ఉక్రెయిన్తో యుద్ధం.. ప్రపంచం మాట వినని తెంపరితనం.. నా ఇష్టం నాదే అనే గడుసు తనం.. వెరసి అప్రకటిత నియంతృత్వానికి పోతపోసినట్టు ఉండే రష్యా అధ్యక్షుడు పుతిన్కే అక్కడి ప్రజలు మరోసారి పట్టం కట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆయనకు ఓట్ల వర్షంకురిసింది. తాజాగా మూడు రోజుల పాటు సాగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్కు దాదాపు 88శాతం ఓట్లు లభించినట్లు రష్యా ఎన్నికల సంఘం తెలిపిం ది.
మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన రష్యా ఎన్నికల్లో మొత్తం 74.22 శాతం పోలింగ్ నమోదైంది. అందులో పుతిన్కు అత్యధికంగా 88శాతం ఓట్లను లభించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. పుతిన్కు పోటీగా బరిలో ఉన్న న్యూ పీపుల్ పార్టీ వ్లాదిస్లవ్ డవాంకోవ్ 4.8 శాతం, మరో అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ ఖరితోనోవ్ 4.1 శాతం, లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్స్కీకి 3.15 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో పుతిన్ విజయం ఏకపక్షంగా సాగిపోయింది.
ఇటీవల అనుమానాస్పద రీతిలో జైలులోనే మృతి చెందిన ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మద్దతు దారులు పుతిన్కు వ్యతిరేకంగా.. నావల్నీకి సానుభూతిగా విస్తృతంగా ప్రచారం చేశారు. వీరికితోడు దీంతో ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్ వ్యతిరేకులు, దివంగత విపక్ష నేత మద్దతుదారులంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పుతిన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే.. ఈ సింపతీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎన్నికలకు ముందు వరకు కూడా పుతిన్ అంటే.. రష్యా నియంత అనే మాట విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
కానీ, పుతిన్తో పోలస్తే.. బలమైన నాయకుడు ఎన్నికల్లో కనిపించకపోవడం, దేశాన్ని కొన్ని విషయాలు మినహా అన్నింటా ముందుకు తీసుకువెళ్లడంలో పుతిన్ బలమైన నేతగా ఎదగడంతో ఆయన విజయం ఏకపక్షంగా మారిపోయింది. రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం పుతిన్ దాదాపు 88 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. మొత్తం 60 దశల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 71 ఏళ్ల పుతిన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
This post was last modified on March 18, 2024 2:12 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…