ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన కేబినెట్లోని మాజీ మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసు నమోదైనప్పుడే.. తనకు ఎలాంటి సంబంధం లేదని.. అసలు ఇది కేసే కాదని.. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని.. దీనిలో ఎవరికీ మేలు జరిగేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పానని.. కానీ, ఆనాడు తన మాటను ఎవరూ పట్టించుకోలేదని కేజ్రీవాల్ అన్నారు.
అంతేకాదు.. తనను అక్రమార్కుడిగా, అవినీతిపరుడిగా చిత్రీకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా, బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. “నిజం ఇప్పటికి బయటకు వచ్చింది. కానీ, జరగాల్సిన అన్యాయం మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు మాకు సమాధానం చెబుతారు? ప్రజలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి.“ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు వెలువరించిన తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఊరేగింపుగా కేజ్రీవాల్ను తన నివాసానికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియా ముందు మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేసేందుకు కుట్రలు చేశారని వ్యాఖ్యానించారు. ప్రజల్లోనూ తమ పరువు పోయేలా వ్యవహరించారని తెలిపారు. తనతోపాటు.. ఐదుగురు మంత్రులను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారని అన్నారు. కానీ, నిజాలు ఎప్పుడూ బయటకు వస్తాయని.. కాకపోతే తమ విషయంలో మరింత ఆలస్యమైందని అన్నారు. ఇప్పటికైనా కోర్టు తమను నిర్దోషులుగా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు.
దర్యాప్తు సంస్థలకు తమకు నచ్చినట్టుగా.. తమ ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీల పరువు ఇప్పుడు పోయిందని.. ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. రాజకీయ వేధింపులకు.. సంస్థలను వినియోగించుకుంటున్న మోడీ, షాలు కళ్లు తెరవాలని, రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొనాలని.. దొడ్డిదారిలో కేసులు పెట్టడం సరికాదని అన్నారు.
This post was last modified on February 27, 2026 3:21 pm
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…