సోషల్ మీడియాలో తాము ఫేమస్ కావాలన్న తపనతో కొందరు చేస్తున్న అతి.. కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ముందువెనుకా చూసుకోకుండా వారు చేసే పనులకు.. వారి మాయలో పడిన అధికారులకు దిమ్మ తిరిగే షాకులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటిదే పంజాబ్ లో చోటు చేసుకుంది.
ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన పనికి ఒక పోలీసు అధికారి మీద వేటు పడింది. అతగాడిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో సదరు అధికారిని నిందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత ఇన్ స్టా ఇన్ ఫ్లెయెన్సర్ అయితే మాత్రం.. తమ వద్దకు వచ్చిన ప్రతి దానికి ఓకే అనటం సరికాదు. ఇన్ స్టాలో రెగ్యులర్ గా రీల్స్ చేసే ఒక యువతి జలందర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి.. పోలీసుల వాహనాన్ని తన తాజా రీల్ కోసం వాడేసింది.
పోలీసు వాహనం బాయినెట్ మీద విలాసంగా కూర్చున్న ఆ యువతి.. పాపులర్ పంజాబీ బీట్ ఘయింట్ జట్టికి డ్యాన్స్ స్టెప్పులు వేసింది. ఈ క్రమంలో ఆమె హావభావాల మీద విమర్శలు వెల్లువెత్తాయి. తాను పాపులర్ కావటం కోసం పోలీసు జీపును వాడుకోవటానికి అనుమతిచ్చిన అధికారుల తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది. తన వీడియో చివర్లో సదరు యువతితో పాటు పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి కూడా ఉండటం.. వారి మధ్యన ఏదో సంభాషణ జరగటం.. చివర్లో ఆమె నవ్వుతూ వాహనంలోకి ఎక్కటంతో వీడియో ముగుస్తోంది.
ఈ వీడియో వైరల్ కావటం.. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు.. జలంధర్ స్టేషన్ హౌస్ అధికారి అశోక్ శర్మను సస్పెండ్ చేస్తూ జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక అంశాలకు బదులుగా.. షోకు కోసం చేసే ఈ తరహా పనులకు ఈ మాత్రం మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.
This post was last modified on September 30, 2023 10:49 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…