అయోధ్యలో రామాలయం కోసం ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలు అనుభవించారు. భారీ శపధాలు చేశారు. అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రవీంద్ర గుప్తా ఉదంతం ఈ కోవకే వస్తుంది. అతగాడు అయోద్యలో రాముడి గుడి కోసం భారీ శపధాన్నే తీసుకున్నాడు. అయోధ్యలో రామాలయం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోకూడదని.. బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు.
అందుకుతగ్గట్లే అతను పెళ్లి చేసుకోలేదు. 1992 డిసెంబరు 6న అతను శపధం తీసుున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పెళ్లి చేసుకొని అతను.. ఒంటరిగా ఉండిపోయి బాబాగా మారిపోయాడు. ఇప్పుడు అతన్ని భోజ్ పలి బాబాగా వ్యవహరిస్తుంటారు. తాజాగా రామాలయ నిర్మాణం పూర్తి చేసుకొని.. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో రవీంద్ర గుప్తాకు అయోధ్య ట్రస్టు నుంచి ఆహ్వానం అందింది.
విశ్వహిందూ పరిషత్ లో సభ్యుడిగా ఉన్న రవీంద్ర.. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు తాను పెళ్లి చేసుకోనన్న మాట మీదనే నిలిచారు. తాజాగా మాత్రం రాముడికే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ తరహా భక్తుల్ని గుర్తించి మరీ.. అయోధ్య ట్రస్టు రామాలయ ప్రారంభానికి ఆహ్వానాల్ని పంపుతోంది.
This post was last modified on December 23, 2023 11:16 am
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…