రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలానే రైళ్లు నడిచినా.. విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. విశాఖపట్నం వెళ్లే వారు కానీ.. విశాఖ నుంచి హైదరాబాద్ వద్దామని అనుకునే వారు కానీ.. తొలుత వెతికేది గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో బెర్తు దొరుకుతుందా? అంటే అతిశయోక్తి కాదు. అంతలా కనెక్టు అయ్యే గోదావరి ఎక్స్ ప్రెస్ లో తాజాగా ప్రయాణికులు హడలిపోయే ఉదంతం చోటు చేసుకుంది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న గోదావరి (ట్రైన్ నెంబరు 12728)ఎక్స్ ప్రెస్ లోని ఏసీ కోచ్ నుంచి పొగలు రావటంతో ప్రయాణికులు టెన్షన్ పడిపోయారు. అనూహ్యంగా వస్తున్న పొగలతో ఒక్కసారిగా హడలిపోయిన వారు.. కాసేపటికి హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకున్నారు. ఖమ్మం – విజయవాడ మధ్యలోని బోనకల్ స్టేషన్ వద్ద ఏసీ బోగీలోని ప్యానల్ నుంచి పొగలు రావటం మొదలైంది. వెంటనే గుర్తించిన ప్రయాణికులు.. సిబ్బందిని అలెర్టు చేశారు. ఆదివారం రాత్రి 10.15 గంటల వేళలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
వెంటనే స్పందించిన సిబ్బంది.. రైలును ఆపేశారు. పొగలు ఎందుకు వస్తున్నాయని చెక్ చేయగా.. థర్డ్ ఏసీ బోగీ (బీ4)లోని ఏసీ కంట్రోల్ ప్యానల్ లో ఎలుక దూరింది. దీంతో.. పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించి.. వెంటనే సరి చేశారు. దీంతో.. అప్పటివరకు తెగ టెన్షన్ పడిపోయిన ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఎలుక ఎంత పని చేసిందని తమ టెన్షన్ కు నవ్వుకుండిపోయారు. మొత్తానికి ఆడుతూ పాడుతూ సినిమాలో ఎలుక బస్సులో దూరి సునీల్ ను తిప్పలు పెట్టినట్టు ఈ ఎలుక గోదావరిని తిప్పలు పెట్టింది.
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…