అయోధ్యలో రామాలయం కోసం ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలు అనుభవించారు. భారీ శపధాలు చేశారు. అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రవీంద్ర గుప్తా ఉదంతం ఈ కోవకే వస్తుంది. అతగాడు అయోద్యలో రాముడి గుడి కోసం భారీ శపధాన్నే తీసుకున్నాడు. అయోధ్యలో రామాలయం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోకూడదని.. బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు.
అందుకుతగ్గట్లే అతను పెళ్లి చేసుకోలేదు. 1992 డిసెంబరు 6న అతను శపధం తీసుున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పెళ్లి చేసుకొని అతను.. ఒంటరిగా ఉండిపోయి బాబాగా మారిపోయాడు. ఇప్పుడు అతన్ని భోజ్ పలి బాబాగా వ్యవహరిస్తుంటారు. తాజాగా రామాలయ నిర్మాణం పూర్తి చేసుకొని.. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో రవీంద్ర గుప్తాకు అయోధ్య ట్రస్టు నుంచి ఆహ్వానం అందింది.
విశ్వహిందూ పరిషత్ లో సభ్యుడిగా ఉన్న రవీంద్ర.. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు తాను పెళ్లి చేసుకోనన్న మాట మీదనే నిలిచారు. తాజాగా మాత్రం రాముడికే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ తరహా భక్తుల్ని గుర్తించి మరీ.. అయోధ్య ట్రస్టు రామాలయ ప్రారంభానికి ఆహ్వానాల్ని పంపుతోంది.
This post was last modified on December 23, 2023 11:16 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…