Trends

మే నెలాఖరుకు దేశంలో 4 కోట్ల మొబైళ్లు మటాష్?

కరోనా తీసుకొస్తున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. తమ జీవితకాలంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కలలో కూడా ఊహించని ఎన్నో సమస్యలు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. చేతిలో మొబైల్ ఫోన్లు లేని జీవితాన్ని ఊహించలేం.

స్మార్ట్ ఫోన్ రంగ ప్రవేశంతో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వేళలో జనాలకు బోర్ కొట్టకుండా అంతో ఇంతో టైం పాస్ అంటే మొబైల్ ఫోన్ తోనే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

అలాంటి మొబైల్ ఫోన్లకు ముప్పు ఉన్న విషయం ఒకటి బయటకు వచ్చింది. దేశంలో ఇప్పుడున్నట్లే లాక్ డౌన్ కంటిన్యూ అయితే.. దేశంలో మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో నాలుగు కోట్ల మంది చేతుల్లో ఉండే ఫోన్లు మే నెలాఖరుకు కనిపించకపోవచ్చని చెబుతోంది ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్.

హ్యాండ్ సెట్లలో తలెత్తే లోపాలు.. బ్రేక్ డౌన్ వల్ల అవి వాడే పరిస్థితులు ఉండకపోవచ్చని చెబుతోంది. ఫోన్లు.. వాటి విడి భాగాల విక్రమాల మీద ఇప్పుడున్న ఆంక్షలు కంటిన్యూ అయితే.. కోట్లాది ఫోన్లు పని చేయకపోవచ్చని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ సాగుతున్న వేళలో ప్రస్తుతం 2.5 కోట్ల మందికి పైనే వినియోగదారుల ఫోన్లు వాడకానికి వీల్లేని రీతిలో ఉన్నాయని చెబుతున్నారు.

దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని.. సరాసరిన నెలకు 2.5 కోట్ల మొబైల్ ఫోన్ల అమ్మకాలు ఉంటాయని చెబుతున్నారు. అదే పనిగా వాడకంతో పాటు.. వాటిలో తలెల్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి షాపులు మూసి ఉండటం కారణం ఫోన్లు పని చేయని పరిస్థితులు అంతకంతకూ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎందుకైనా మంచిది లాక్ డౌన్ ముగిసే వరకూ మీ ఫోన్ ను కాస్త జాగ్రత్తగా వాడండి.

This post was last modified on April 25, 2020 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

8 minutes ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

2 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

4 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

4 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

5 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

5 hours ago