Trends

డేంజ‌ర్ బెల్స్.. ఇండియాపై దాడికి 300 మంది ఉగ్ర‌వాదులు

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల దృష్టి క‌రోనా మీదే ఉంది. అందుకు భార‌త్ కూడా మిన‌హాయింపు కాదు. నెల‌న్న‌ర‌గా క‌రోనా త‌ప్ప మ‌రో చ‌ర్చ లేదు దేశంలో. ఇండియాలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మున్ముందు మరింత విపత్కర పరిస్థితులు తలెత్తుతాయన్న అంచనాల నేపథ్యంలో వ్యవస్థలన్నీ ఆ మహమ్మారిని నిలువరించే పనిలోనే నిమగ్నమయ్యాయి.

క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు సైన్యంలో కొంత‌మందికి విశ్రాంతినిచ్చారు. కొంత‌మంది క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా కొన్ని రాష్ట్రాల‌కు వెళ్లారు. ఇలాంటి స‌మ‌యంలో ఇండియాపై దాడి చేయడం తేలికని ఉగ్రవాదులు భావిస్తున్నార‌ని.. జ‌మ్మూ క‌శ్మీర్లో నియంత్రణ రేఖ వెంబ‌డి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొనే ప్ర‌మాదం ఉంద‌ని.. ఇంట‌లిజెన్స్ వ‌ర్గాలు ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి.

సుమారు 300 మంది ఉగ్రవాదులు పీఓకే నియంత్రణ రేఖ వెంబడి కాపుగాసి ఉన్నట్లు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందింది. అక్కడి నుంచి కశ్మీర్ లోయలోకి ప్రవేశించాలన్నది వారి కుట్రగా తెలుస్తోంది. రంజాన్ వేళ ఇండియాలోకి చొరబడి తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు ముష్కరులు ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాకు చెందినవారేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం..సరిహద్దుల వెంబడి సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తోంది.

ఉగ్ర‌వాదులకు కరోనా ఉండే ఆస్కార‌ముంద‌ని, ఆ వైర‌స్‌ను అంటించే ప్ర‌య‌త్నం కూడా చేయొచ్చ‌ని.. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మీ అధికారులు సూచిస్తున్నారు. గ‌త నెల కూడా నియంత్ర‌ణ రేఖ నుంచి దేశంలోకి దూసుకొచ్చేందుకు ఉగ్ర‌వాదులు ప్ర‌య‌త్నించ‌గా.. తొమ్మిది మందిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు హ‌త‌మార్చాయి.

This post was last modified on April 26, 2020 9:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేసీఆర్ హరీష్‌తో జాగ్రత్త!: మహేష్ కుమార్

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…

31 minutes ago

మనసు మార్చుకుంటున్న దురంధర్ 2

రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…

32 minutes ago

ఎన్నికల్లో పోటీపై నాగబాబు సంచలన ప్రకటన

ఇక‌పై తాను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటాన‌ని జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు…

2 hours ago

నిన్నటిదాకా తిట్లు… కానీ ఇప్పుడేమో

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన లియోనెల్ మెస్సి రెండోసారి ఇండియాకు వస్తున్నాడని గత రెండు వారాలుగా ఇండియన్…

3 hours ago

రవితేజ రూటులో అఖిల్ రిస్కు ?

బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ప్రస్తుతం లెనిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, సితార…

4 hours ago

దురంధరుడి వేట ఇప్పట్లో ఆగేలా లేదు

పెద్ద బడ్జెట్లలో తీసిన పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ముంగిట మంచి హైప్ తెచ్చుకుంటాయి. ఆ హైప్‌కు తగ్గట్లు మంచి ఓపెనింగ్సూ…

4 hours ago