Trends

బ్రహ్మచారి భక్తుడికి అయోధ్య ట్రస్టు ఆహ్వానం

అయోధ్యలో రామాలయం కోసం ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలు అనుభవించారు. భారీ శపధాలు చేశారు. అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రవీంద్ర గుప్తా ఉదంతం ఈ కోవకే వస్తుంది. అతగాడు అయోద్యలో రాముడి గుడి కోసం భారీ శపధాన్నే తీసుకున్నాడు. అయోధ్యలో రామాలయం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోకూడదని.. బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు.

అందుకుతగ్గట్లే అతను పెళ్లి చేసుకోలేదు. 1992 డిసెంబరు 6న అతను శపధం తీసుున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పెళ్లి చేసుకొని అతను.. ఒంటరిగా ఉండిపోయి బాబాగా మారిపోయాడు. ఇప్పుడు అతన్ని భోజ్ పలి బాబాగా వ్యవహరిస్తుంటారు. తాజాగా రామాలయ నిర్మాణం పూర్తి చేసుకొని.. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో రవీంద్ర గుప్తాకు అయోధ్య ట్రస్టు నుంచి ఆహ్వానం అందింది.

విశ్వహిందూ పరిషత్ లో సభ్యుడిగా ఉన్న రవీంద్ర.. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు తాను పెళ్లి చేసుకోనన్న మాట మీదనే నిలిచారు. తాజాగా మాత్రం రాముడికే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ తరహా భక్తుల్ని గుర్తించి మరీ.. అయోధ్య ట్రస్టు రామాలయ ప్రారంభానికి ఆహ్వానాల్ని పంపుతోంది.

This post was last modified on December 23, 2023 11:16 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రియాక్షన్లు గమనిస్తున్నారా పూరి గారూ

నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…

3 mins ago

కల్కి పబ్లిసిటీకి పక్కా ప్రణాళికలు

ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…

2 hours ago

దేవర హుకుమ్ – అనిరుధ్ సలామ్

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…

3 hours ago

ఏపీలో ఎవ‌రు గెలుస్తున్నారు? కేటీఆర్ స‌మాధానం ఇదే!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. తాజాగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితంపై స్పందించారు. ఇంకా ఫ‌లితం…

8 hours ago

సీఎం జ‌గ‌న్ ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం..!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉంటే తాడేప‌ల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజ‌శ్యామల యాగం నిర్వ‌హించారు. అయితే.. ఇది 41 రోజుల…

14 hours ago

కాయ్ రాజా కాయ్ : లక్షకు 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…

15 hours ago