Trends

సద్గురు కు ఏమైంది?

ఈశ‌ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు, సద్గురు జ‌గ్గీ వాసుదేవ్ ప‌రిచ‌యం లేని వారు లేరు. సింపుల్‌గా ఉంటూ.. హోమాలు, య‌జ్ఞాల‌కు దూరంగా ఉంటూ.. త‌న‌దైన శైలిలో ఆధ్యాత్మిక‌త‌ను సైన్స్‌కు జోడిస్తూ ఆయ‌న ప్ర‌చారం చేయ‌డం, శిబిరాలు నిర్వ‌హించ‌డం తెలిసిందే.

ప్ర‌తి ఏటా మ‌హాశివ‌రాత్రి నాడు.. ఆయ‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో ఉన్న త‌న ఆశ్ర‌మంలో పెద్ద పండుగే చేస్తారు. దీనికి కేంద్ర మంత్రుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు, ప్ర‌పంచ దేశాల నుంచి అనేక మంది హాజ‌ర‌వుతారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న ఆసుప‌త్రిలో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఏం జ‌రిగింది?

జ‌గ్గీవాసుదేవ్‌(జ‌గ‌న్‌మోహ‌న్‌) కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్ర‌మంలో అపోలో ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆయ‌న‌కు బ్రెయిన్ సర్జరీ నిర్వ‌హించారు. గత నాలుగు వారాలుగా, సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, మహాశివరాత్రితో సహా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. మార్చి 15న ఆయనకు ఎంఆర్ఐ పరీక్షలు చేయగా మెదడులో భారీ రక్తస్రావం కనిపించిందని పేర్కొన్నారు. మూడు రోజుల కింద‌ట సద్గురును ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.

ఆయన మెదడులో ప్రాణాంతక వాపును గుర్తించినట్లు డాక్టర్ తెలిపారు. దీంతో అత్యవసర శస్త్రచికిత్స చేశామని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన బాగా కోలుకుంటున్నట్లు చెప్పారు. మేం చేయగలిగింది చేశాం. కానీ మీ మనోధైర్యంతో మీకు మీరే నయం చేసుకుంటున్నారని ఆయనతో సరదాగా అన్నాం అని డాక్టర్ వినీత్ సూరి తెలిపారు. సద్గురు మేం ఊహించినదాని కంటే వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు.

This post was last modified on March 20, 2024 10:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sadguru

Recent Posts

ఆయ‌నో మ‌ర్రి చెట్టు: టీడీపీ కామెంట్‌.. !

కొంద‌రు నాయ‌కులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా స‌హ‌క‌రిస్తారు. ఇది ఎక్క‌డైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో…

4 hours ago

ఒకేసారి 2 స‌మ‌స్య‌లు.. చంద్ర‌బాబు సీరియ‌స్ డెసిష‌న్‌!

ఏపీలో ఒకేసారి రెండు కీల‌క స‌మ‌స్య‌లు రాష్ట్రంలో అల‌జ‌డి రేపుతున్నాయి. ఈ రెండు కూడా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు…

5 hours ago

భారత్ భారీ విజయం.. కానీ…

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వేపై 72 పరుగుల…

5 hours ago

కుంభకోణంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరు?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు తాజాగా మ‌రో…

6 hours ago

‘నీటి’ రాజకీయాలకు చంద్రబాబు నో!!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి స‌మ‌స్య‌ను రాజకీయం చేయ‌ద‌ల్చుకోలేద‌ని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు…

8 hours ago

`లెస్స‌న్`పై నిప్పులు చెరిగిన సుప్రీం… అసలేంటిది?

కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఎన్ సీఈఆర్‌టీ సంస్థ‌.. 8వ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కంలో కొత్తగా చేర్చిన ఓ పాఠం దేశాన్ని…

8 hours ago