Trends

అప్పుడు ఉల్లి.. ఇప్పుడు వెల్లుల్లి.. పొలాల‌కు కెమెరాలు!

గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో ఉల్లిపాయ‌ల ధ‌ర‌లు ఆకాశానికి అంటాయి. కిలో 100 కు చేరుకున్నాయి. అయితే.. ఇప్పుడు నిత్యావ‌స‌రాల్లోముఖ్యంగా కూర‌ల్లో రుచి క‌లిగించే కీల‌క‌మైన వెల్లుల్లిపాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో 550 వ‌ర‌కు చేరుకున్నాయి. దీంతో సాధార‌ణ ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. అయినా.. త‌ప్పదు క‌దా.. అని అంతో ఇంతో కొని.. వాడుతున్నారు. ఈ ధ‌ర‌లు మ‌రో నాలుగు మాసాల వ‌ర‌కు అంటే.. కొత్త పంట చేతికి ఇబ్బడి ముబ్బ‌డిగా వ‌చ్చే వ‌ర‌కు త‌గ్గే ప‌రిస్థితి లేదు.

ఇక‌, సాధార‌ణ నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు జోక్యం చేసుకుని ధ‌ర‌లు త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించే ప్ర‌భుత్వాలు.. సుగంధ ద్ర‌వ్యాల జాబితాలో ఉన్న వెల్ల‌ల్లి ధ‌ర‌ల విష‌యంలో మాత్రం మౌనంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రేటుకు వెల్లుల్లి అమ్ముతున్నారు. తెలంగాణలో 500 రూపాయ‌లు ఉండ‌గా.. ఏపీలో 450రూపాయ‌ల వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. ఇక‌, రాజ‌స్థాన్ స‌హా ఉత్త‌రాది రాష్ట్రాల్లో 600 రూపాయ‌ల వ‌ర‌కు వెల్లుల్లిధ‌ర‌లు ప‌లుకుతున్నాయి.

ఇక‌, గ‌తంలో ఉల్లిపాయ‌లు, ట‌మాటాల‌ దొంగ‌ల వ్య‌వ‌హారం.. వెలుగు చూసిన‌ట్టుగానే ఇప్పుడు వెల్లుల్లి దొంగ‌లు కూడా రెడీ అయ్యారు. దీంతో వెల్లుల్లి రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొంటున్నా రు. మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి కిలో ధర రూ.500 పలుకుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్‌ ప్రాంతంలోని అయిదారు గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు అమర్చుకొన్నారు.

This post was last modified on February 18, 2024 7:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

1 hour ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

1 hour ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

2 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

5 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

7 hours ago