Trends

సద్గురు కు ఏమైంది?

ఈశ‌ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు, సద్గురు జ‌గ్గీ వాసుదేవ్ ప‌రిచ‌యం లేని వారు లేరు. సింపుల్‌గా ఉంటూ.. హోమాలు, య‌జ్ఞాల‌కు దూరంగా ఉంటూ.. త‌న‌దైన శైలిలో ఆధ్యాత్మిక‌త‌ను సైన్స్‌కు జోడిస్తూ ఆయ‌న ప్ర‌చారం చేయ‌డం, శిబిరాలు నిర్వ‌హించ‌డం తెలిసిందే.

ప్ర‌తి ఏటా మ‌హాశివ‌రాత్రి నాడు.. ఆయ‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో ఉన్న త‌న ఆశ్ర‌మంలో పెద్ద పండుగే చేస్తారు. దీనికి కేంద్ర మంత్రుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు, ప్ర‌పంచ దేశాల నుంచి అనేక మంది హాజ‌ర‌వుతారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న ఆసుప‌త్రిలో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఏం జ‌రిగింది?

జ‌గ్గీవాసుదేవ్‌(జ‌గ‌న్‌మోహ‌న్‌) కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్ర‌మంలో అపోలో ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆయ‌న‌కు బ్రెయిన్ సర్జరీ నిర్వ‌హించారు. గత నాలుగు వారాలుగా, సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, మహాశివరాత్రితో సహా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. మార్చి 15న ఆయనకు ఎంఆర్ఐ పరీక్షలు చేయగా మెదడులో భారీ రక్తస్రావం కనిపించిందని పేర్కొన్నారు. మూడు రోజుల కింద‌ట సద్గురును ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.

ఆయన మెదడులో ప్రాణాంతక వాపును గుర్తించినట్లు డాక్టర్ తెలిపారు. దీంతో అత్యవసర శస్త్రచికిత్స చేశామని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన బాగా కోలుకుంటున్నట్లు చెప్పారు. మేం చేయగలిగింది చేశాం. కానీ మీ మనోధైర్యంతో మీకు మీరే నయం చేసుకుంటున్నారని ఆయనతో సరదాగా అన్నాం అని డాక్టర్ వినీత్ సూరి తెలిపారు. సద్గురు మేం ఊహించినదాని కంటే వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు.

This post was last modified on March 20, 2024 10:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sadguru

Recent Posts

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

2 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

6 hours ago

అమ‌రావ‌తి ఆగ‌ద‌ని తెలిసీ.. జ‌గ‌న్ `రాజ‌కీయం`

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…

8 hours ago

జగిత్యాల టాక్: జీవన్ రెడ్డి రాంగ్ స్టెప్..!

జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…

8 hours ago

ఆ క‌మెడియ‌న్ కోసం వెతుకుతున్న‌ మెగా ఫ్యాన్స్

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి దూరితే.. ప‌రిణామాలు ఎలా ఉంటాయో చెప్ప‌డానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ‌. హైద‌రాబాద్‌కు…

9 hours ago

వెయ్యి కోట్ల ఒప్పందం… ముస్లిం ఓట్ల కోస‌మేనా?

దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…

9 hours ago