Trends

అప్పుడు ఉల్లి.. ఇప్పుడు వెల్లుల్లి.. పొలాల‌కు కెమెరాలు!

గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో ఉల్లిపాయ‌ల ధ‌ర‌లు ఆకాశానికి అంటాయి. కిలో 100 కు చేరుకున్నాయి. అయితే.. ఇప్పుడు నిత్యావ‌స‌రాల్లోముఖ్యంగా కూర‌ల్లో రుచి క‌లిగించే కీల‌క‌మైన వెల్లుల్లిపాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో 550 వ‌ర‌కు చేరుకున్నాయి. దీంతో సాధార‌ణ ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. అయినా.. త‌ప్పదు క‌దా.. అని అంతో ఇంతో కొని.. వాడుతున్నారు. ఈ ధ‌ర‌లు మ‌రో నాలుగు మాసాల వ‌ర‌కు అంటే.. కొత్త పంట చేతికి ఇబ్బడి ముబ్బ‌డిగా వ‌చ్చే వ‌ర‌కు త‌గ్గే ప‌రిస్థితి లేదు.

ఇక‌, సాధార‌ణ నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు జోక్యం చేసుకుని ధ‌ర‌లు త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించే ప్ర‌భుత్వాలు.. సుగంధ ద్ర‌వ్యాల జాబితాలో ఉన్న వెల్ల‌ల్లి ధ‌ర‌ల విష‌యంలో మాత్రం మౌనంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రేటుకు వెల్లుల్లి అమ్ముతున్నారు. తెలంగాణలో 500 రూపాయ‌లు ఉండ‌గా.. ఏపీలో 450రూపాయ‌ల వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. ఇక‌, రాజ‌స్థాన్ స‌హా ఉత్త‌రాది రాష్ట్రాల్లో 600 రూపాయ‌ల వ‌ర‌కు వెల్లుల్లిధ‌ర‌లు ప‌లుకుతున్నాయి.

ఇక‌, గ‌తంలో ఉల్లిపాయ‌లు, ట‌మాటాల‌ దొంగ‌ల వ్య‌వ‌హారం.. వెలుగు చూసిన‌ట్టుగానే ఇప్పుడు వెల్లుల్లి దొంగ‌లు కూడా రెడీ అయ్యారు. దీంతో వెల్లుల్లి రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొంటున్నా రు. మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి కిలో ధర రూ.500 పలుకుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్‌ ప్రాంతంలోని అయిదారు గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు అమర్చుకొన్నారు.

Satya

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

1 hour ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

2 hours ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

3 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

4 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

4 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

4 hours ago