సోషల్ మీడియాలో తాము ఫేమస్ కావాలన్న తపనతో కొందరు చేస్తున్న అతి.. కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ముందువెనుకా చూసుకోకుండా వారు చేసే పనులకు.. వారి మాయలో పడిన అధికారులకు దిమ్మ తిరిగే షాకులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటిదే పంజాబ్ లో చోటు చేసుకుంది.
ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన పనికి ఒక పోలీసు అధికారి మీద వేటు పడింది. అతగాడిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో సదరు అధికారిని నిందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత ఇన్ స్టా ఇన్ ఫ్లెయెన్సర్ అయితే మాత్రం.. తమ వద్దకు వచ్చిన ప్రతి దానికి ఓకే అనటం సరికాదు. ఇన్ స్టాలో రెగ్యులర్ గా రీల్స్ చేసే ఒక యువతి జలందర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి.. పోలీసుల వాహనాన్ని తన తాజా రీల్ కోసం వాడేసింది.
పోలీసు వాహనం బాయినెట్ మీద విలాసంగా కూర్చున్న ఆ యువతి.. పాపులర్ పంజాబీ బీట్ ఘయింట్ జట్టికి డ్యాన్స్ స్టెప్పులు వేసింది. ఈ క్రమంలో ఆమె హావభావాల మీద విమర్శలు వెల్లువెత్తాయి. తాను పాపులర్ కావటం కోసం పోలీసు జీపును వాడుకోవటానికి అనుమతిచ్చిన అధికారుల తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది. తన వీడియో చివర్లో సదరు యువతితో పాటు పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి కూడా ఉండటం.. వారి మధ్యన ఏదో సంభాషణ జరగటం.. చివర్లో ఆమె నవ్వుతూ వాహనంలోకి ఎక్కటంతో వీడియో ముగుస్తోంది.
ఈ వీడియో వైరల్ కావటం.. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు.. జలంధర్ స్టేషన్ హౌస్ అధికారి అశోక్ శర్మను సస్పెండ్ చేస్తూ జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక అంశాలకు బదులుగా.. షోకు కోసం చేసే ఈ తరహా పనులకు ఈ మాత్రం మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.
This post was last modified on September 30, 2023 10:49 am
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…