పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు అందరూ ఊహించినట్టే బ్రో టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఇందాకా అఫీషియల్ గా లాంచ్ చేసిన మోషన్ పోస్టర్ వీడియోలో పవన్ కళ్యాణ్ నిలుచుని రెండు చేతులు చాపి స్టయిలిష్ గా కిందకు చూసే స్టిల్ ని అందులో పొందుపరిచారు. టైటిల్ రోల్ పవన్ దే కాబట్టి ఈ బిట్ లో తేజుకు చోటు దక్కలేదు.
బ్యాక్ గ్రౌండ్ లో శివ దర్శనంతో పాటు తమన్ స్వరపరిచిన స్తోత్రంలో బ్రో సౌండ్ ని హైలైట్ చేస్తూ సంస్కృత శ్లోకాన్ని పఠించడం కొత్తగా ఉంది. మొత్తానికి బ్రో డిఫరెంట్ గా ఉండబోతున్నాడన్న సంకేతం దీని ద్వారా ఇచ్చారు. తొలుత కాలభైరవ టైటిల్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఏవో కారణాల వల్ల ఫైనల్ బ్రో వైపే యూనిట్ మొగ్గు చూపింది.
ఫ్యాన్స్ నుంచి ముందు దీనికి మిశ్రమ స్పందన దక్కినప్పటికీ వినగా వినగా ఇదే క్యాచీగా మారే ఛాన్స్ లేకపోలేదు. పైగా ఒక్క అక్షరమే కాబట్టి బయట రాష్ట్రాల్లో కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇలా సింగల్ తెలుగు అక్షరంతో పవన్ నటించిన మొదటి సినిమా ఇదే. ఇంగ్లీష్ లో మాత్రం మూడు ఆల్ఫాబెట్స్ వస్తాయి . త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చారు. వినోదయ సితం రీమేక్ గా రూపొందుతున్న బ్రోలో పవన్ కళ్యాణ్ పాత్ర కాలాన్ని శాసించే దైవం రూపంలో ఉంటుంది.
ఒక మధ్యతరగతి ఉద్యోగి జీవితంలో ప్రవేశించిన ఇతన్ని సాయి తేజ్ పాత్ర బ్రో అని పిలుస్తాడు. అసలు వీళ్లిద్దరూ ఎందుకు కలుసుకున్నారు విధి ఆడిన వింత ఆటలో ఎవరి పాత్ర ఎంత లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా బ్రో విడుదల కానుంది. పవన్ కి హీరోయిన్ ఉండని రెండో సినిమా ఇది. గోపాల గోపాల ఫార్మాట్ నే బ్రోకు ఫాలో కాబోతున్నారు. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ల నుంచి అభిమానుల ఫోకస్ బ్రో పైకి వెళ్లనుంది
This post was last modified on May 18, 2023 5:36 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…