ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి ఆయన ప్రయాణించే వాహనాల సముదాయానికి తన కారును అడ్డంగా పెట్టేసిన ఒక వ్యక్తి వైనం ఆసక్తికరంగా మారితే.. అందుకు ఆ ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా.. పిలిపించుకొని.. సదరు వ్యక్తిని శాంతపరిచిన ఈ ఉదంతం ఇప్పుడు వార్తాంశంగా మారింది. అయితే.. ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవకాశమే లేదన్నది మర్చిపోకూడదు. కాకుంటే తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉండే కర్ణాటకలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
ప్రముఖుల నివాసాలకు పక్కన ఉండే వారికి ఎదురయ్యే తిప్పలు అన్ని ఇన్ని కావు. కర్ణాటకకు మరోమారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సిద్ధరామయ్య బెంగళూరు కుమార క్రప మార్గంలో నివాసం ఉంటారు. ఆయన ఇంటి పక్కనే పురుషోత్తమ్ అనే వ్యక్తి నివాసం ఉంటారు. అయితే.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సిద్ధూను కలిసేందుకు పొద్దున్నే వచ్చేసే వారంతా.. తమ వాహనాల్ని పురుషోత్తం ఇంటి ముందు పెట్టేస్తుంటారు.
దీంతో.. ఆయన తెగ ఇబ్బందికి గురవుతుంటారు. ఒక రోజు తన కారును బయటకు తీసేందుకు కూడా ఛాన్స్ లేకుండా కార్లను అడ్డంగా పెట్టేశారు. దీంతో.. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేని ఆయన చిర్రెత్తి సరిగ్గా సీఎం బయలుదేరే వేళ చూసుకొని.. తన కారును తీసుకొచ్చి కాన్వాయ్ కు అడ్డుగా పెట్టేశారు. దీంతో.. ఆ వాహనాన్ని పక్కకు తీసేయాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినలేదు.
అనూహ్యంగా ఏర్పడిన లొల్లితో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్దూ.. సదరు పక్కింటాయనను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆయనకు ఎదరవుతున్న అసౌకర్యం గురించి తెలుసుకొని.. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చిన తర్వాతే పురుషోత్తం తన వాహనాన్ని అడ్డుతీయటం గమనార్హం. అదే..తెలుగు రాష్ట్రాల్లో అయితే.. సదరు కారు ఎక్కడికో వెళ్లిపోయేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on July 29, 2023 10:17 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…