Trends

అప్పుడు ఉల్లి.. ఇప్పుడు వెల్లుల్లి.. పొలాల‌కు కెమెరాలు!

గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో ఉల్లిపాయ‌ల ధ‌ర‌లు ఆకాశానికి అంటాయి. కిలో 100 కు చేరుకున్నాయి. అయితే.. ఇప్పుడు నిత్యావ‌స‌రాల్లోముఖ్యంగా కూర‌ల్లో రుచి క‌లిగించే కీల‌క‌మైన వెల్లుల్లిపాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో 550 వ‌ర‌కు చేరుకున్నాయి. దీంతో సాధార‌ణ ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. అయినా.. త‌ప్పదు క‌దా.. అని అంతో ఇంతో కొని.. వాడుతున్నారు. ఈ ధ‌ర‌లు మ‌రో నాలుగు మాసాల వ‌ర‌కు అంటే.. కొత్త పంట చేతికి ఇబ్బడి ముబ్బ‌డిగా వ‌చ్చే వ‌ర‌కు త‌గ్గే ప‌రిస్థితి లేదు.

ఇక‌, సాధార‌ణ నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు జోక్యం చేసుకుని ధ‌ర‌లు త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించే ప్ర‌భుత్వాలు.. సుగంధ ద్ర‌వ్యాల జాబితాలో ఉన్న వెల్ల‌ల్లి ధ‌ర‌ల విష‌యంలో మాత్రం మౌనంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రేటుకు వెల్లుల్లి అమ్ముతున్నారు. తెలంగాణలో 500 రూపాయ‌లు ఉండ‌గా.. ఏపీలో 450రూపాయ‌ల వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. ఇక‌, రాజ‌స్థాన్ స‌హా ఉత్త‌రాది రాష్ట్రాల్లో 600 రూపాయ‌ల వ‌ర‌కు వెల్లుల్లిధ‌ర‌లు ప‌లుకుతున్నాయి.

ఇక‌, గ‌తంలో ఉల్లిపాయ‌లు, ట‌మాటాల‌ దొంగ‌ల వ్య‌వ‌హారం.. వెలుగు చూసిన‌ట్టుగానే ఇప్పుడు వెల్లుల్లి దొంగ‌లు కూడా రెడీ అయ్యారు. దీంతో వెల్లుల్లి రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొంటున్నా రు. మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి కిలో ధర రూ.500 పలుకుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్‌ ప్రాంతంలోని అయిదారు గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు అమర్చుకొన్నారు.

Satya

Recent Posts

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల పూర్తి జాబితా

72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…

4 minutes ago

టాలీవుడ్ ఎక్కడ పొరపాటు చేస్తోంది

బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…

3 hours ago

మహేష్ పుట్టినరోజుకి ఫోటోలు సరిపోవు

వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…

5 hours ago

ప్యాడెడ్, బంప్ బ్రాల కోసం ఒత్తిడి తెచ్చేవాళ్లు – స‌మీరా రెడ్డి

తాను క‌థానాయిక‌గా న‌టించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమ‌ని ఫిలిం మేక‌ర్స్ విప‌రీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్ల‌ని స‌మీరా…

5 hours ago

ప్రధాని మోడీకి కాక్రోచ్ సెగ తగులుతుందా?

దేశ రాజ‌ధాని ఢిల్లీ ప‌రిణామాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రుల‌తో…

5 hours ago

ప్రియాంకా, రాహుల్, రేవంత్ లకు డెత్ డిక్లరేషన్: కేటీఆర్

కొలువులు అడిగితే యువ‌త‌ను పోలీసుల‌తో కొట్టిస్తున్నార‌ని.. కాంగ్రెస్‌కు డెత్ డిక్ల‌రేష‌న్ రాసే స‌మ‌యం వ‌చ్చింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

5 hours ago