ఉక్రెయిన్తో యుద్ధం.. ప్రపంచం మాట వినని తెంపరితనం.. నా ఇష్టం నాదే అనే గడుసు తనం.. వెరసి అప్రకటిత నియంతృత్వానికి పోతపోసినట్టు ఉండే రష్యా అధ్యక్షుడు పుతిన్కే అక్కడి ప్రజలు మరోసారి పట్టం కట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆయనకు ఓట్ల వర్షంకురిసింది. తాజాగా మూడు రోజుల పాటు సాగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్కు దాదాపు 88శాతం ఓట్లు లభించినట్లు రష్యా ఎన్నికల సంఘం తెలిపిం ది.
మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన రష్యా ఎన్నికల్లో మొత్తం 74.22 శాతం పోలింగ్ నమోదైంది. అందులో పుతిన్కు అత్యధికంగా 88శాతం ఓట్లను లభించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. పుతిన్కు పోటీగా బరిలో ఉన్న న్యూ పీపుల్ పార్టీ వ్లాదిస్లవ్ డవాంకోవ్ 4.8 శాతం, మరో అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ ఖరితోనోవ్ 4.1 శాతం, లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్స్కీకి 3.15 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో పుతిన్ విజయం ఏకపక్షంగా సాగిపోయింది.
ఇటీవల అనుమానాస్పద రీతిలో జైలులోనే మృతి చెందిన ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మద్దతు దారులు పుతిన్కు వ్యతిరేకంగా.. నావల్నీకి సానుభూతిగా విస్తృతంగా ప్రచారం చేశారు. వీరికితోడు దీంతో ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్ వ్యతిరేకులు, దివంగత విపక్ష నేత మద్దతుదారులంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పుతిన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే.. ఈ సింపతీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎన్నికలకు ముందు వరకు కూడా పుతిన్ అంటే.. రష్యా నియంత అనే మాట విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
కానీ, పుతిన్తో పోలస్తే.. బలమైన నాయకుడు ఎన్నికల్లో కనిపించకపోవడం, దేశాన్ని కొన్ని విషయాలు మినహా అన్నింటా ముందుకు తీసుకువెళ్లడంలో పుతిన్ బలమైన నేతగా ఎదగడంతో ఆయన విజయం ఏకపక్షంగా మారిపోయింది. రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం పుతిన్ దాదాపు 88 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. మొత్తం 60 దశల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 71 ఏళ్ల పుతిన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
This post was last modified on March 18, 2024 2:12 pm
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన…