Trends

ఐఫోన్.. మేడిన్ ఇండియా.. తయారీ ఎక్కడంటే?

మొబైల్ ఫోన్లు ఎన్ని ఉంటే మాత్రం.. ఐఫోన్ తర్వాతే ఏదైనా. ఖరీదైన ఐఫోన్ చేతిలో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ వేరుగా ఉంటాయని చెబుతారు. దేశంలో కోట్లాది ఐ ఫోన్ మొబైళ్లు అమ్మడవుతున్నా.. అవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవని.. దేశీయంగా తయారు చేసిన ఐఫోన్లు ప్రజల చేతికి రాబోతున్నాయి. ఈ శుభవార్తను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా వెల్లడించారు.

2019లో ఐఫోన్ ఎక్స్ ఆర్ మోడల్ అసెంబ్లింగ్ యూనిట్ ను షురూ చేసింది. బెంగళూరుకు సమీపంలోని ఫ్లాంట్ సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఐఫోన్ 11ను తయారీకి సంబంధించి దేశంలో కొత్త ప్లాంట్ రెఢీ అయ్యింది. ఈ లక్కీ ఛాన్సును ఏపీకి పొరుగునే ఉండే తమిళనాడు సొంతం చేసుకుంది.

అమెరికా – చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఐఫోన్ భారత్ లో ఉత్పత్తి షురూ చేయాలని డిసైడ్ చేయటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇన్నాళ్లకు ఐఫోన్ మేడిన్ ఇండియానే కాదు.. మేకిన్ తమిళనాడు అన్న ట్యాగ్ లైన్ ఐఫోన్ కు యాడ్ కానుంది.

ఇప్పటికే దేశంలో పలు మొబైల్ ఫోన్ల కంపెనీలు భారత్ లో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే శాంసంగ్.. షావోమి కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాయి. యాపిల్ లాంటి దిగ్గజ సంస్థ తమిళనాడుకు వస్తున్న వైనం ఆ రాష్ట్ర వాసులకే కాదు.. దేశ వాసులకు సైతం స్వీట్ న్యూస్ గా చెప్పక తప్పదు.

This post was last modified on July 26, 2020 9:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

6 minutes ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

1 hour ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

3 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago