Trends

ప్రపంచకప్ ఆటగాడు.. హాస్పిటల్ బెడ్డుపై

శుభ్‌మన్ గిల్.. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు కీలకం అవుతాడనుకున్న ఆటగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ‌తో కలిసి అతనే చాలా రోజులుగా వన్డేల్లో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తున్నాడు. నిలకడగా రాణిస్తూ, భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అతను అభిమానుల మనసు గెలిచాడు. కెరీర్లో తక్కువ వ్యవధిలోనే అతను డబుల్ సెంచరీ ఘనతను కూడా అందుకున్నాడు. ప్రపంచకప్‌లో అతడి మీద జట్టు, అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దురదృష్టం అతణ్ని వెంటాడింది.

ప్రపంచకప్ ఆరంభం కాబోతుండగా.. అతను అనారోగ్యం పాలయ్యాడు. జ్వరం వస్తే ఒకట్రెండు రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడనుకున్నారు. కానీ అది మామూలు జ్వరం కాదని, డెంగీ అని తర్వాత తేలింది. దీంతో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడలేకపోయాడు. బుధవారం అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌కూ దూరమయ్యాడు.

కనీసం శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కైనా అందుబాటులోకి వస్తాడేమో అనుకుంటే అలాంటి సంకేతాలే కనిపించడం లేదు. డెంగీ తీవ్రత పెరిగి.. అతడికి ప్లేట్‌లెట్స్ కూడా తగ్గిపోయాయి. ఓవైపు చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత జట్టంతా ఢిల్లీకి వెళ్లిపోతే.. శుభ్‌మన్ మాత్రం ఆ సిటీలోనే ఉండిపోయాడు. ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో శుభ్‌మన్‌ను ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో ఉంటే డెంగీ అంత ప్రమాదకరం కాదు కానీ.. కోలుకోవడానికి మాత్రం సమయం పడుతుంది.

ప్రపంచకప్‌లో జట్టుతో పాటు ఉండాల్సిన వాడు.. ఇలా ఆసుపత్రి బెడ్డు మీదికి వెళ్లడం పట్ల అభిమానులు అయ్యో అనుకుంటున్నారు. డెంగీ తీవ్రత దృష్ట్యా శుభ్‌మన్‌కు ప్రత్యామ్నాయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. గిల్ కోలుకోవడం ఆలస్యం అయితే రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్‌లో ఒకరిని జట్టులోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తోందట బీసీసీఐ.

This post was last modified on October 10, 2023 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago