Trends

కొత్త ఆశలు పుట్టిస్తున్న రికవరీ రేటు

క్యాలెండర్ లో తేదీలు మారుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం వచ్చేస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్2.0 నడుస్తోంది. దేశంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్ని చూస్తుంటే.. రానున్న రోజుల్లోనూ పరిస్థితిలో మార్పు వెంటనే వచ్చేస్తుందన్న ఆశ ఎవరికి లేదు.

కరోనాను అంటించుకోవటం సులువే కానీ.. వదిలించుకోవటం ఎంత కష్టమన్న విషయం ప్రపంచానికే అర్థమైంది. ఇలాంటివేళ.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆశావాహకంగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో వైరస్ విస్తరణ పెరుగుతోంది. ఇలాంటి కష్టకాలంలో అంతో ఇంతో ఊరటనిచ్చే అంశం ఏమైనా ఉందంటే అది.. రికవరీ రేటుగా చెప్పాలి.

పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి భారత్ ముందున్న విషయాన్ని తాజాగా కేంద్రం ప్రకటించింది. కరోనా విసిరే సవాళ్లను ఎప్పటికప్పుడు ఎదుర్కోవటమే కాదు.. అప్పటికున్న పరిస్థితులకు అనుగుణంగా స్పందించే విషయంలో మిగిలిన వారితో పోలిస్తే మనం బాగున్నట్లుగా చెప్పుకొచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 20 శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు.

దేశంలో కరోనా కేసుల పెరుగుదల భారీగా లేదని.. గడిచిన ముప్ఫై రోజుల్లో వైరస్ ను కట్టడి చేయటంలో దేశం విజయం సాధించినట్లుగా చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ నిర్ణయంతో మంచే జరిగిందని పేర్కొంది. మార్చి 23 నాటికి దేశంలో 400 కేసులు నమోదు కాగా.. నెల రోజుల వ్యవధిలో ఈ సంఖ్య 20వేలకు చేరింది. ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు.

ఊరటనిచ్చే అంశం ఏమంటే.. గడిచిన పద్నాలుగు రోజుల్లో దేశంలోని 78 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవటం విశేషం. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి దేశంలో బాగుందన్న మాట వినిపిస్తోంది. కరోనా బాధితుల్లో 20 శాతం మంది కోలుకున్న వైనాన్ని పేర్కొన్నారు.

కరోనా ముప్పును ముందే గుర్తించిన కేంద్రం లాక్ డౌన్ నిర్ణయాన్ని సమయానికి అనుగుణంగా తీసుకోవటం లాభంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. కరోనా కష్టకాలంలో సానుకూల అంశం చోటు చేసుకోవటం దేశ ప్రజలకు ఊరటనిస్తుందని చెప్పక తప్పదు.

This post was last modified on April 24, 2020 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

8 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

34 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago