Trends

పెళ్లి పత్రికల్ని పంచేందుకు హెలికాఫ్టర్ వాడిన హైదరాబాదీ

చాలా మందికి డబ్బులు ఉంటాయి. కానీ.. వాటిని వినియోగించే విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. అందరు నడిచిన బాటలో నడవకుండా.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించేటోళ్లు కొందరు ఉంటారు. ఒక హైదరాబాదీ చేసిన క్రేజీ పనితో సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్లోని ఖైరతాబాద్ కు చెందిన మధు యాదవ్ కాస్తంత సౌండ్ పార్టీ. అతడు దూద్ వాలా డైరీని నిర్వహిస్తుంటాడు. అతడి సోదరుడి పెళ్లి ఫిక్సు అయ్యింది. ఈ నెల 9న జరిగే పెళ్లికి జరుగుతున్న పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. చేయాల్సిన పనులు చాలానే పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి వేళలోనే పెద్ద ఇబ్బందిగా మారింది పెళ్లి పత్రికల పంపిణీ కార్యక్రమం. తమ బంధువులు పలువురు ముంబయిలో ఉండటం.. అంత దూరాన వెళ్లి ఇవ్వటానికి చాలా టైం తీసుకునే వీలు ఉండటంతో.. మిగిలిన వారి మాదిరి వాట్సాప్ లో పెళ్లి పత్రికల్ని పంపకుండా కాస్త భిన్నంగా ఆలోచించాడు.

హెలికాఫ్టర్ ను అద్డెకు తీసుకొని.. హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లి వచ్చాడు. ముంబయికి చేరుకొని బంధువుల ఇళ్లకు వెళ్లి.. స్వయంగా పెళ్లి కార్డులు ఇచ్చి తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన వివరాలుబయటకు రావటంతో సోదరుడు పెళ్లి కార్డుల్ని పంచటం కోసం ఏకంగా హెలికాప్టర్ నే బుక్ చేశాడా? అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో.. ఇతగాడుస్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. పనిలో పనిగా తాను చేసిన పనిని సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. అది కాస్తా వైరల్ గా మారింది. ఇప్పుడు చెప్పండి.. డబ్బులు ఉంటేనే సరిపోతుందా? దాన్ని కళాత్మకంగా ఖర్చు పెట్టే ఆర్ట్ కూడా ఉండాలనిపించట్లేదు?

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago