మొబైల్ ఫోన్లు ఎన్ని ఉంటే మాత్రం.. ఐఫోన్ తర్వాతే ఏదైనా. ఖరీదైన ఐఫోన్ చేతిలో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ వేరుగా ఉంటాయని చెబుతారు. దేశంలో కోట్లాది ఐ ఫోన్ మొబైళ్లు అమ్మడవుతున్నా.. అవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవని.. దేశీయంగా తయారు చేసిన ఐఫోన్లు ప్రజల చేతికి రాబోతున్నాయి. ఈ శుభవార్తను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా వెల్లడించారు.
2019లో ఐఫోన్ ఎక్స్ ఆర్ మోడల్ అసెంబ్లింగ్ యూనిట్ ను షురూ చేసింది. బెంగళూరుకు సమీపంలోని ఫ్లాంట్ సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఐఫోన్ 11ను తయారీకి సంబంధించి దేశంలో కొత్త ప్లాంట్ రెఢీ అయ్యింది. ఈ లక్కీ ఛాన్సును ఏపీకి పొరుగునే ఉండే తమిళనాడు సొంతం చేసుకుంది.
అమెరికా – చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఐఫోన్ భారత్ లో ఉత్పత్తి షురూ చేయాలని డిసైడ్ చేయటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇన్నాళ్లకు ఐఫోన్ మేడిన్ ఇండియానే కాదు.. మేకిన్ తమిళనాడు అన్న ట్యాగ్ లైన్ ఐఫోన్ కు యాడ్ కానుంది.
ఇప్పటికే దేశంలో పలు మొబైల్ ఫోన్ల కంపెనీలు భారత్ లో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే శాంసంగ్.. షావోమి కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాయి. యాపిల్ లాంటి దిగ్గజ సంస్థ తమిళనాడుకు వస్తున్న వైనం ఆ రాష్ట్ర వాసులకే కాదు.. దేశ వాసులకు సైతం స్వీట్ న్యూస్ గా చెప్పక తప్పదు.
This post was last modified on July 26, 2020 9:23 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…