‌మ ప‌రువు పోయేలా వ్య‌వ‌హ‌రించార‌ని తెలిపారు. త‌న‌తోపాటు.. ఐదుగురు మంత్రుల‌ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందార‌ని అన్నారు. కానీ, నిజాలు ఎప్పుడూ బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని.. కాక‌పోతే త‌మ విష‌యంలో మ‌రింత ఆల‌స్య‌మైంద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా కోర్టు త‌మను నిర్దోషులుగా పేర్కొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా.. త‌మ ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నార‌ని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీల ప‌రువు ఇప్పుడు పోయింద‌ని.. ఇప్ప‌టికైనా ద‌ర్యాప్తు సంస్థ‌లు నిష్ప‌క్ష‌పాతంగా ప‌నిచేయాల‌న్నారు. రాజ‌కీయ వేధింపుల‌కు.. సంస్థ‌ల‌ను వినియోగించుకుంటున్న మోడీ, షాలు క‌ళ్లు తెర‌వాల‌ని, రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగానే ఎదుర్కొనాల‌ని.. దొడ్డిదారిలో కేసులు పెట్ట‌డం స‌రికాద‌ని అన్నారు.

This post was last modified on February 27, 2026 3:21 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

2 hours ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

2 hours ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

3 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

3 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

4 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

5 hours ago