యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ను భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ పండితులు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగు పెట్టి ఇప్పటికే బోలెడన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఐపీఎల్లోనూ పరుగుల వరద పారించాడు. క్రికెటర్గా చాలా పద్ధతి, క్రమశిక్షణతో కనిపించే శుభ్మన్ గిల్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే కమిట్ అయిపోయాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది.
సచిన్ కూతురు సారాతో అతను ప్రేమలో ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ అదే సమయంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్తో కూడా అతడికి లింక్ కలుపుతుంటారు. వీళ్లిద్దరూ దుబాయ్లో ఒక రెస్టారెంట్లో కనిపించడమే అందుక్కారణం. అందరూ సచిన్ తనయురాలు సారాతో శుభ్మన్ ప్రేమలో ఉన్నాడనుకుంటున్న సమయంలోనే ఆ ఫొటో వైరల్ అయింది.
ఐతే కాఫీ విత్ కరణ్ షోకు అతిథిగా వచ్చిన సారా అలీ ఖాన్.. శుభ్మన్తో ఎఫైర్ గురించి జరిగే ప్రచారంపై మాట్లాడింది. ఆమె సింపుల్గా ఆ సారా నేను కాదు.. అని చెప్పడం విశేషం. శుభ్మన్ గిల్తో నువ్వు డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దానిపై నీ అభిప్రాయం ఏంటి అని కరణ్ అడగ్గా.. ‘‘సారా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం మొత్తం రాంగ్ సారా వెనుక పడుతోంది’’ అని సారా అలీ ఖాన్ అంది.
తనకు, శుభ్మన్కు మధ్య ఏమీ లేదని చెబుతూనే.. అతను సచిన్ కూతురు సారాతో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పకనే చెప్పింది సారా అలీ ఖాన్. సచిన్ కూతురు గురించి పరోక్షంగా మాట్లాడాలన్నా చాలా ఆలోచించాల్సిందే. ఆమె మాటల్ని బట్టి చూస్తే శుభ్మన్, సారా టెండూల్కర్ నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుకోవాలి. ఇటీవల ప్రపంచకప్ మ్యాచ్లకు కూడా సారా హాజరవడం.. శుభ్మన్ ఇన్నింగ్స్లు చూస్తూ ఉత్సాహంగా కనిపించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 8, 2023 3:05 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…