మొబైల్ ఫోన్లు ఎన్ని ఉంటే మాత్రం.. ఐఫోన్ తర్వాతే ఏదైనా. ఖరీదైన ఐఫోన్ చేతిలో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ వేరుగా ఉంటాయని చెబుతారు. దేశంలో కోట్లాది ఐ ఫోన్ మొబైళ్లు అమ్మడవుతున్నా.. అవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవని.. దేశీయంగా తయారు చేసిన ఐఫోన్లు ప్రజల చేతికి రాబోతున్నాయి. ఈ శుభవార్తను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా వెల్లడించారు.
2019లో ఐఫోన్ ఎక్స్ ఆర్ మోడల్ అసెంబ్లింగ్ యూనిట్ ను షురూ చేసింది. బెంగళూరుకు సమీపంలోని ఫ్లాంట్ సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఐఫోన్ 11ను తయారీకి సంబంధించి దేశంలో కొత్త ప్లాంట్ రెఢీ అయ్యింది. ఈ లక్కీ ఛాన్సును ఏపీకి పొరుగునే ఉండే తమిళనాడు సొంతం చేసుకుంది.
అమెరికా – చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఐఫోన్ భారత్ లో ఉత్పత్తి షురూ చేయాలని డిసైడ్ చేయటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇన్నాళ్లకు ఐఫోన్ మేడిన్ ఇండియానే కాదు.. మేకిన్ తమిళనాడు అన్న ట్యాగ్ లైన్ ఐఫోన్ కు యాడ్ కానుంది.
ఇప్పటికే దేశంలో పలు మొబైల్ ఫోన్ల కంపెనీలు భారత్ లో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే శాంసంగ్.. షావోమి కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాయి. యాపిల్ లాంటి దిగ్గజ సంస్థ తమిళనాడుకు వస్తున్న వైనం ఆ రాష్ట్ర వాసులకే కాదు.. దేశ వాసులకు సైతం స్వీట్ న్యూస్ గా చెప్పక తప్పదు.
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…