మొబైల్ ఫోన్లు ఎన్ని ఉంటే మాత్రం.. ఐఫోన్ తర్వాతే ఏదైనా. ఖరీదైన ఐఫోన్ చేతిలో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ వేరుగా ఉంటాయని చెబుతారు. దేశంలో కోట్లాది ఐ ఫోన్ మొబైళ్లు అమ్మడవుతున్నా.. అవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవని.. దేశీయంగా తయారు చేసిన ఐఫోన్లు ప్రజల చేతికి రాబోతున్నాయి. ఈ శుభవార్తను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా వెల్లడించారు.
2019లో ఐఫోన్ ఎక్స్ ఆర్ మోడల్ అసెంబ్లింగ్ యూనిట్ ను షురూ చేసింది. బెంగళూరుకు సమీపంలోని ఫ్లాంట్ సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఐఫోన్ 11ను తయారీకి సంబంధించి దేశంలో కొత్త ప్లాంట్ రెఢీ అయ్యింది. ఈ లక్కీ ఛాన్సును ఏపీకి పొరుగునే ఉండే తమిళనాడు సొంతం చేసుకుంది.
అమెరికా – చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఐఫోన్ భారత్ లో ఉత్పత్తి షురూ చేయాలని డిసైడ్ చేయటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇన్నాళ్లకు ఐఫోన్ మేడిన్ ఇండియానే కాదు.. మేకిన్ తమిళనాడు అన్న ట్యాగ్ లైన్ ఐఫోన్ కు యాడ్ కానుంది.
ఇప్పటికే దేశంలో పలు మొబైల్ ఫోన్ల కంపెనీలు భారత్ లో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే శాంసంగ్.. షావోమి కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాయి. యాపిల్ లాంటి దిగ్గజ సంస్థ తమిళనాడుకు వస్తున్న వైనం ఆ రాష్ట్ర వాసులకే కాదు.. దేశ వాసులకు సైతం స్వీట్ న్యూస్ గా చెప్పక తప్పదు.
This post was last modified on July 26, 2020 9:23 pm
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…