Trends

కరోనాతో అతడి ఆస్తి రూ.1.02లక్షల కోట్లకు పెరిగింది

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా నష్టపోయారు. అన్ని వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అపర కుబేరులన్న వారికి సైతం లక్షల కోట్ల రూపాయిల్లో నష్టం వాటిల్లింది. రోజుల వ్యవధిలో వారి షేర్ల విలువలు భారీగా పతనమయ్యాయి.

మొత్తంగా చూస్తే.. కరోనా ఎపిసోడ్ లో ప్రభావానికి గురి కాని రంగమే లేకుండా పోయింది. ఇలాంటివేళలోనూ కొందరు సుడిగాళ్లు ఉన్న విషయం సింగపూర్ కు చెందిన ఒక పారిశ్రామికవేత్తను చూస్తే అర్థమవుతుంది.

అందరిని ఆర్పేసిన కరోనా.. అందుకు భిన్నంగా ఇతగాడి సుడి మొత్తాన్ని మార్చేసింది. ఇంతకూ అతనే వ్యాపారం చేస్తాడన్న విషయంలోకి వెళితే.. లి జిటింగ్ కోసమే కరోనా వచ్చిందా? అన్న భావన కలుగక మానదు. షెంజెన్ మైండ్ రే బయో మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న ఆయన పుట్టింది చైనాలోనే అయినా.. తర్వాతి కాలంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని సింగపూర్ కు మార్చేశాడు. కరోనా పుణ్యమా అని అతగాడి కంపెనీ షేర్ ధరలు భారీగా పెరిగిపోయాయి.

ఎందుకంటే.. ఆయన కంపెనీ తయారు చేసేది వెంటిలేటర్లు.. వైద్య పరికరాలు. కరోనా వేళ.. వీటికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దీంతో.. ఆయన వ్యాపారం మూడు వెంటిలేటర్లు.. ఆరు వైద్య పరికరాలుగా మారిపోయింది. కరోనా ముందు వరకు ఆయన నికర సంపద విలువ రూ.32,777 కోట్లుగా ఉండేది. కరోనా పుణ్యమా అని ఆయన కంపెనీ షేరు విలువ అంతకంతకూ పెరిగిపోయింది.

దీంతో.. ఇప్పుడాయన నికర సంపద విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.1.02 లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది అతగాడు ప్రతి రోజు రూ.287 కోట్లు చొప్పున సంపాదించాడు. అంటే.. గంటకు రూ.12 కోట్లు అతడి సంపాదన. కరోనా వేళ.. ప్రపంచంలో అత్యంత వేగంగా సంపన్నుడిగా మారిపోయిన పారిశ్రామికవేత్త లి జిటింగే.

కరోనా పుణ్యమా అని షెంజెన్ మైండ్ రే కంపెనీకి వందకు పైగా దేశాల నుంచి వెంటిలేటర్లు.. వైద్య పరికరాల కోసం భారీగా ఆర్డర్లు వచ్చాయట. ఒక్క ఇటలీ నుంచే ఈ కంపెనీకి పదివేల వెంటిలేటర్ల ఆర్డర్ రావటం చూస్తే.. అతగాడి వ్యాపారం ఏం ధూంధాంగా మారిందో అర్థమైపోతుంది.

This post was last modified on April 25, 2020 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

6 hours ago