ఒక్కోసారి అంతే. కాలం బాగున్నంత వరకు అన్ స్టాపబుల్ అన్నట్లుగా కొందరి జర్నీ ఉంటుంది. కానీ.. లెక్క తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. దేశంలో తిరుగులేని వ్యాపార దిగ్గజంగా.. తాను కోరుకున్నది సొంతం అయ్యే వరకు సామ దాన దండోపాయాల్లో దేనికైనా సరే సిద్దమన్నట్లుగా వ్యవహరించేందుకు గౌతమ్ అదానీ సిద్దంగా ఉంటారన్న పేరు మార్కెట్ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలా అని.. ఆయన గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. లీగల్ నోటీసులు వరుస పెట్టి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయని.. దాని కంటే మౌనంగా ఉండటం మంచిదనన మాట వినిపిస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలోనూ.. యూ ట్యూబ్ చానళ్లలోనూ ఎవరి మీదనైనా సరే.. వెనుకా ముందు చూసుకోకుండా చెలరేగిపోయే కొందరు బడా విశ్లేషకులు సైతం అదానీని విమర్శలు చేసే విషయంలో తటపటాయిస్తుంటారు. అలాంటి అదానీ పరిస్థితి ఇవాల్టి రోజున దారుణంగా మారింది. హిండెన్ బర్గ్ సంస్థ విడుదల చేసిన నివేదికతో మొదలైన అదానీ కుంగుబాటు.. రోజులు గడిచే కొద్దీ అంతకంతకూ ఇబ్బందికరంగా మారుతోంది. గురువారం ఒక్కరోజులో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఒక్కరోజులో ఇన్ని షాకులా? అన్న భావన కలుగక మానదు.
మరే సంస్థ అయినా సరే.. ఇలాంటివి ఎదురైతే ఈపాటికి బేర్ మనే పరిస్థితి. కానీ.. అదానీ కాబట్టి ఆ మాత్రం తట్టుకొని నిలబడే పరిస్థితి. ఈ రోజు (గురువారం) చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే..
This post was last modified on February 2, 2023 6:07 pm
ఉత్తరాది, కర్ణాటక రాష్ట్రాల సంగతేమో కానీ తెలుగులో టాక్సిక్ కథ దాదాపు ముగింపుకు వచ్చినట్టే. రెండో వారంలోకి అడుగు పెట్టకముందే…
మాజీ టీమిండియా క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడిగా జన్మించిన అనయా బంగర్, జెండర్ ట్రాన్సిషన్ తర్వాత మహిళగా తన జీవితాన్ని…
గజం భూమి వేలల్లో ఉంటేనే సాధారణ మధ్యతరగతి ప్రజలు లబోదిబోమనే పరిస్థితి నెలకొంటుంది. అలాంటిది.. లక్షలు పలికితే .. ఇంకేం…
ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కట్టకట్టుకొని ఢిల్లో మకాం వేసి వున్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత…
టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంచనాలకు అతీతంగా, లెక్కలకు అందకుండా అవి చేసే అద్భుతాల…
తెలుగులో కామెడీ సినిమాలతోనూ స్టార్ కావచ్చని ముందుగా రుజువు చేసింది రాజేంద్ర ప్రసాద్ అయితే.. ఆయన తరువాత ఆ స్థాయిలో…