కరోనా తీసుకొస్తున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. తమ జీవితకాలంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కలలో కూడా ఊహించని ఎన్నో సమస్యలు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. చేతిలో మొబైల్ ఫోన్లు లేని జీవితాన్ని ఊహించలేం.
స్మార్ట్ ఫోన్ రంగ ప్రవేశంతో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వేళలో జనాలకు బోర్ కొట్టకుండా అంతో ఇంతో టైం పాస్ అంటే మొబైల్ ఫోన్ తోనే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
అలాంటి మొబైల్ ఫోన్లకు ముప్పు ఉన్న విషయం ఒకటి బయటకు వచ్చింది. దేశంలో ఇప్పుడున్నట్లే లాక్ డౌన్ కంటిన్యూ అయితే.. దేశంలో మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో నాలుగు కోట్ల మంది చేతుల్లో ఉండే ఫోన్లు మే నెలాఖరుకు కనిపించకపోవచ్చని చెబుతోంది ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్.
హ్యాండ్ సెట్లలో తలెత్తే లోపాలు.. బ్రేక్ డౌన్ వల్ల అవి వాడే పరిస్థితులు ఉండకపోవచ్చని చెబుతోంది. ఫోన్లు.. వాటి విడి భాగాల విక్రమాల మీద ఇప్పుడున్న ఆంక్షలు కంటిన్యూ అయితే.. కోట్లాది ఫోన్లు పని చేయకపోవచ్చని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ సాగుతున్న వేళలో ప్రస్తుతం 2.5 కోట్ల మందికి పైనే వినియోగదారుల ఫోన్లు వాడకానికి వీల్లేని రీతిలో ఉన్నాయని చెబుతున్నారు.
దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని.. సరాసరిన నెలకు 2.5 కోట్ల మొబైల్ ఫోన్ల అమ్మకాలు ఉంటాయని చెబుతున్నారు. అదే పనిగా వాడకంతో పాటు.. వాటిలో తలెల్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి షాపులు మూసి ఉండటం కారణం ఫోన్లు పని చేయని పరిస్థితులు అంతకంతకూ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎందుకైనా మంచిది లాక్ డౌన్ ముగిసే వరకూ మీ ఫోన్ ను కాస్త జాగ్రత్తగా వాడండి.
This post was last modified on April 25, 2020 12:21 pm
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…